Skip to main content

ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆ మధ్య మెదక్ జిల్లాలో మాట్లాడుతూ 'మీరు, మేం' అంటూ ఆంధ్రా, తెలంగాణా లను వేరు చేసి మాట్లాడారు. ఆయన ఇంకా సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి గా ఉన్నారని మరిచిపోయారేమో ననిపించింది .అయితే అతనికి తెలుగు రాదనో, మరోటో అనుకోని సరిపెట్టుకుందా మనుకుంటే ఇటీవల రచ్చబండ సందర్భంగా చేసిన వ్యాఖ్య మరీ వికృతంగా ఉంది.

పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే  బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు.

తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.

Comments

  1. ముస్లింల వోట్ల కోసం అలా మాట్లాడి ఉంటాడు. హిందువులలోని వివిధ కులాల వోట్ బ్యాంక్ వాళ్ల పార్టీకి ఎలాగూ ఉంది కనుక హిందువులు వోట్లు వెయ్యకపోవడం జరగదు అనుకున్నాడు. అంతే.

    ReplyDelete
  2. ఏ కారణం లేకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండమని చెప్పారా? రాహుల్ గాంధీ ఏ కారణం లేకుండానే అతివాదుల వల్లే ముప్పు ఉంది అని హెచ్చరించారా? ఏ కారణం లేకుండానే ఎక్కడో కూర్చుని ముష్రాఫ్ బెదిరిస్తున్నారంటారా? ముస్లిం ల పేరుతో హైదరాబాదు లోకి తీవ్రవాదులు చేరిపోయారని నా అనుమానం. భారతదేశం లో ఏది జరిగినా ముందు అందరి చూపూ హైదరాబాద్ మీదే ఉంటుంది. ఈ విషయం కె సి ఆర్ గారు అర్ధం చేసుకోరు. ఎవరి గోల వారిదే!!

    ReplyDelete
  3. ప్రవీన్ శర్మ గారు

    కాంగ్రేస్ వారికి వొటు బ్యాంకు రాజకీయాలు మామూలే. కానీ ఇంత బాహాటంగా, అదీ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడడం ఆ పార్టీ దిగజారుడు తనానికి పరాకాష్టగా అనిపిస్తుంది.

    నీహారిక గారు

    మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. టపాలో వ్రాసినదానికి, మీరు చెప్పిన దానికి సంబంధం ఏమిటి?

    Anonymous

    ఇంతమంది ఒకే సారి గొంతు కలపడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. కేంద్రం లోనివారు బెంగాల్ ఎలక్షన్లను ద్రుష్టిలో పెట్టుకుని అన్నారనుకున్నా, మన సీయెం గారికి ఏమవసరం. అమ్మ గారితో గొంతు కలిపి మార్కులు కొట్టేద్దమనేమో!

    ReplyDelete
  4. మజ్లీస్ మద్దతుకోసం కావచ్చు.

    ReplyDelete
  5. కావచ్చు నిజమే. కాని వారెప్పుడూ మద్దతు ఇవ్వడానికి రడీగానే ఉంటారుగా!

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...