కరుణానిధి చివరికి పంతం నెగ్గించుకున్నాడు. ఎ. రాజా, టి. ఆర్. బాలు తిరిగి కేంద్ర మంత్రులు కాబోతున్నారు. పరమ అవినీతి పరులని మన్మోహన్ సింగ్ మొత్తుకున్నా అతని మాట కరుణానిధి లెక్క చెయ్య లేదు. ఆ క్వాలిఫికేషనే DMK అధినేత వత్తిడికి ముఖ్య కారణం అని వేరే చెప్ప నవసరం లేదను కుంటాను. బాలు స్వయంగా తన కొడుకు కంపెనీకి గ్యాస్ సరఫరా కుంభకోణంలో ఇరుక్కుంటే, రాజా ఏమో 60,000 ల కోట్ల రూపాయల స్పెక్ట్రం అలోకేషన్ కుంభకోణం లో పాత్ర ధారి. ఇప్పుడు అవినీతి పూర్తిగా వ్యవస్తీకృత మైందన్న విషయానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదేమో? అధినేతలకు గాని, వారి అనుచరులకు గాని తమ అవినీతి భాగోతాలను ప్రజలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. వారు ఎంత సేపు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించి వచ్చే ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టి నెగ్గుదామా అనే చూస్తున్నారు. అవినీతి వల్ల తాము ఓడిపోతామేమో అన్న ఆలోచనే లేదు. ఎన్ని అవినీతి కుంభకోణాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రబల సాక్ష్యంగా నిలుస్తుందాయే!
జీవితంలో చీకటి, వెలుగు రెండూ ఉంటాయి. ఒకటే కావాలని కోరేవారికి రెండోది బోనస్గా వస్తుంది.