ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన జిల్లా కడప. రాయల సీమ ప్రాంతానింకి చెందిన ఈ ప్రాంతానికి ఎప్పటినుంచి గుర్తింపు ఉందో ఇదమిద్ధంగా తెలియక పోయినా రామాయణంలోని కిష్కింధ కాండ ఈ ప్రదేశం లోనే జరిగినట్లు చెపుతారు. 7వ శతాబ్దంలో చైనా చరిత్ర కారుడు హుయాన్ త్సాంగ్ ఇక్కడ పర్యటించి గ్రంథస్తం చేసినట్టు తెలుస్తుంది. కనీసం పదవ శతాబ్దం నుంచి ఈ పేరుతొ ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. పదకొండవ శతాబ్దం నుండి చోళుల ఆధీనం లో ఉన్న కడప పధ్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. దరిమిలా క్రీ శ 1565 లో నిజాం చేత ఆక్రమించుకో బడింది. క్రీ శ 1800 లో నిజాం నవాబు సీడెడ్ జిల్లాలలో భాగంగా దీన్ని బ్రిటిష్ వారికి సమర్పించాడు. 1820 నుండి 1829 వరకు జిల్లా కలెక్టరు గా ఉన్న సి.పి.బ్రౌన్ ఇక్కడి భాష, సంస్కృతుల పై విశేష కృషి జరిపాడు. బ్రిటిష్ వారి హయాం లో Cuddapah గా వ్యవహరించ బడిన జిల్లా పేరును 2005 ఆగస్టు 19 నుండి తిరిగి అధికారికంగా Kadapa గా మార్చారు. ఈ ప్రాంతం యోగి వేమన, అన్నమా చార్యులు, పోతులూరి వీర బ్రహ్మం, కవయిత్రి మొల్ల మొదలైన గొప్ప కవులు, వాగ్గేయ కారులకు పుట్టినిల్లు. వీర
జీవితంలో చీకటి, వెలుగు రెండూ ఉంటాయి. ఒకటే కావాలని కోరేవారికి రెండోది బోనస్గా వస్తుంది.