Skip to main content

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను. 

మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను.

రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను. 

ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.


గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు. 

దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది. 

ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటారు. అందులో కొన్ని బూతు అర్థాలను కూడా స్ఫురించేలా ఉంటాయి. ఇవన్నీ హిట్లకోసం చేసే ప్రయత్నాలన్న మాట!


Comments

  1. ఈ స్క్రీన్‌షాట్ చూడండి: http://vizaghost.net/images/Clipboard01.jpg మూఢ నమ్మకాల విషయంలో పాలక వర్గాన్ని విమర్శిస్తూ వ్రాసిన టాపిక్‌ని ఎక్కువ మంది చదవలేదు.

    ReplyDelete
  2. కొంతవరకూ మీ ఆలోచన కరెక్ట్ అయినా మీరు టపా పెట్టిన టైం ఈ హిట్స్ విషయం లో చాలా ముఖ్యం కనుక మీ కంక్లూషన్ లాజికల్ గా కరెక్ట్ కాదు.. నేను అరుణాచల్ ప్రదేశ్ గురించి పెట్టిన టపా చూశాను కానీ దాని ముందు టపా గురించి ఇప్పుడు మీరు చెబితే తప్ప నాకు తెలియదు.. భారతకాలమానం ప్రకారం ఆదివారం రాత్రి టపా పెట్టండి ఎక్కువ హిట్స్ వస్తాయి.. ఈ విధంగా రెండు వారాలు చెయ్యండి అప్పుడు అవి పోల్చి చూడండి..(ఏదో ఒక ఐదు పైసల సలహా నచ్చకపోతే పిచ్చపిచ్చగా లైట్ తీస్కోండి ;))

    ReplyDelete
  3. అవినీతిపై యుద్ధం సంగతి అందరూ చాలాచోట్ల చదివీ/వినే ఉంటారు కాబట్టి కొత్తవిషయం కాదని చదవలేదు. గూగులోడి వార్త ఎక్కడా వినలేదని చెప్పి తెరిచి చూశారు.

    ReplyDelete
  4. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం ఉన్నవాళ్లు అవినీతి వ్యతిరేక పోరాటాలని అర్థం చేసుకుంటారా? అవినీతి విషయంలో వాళ్లు చెప్పేవి పైపై కబుర్లే. అవినీతి గురించిన మీ టాపిక్‌లో మొదటి కామెంట్ చదివారు కదా, అతను ఏమి వ్రాసాడో.

    ReplyDelete
  5. కార్తీక్ గారు,

    నా ఉద్దేశం వివాదాస్పదంగా ఉన్న విషయాలపై చదువరులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని ఒక పరిశీలన మాత్రమే. మీ సలహాకి ధన్యవాదాలు.

    ప్రవీణ్ గారు,

    లింక్స్ కి ధన్యవాదాలు.

    అనానిమస్,

    అది కూడా పాయింటే.

    ReplyDelete
  6. స్క్రీన్‌షాట్ల మీద క్లిక్ చేసి చూడండి. మనవాళ్ళకి సినిమాల మీద ఉన్న ఆసక్తి సమాజం మీద లేదని అర్థమవుతోంది. బజ్‌లో నన్ను అనుసరించేవాళ్ళూ ఉన్నారు. వాళ్ళలో కొందరు తెలంగాణావాదులు, కొందరు నాస్తికులు, స్త్రీలకి సంబంధించిన ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్న కొందరు ఉన్నారు. సినిమాలూ, సొల్లు కబుర్ల గురించి వ్రాస్తే ఫాలోవర్స్ పెరుగుతారు కానీ సినిమాల మీద నాకు అంత ఆసక్తి లేదు. చిన్నప్పుడు సమాజం గురించి ఏమీ తెలియని రోజుల్లో సినిమా పత్రికలే చదివేవాడ్ని. సమాజంలో సినిమాలు కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గ్రహించడానికి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...