Skip to main content

రోజు రోజుకి పెరుగుతున్న అవినీతి.

ప్రతిరోజూ పెరిగిపోతున్న అవినీతిని చూస్తుంటే భయమేస్తుంది. ఈ అవినీతికి అంతం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఒకప్పుడు లక్షలు, తర్వాత కోట్లు, ఇప్పుడయితే వందల కోట్లు, వేలకోట్లు! ప్రతి రోజు పేపరు చదువుతున్నప్పుడు వళ్ళు ఉడికి పోతుంది.

లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. లక్ష మంది కైనా ఉపయోగ పడుతుందా అనేదే ప్రశ్న. బహుశా పాలక వర్గానికి చెందిన లక్ష మందికి ఉపయోగ పడుతుందేమో? ఈ రోజు జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్వ్యూ చూసాను. అయన చెప్పే విషయాలు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. ఉదాహరణకి రెండు రూపాయలకు కిలో బియ్యం మరియు ఉచిత కరెంటు. ఉచిత కరెంటు కోసమై రెండొందల కోట్లు కర్చవుతుంది. రెండు రూపాయలకు కిలో బియ్యం ఉచితంగా పంచి పెట్టినా కర్చు 800 కోట్లు మించదు. అంటే లక్ష కోట్ల బడ్జెట్ లో ప్రజలకు వీళ్ళు తాయిలం వేసేది వెయ్యి కోట్లు. మిగతాతొంభై తోమ్మిదివేల కోట్ల రూపాయలు నిరాటంకంగా కైంకర్యం చేయడానికి ఇదొక రాజ మార్గం.

ఆయన్ రాండ్ అనే ప్రముఖ రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, "సంక్షేమకర్యక్రమల పేరుతో నిరంకుశత్వానికి బాట వేయడం చాలా సులభం". ఇప్పుడు రాష్ట్రం లో అదే జరుగుతోంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల బూచి చూపుతున్నారు. వాళ్ళు మాత్రం కోట్లు వెనకేస్తూ, అడిగిన వారిపై ఎదురు దాడికి పాల్పడుతున్నారు.

ఎన్ని అనుకుని ఏం లాభం! పరివర్తన ఓటు వేసేవారిలో రావాలి. ఓటు వేయకుండా నీతులు వల్లించే మన మధ్య తరగతి వారిలో రావాలి. డబ్బులు తీసుకోకుండా, మద్యం తాగకుండా ఓటు వేయగలిగిన నాడు, అలాగే అలోచించగలిగే ప్రతి మనిషీ కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కర్తవ్యోన్ముఖుడై తనవంతు బాధ్యత నిర్వర్తించినప్పుడు మాత్రమే మార్పు సాధ్య పడుతుంది.

Comments

Popular posts from this blog

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...