Skip to main content

కడప జిల్లా పేరు మార్పు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన జిల్లా కడప. రాయల సీమ ప్రాంతానింకి చెందిన ఈ ప్రాంతానికి ఎప్పటినుంచి గుర్తింపు ఉందో ఇదమిద్ధంగా తెలియక పోయినా రామాయణంలోని కిష్కింధ కాండ ఈ ప్రదేశం లోనే జరిగినట్లు చెపుతారు. 7వ శతాబ్దంలో చైనా చరిత్ర కారుడు హుయాన్ త్సాంగ్ ఇక్కడ పర్యటించి గ్రంథస్తం చేసినట్టు తెలుస్తుంది. కనీసం పదవ శతాబ్దం నుంచి ఈ పేరుతొ ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

పదకొండవ శతాబ్దం నుండి చోళుల ఆధీనం లో ఉన్న కడప పధ్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. దరిమిలా క్రీ శ 1565 లో నిజాం చేత ఆక్రమించుకో బడింది. క్రీ శ 1800 లో నిజాం నవాబు సీడెడ్ జిల్లాలలో భాగంగా దీన్ని బ్రిటిష్ వారికి సమర్పించాడు. 1820 నుండి 1829 వరకు జిల్లా కలెక్టరు గా ఉన్న సి.పి.బ్రౌన్ ఇక్కడి భాష, సంస్కృతుల పై విశేష కృషి జరిపాడు. బ్రిటిష్ వారి హయాం లో Cuddapah గా వ్యవహరించ బడిన జిల్లా పేరును 2005 ఆగస్టు 19 నుండి తిరిగి అధికారికంగా Kadapa గా మార్చారు.

ఈ ప్రాంతం యోగి వేమన, అన్నమా చార్యులు, పోతులూరి వీర బ్రహ్మం, కవయిత్రి మొల్ల మొదలైన గొప్ప కవులు, వాగ్గేయ కారులకు పుట్టినిల్లు. వీరే కాక అల్లసాని పెద్దన, అయ్యలరాజు రామ భద్రుడు, రామరాజ భూషణుడు, తాళ్ళ పాక తిమ్మక్క, నాచన సోముడు, కవి చౌడప్ప కూడా ఇక్కడి వారే అని చెప్ప బడుతుంది. వీరే కాక ఆధునిక కాలానికి చెందిన గడియారం వెంకట శేష శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రా రెడ్డి, మొదలైన వారు కూడా ఇక్కడి వారే.

కడప జిల్లాకి ఆపేరు 'గడప' అనే తెలుగు పదం నించి వచ్చిందని చెపుతారు. భారత దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమల దేవస్థానానికి ముఖ ద్వారం గా వుండడం వల్ల కడప అనే పేరు వచ్చినట్లుగా ప్రచారంలో వుంది.

ఇంతటి సంస్కృతి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన జిల్లా జిల్లా పేరును ఒక్క కలం పోటుతో Y.S.రాజ శేఖర్ రెడ్డి జిల్లా గా మార్చి వేసారు. దేశ సంస్కృతీ సంపదల ఆన వాళ్ళను రాజకీయ కారణాలతో నాశనం చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుండి వచ్చింది? రాజ శేఖర రెడ్డి కన్నా ముందే గొప్ప నాయకులైన యన్. టి. రామా రావు, పి. వి. నరసింహా రావు ల పేర్ల పైన ఏ జిల్లాలకు పేర్లు పెట్టారు? అయినా ఇప్పుడు ఇంత అత్యవసరంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఇప్పటికే తురుష్క దండ యాత్రల వల్ల కొన్ని, బ్రిటిష్ వారి హయాంలో మరిన్ని చారిత్రక అవశేషాలైన పట్టణాల, మండలాల పేర్లను కోల్పోయాం. ఇప్పుడిక ఈ రకమైన ఆనవాయితీ ఎక్కడి వరకు వెళ్తుందో మరి!

Comments

  1. ఇంత పొడవైన పేర్లు మన జిల్లాలకి అవసరమా ? ఇలాంటి చర్యల వల్ల పేరుప్రతిష్ఠలు లేకుండా దెబ్బతినేది జిల్లాకేంద్రాలు. అసలే వాటికి ఏ ప్రాధాన్యమూ లేదు. ఇదివఱకు కడపజిల్లా అంటే దాని ముఖ్యపట్టణం కడప అని గుర్తుపట్టేవాళ్ళం. ఇప్పుడు డా|| (ఈ బిరుదు కూడా జిల్లాపేరులో కలిపేశారు) వై.ఎస్.(ఇంటిపేరు కూడా జిల్లాపేరులో కలిపేశారు) రాజశేఖరరెడ్డి (కులం పేరు కూడా జిల్లా పేరులో కలిపేశారు) జిల్లా అని పలకాలన్నా రాయాలన్నా ఎంత ఇబ్బంది ? చనిపోయిన వై.ఎస్. తప్ప కడపజిల్లాలో మహానుభావులెవరూ పుట్టలేదా ? అనే ప్రశ్నకూడా తలెత్తుతోంది ? అన్నమాచార్యులేమయ్యాడు ? వేమన ఏమయ్యాడు ? పండిత పుట్టపర్తి నారాయణాచార్యులేమయ్యారు ? (ఈ చివఱాయన విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆ మధ్య ప్రొద్దుటూరులో కూలగొట్టారు)

    -- తాడేపల్లి

    ReplyDelete
  2. విజయనగరం జిల్లాకి ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించిన తాండ్ర పాపారాయుడు పేరు పెట్టలేదు. ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులతో అవకాశవాద పేరు పెట్టుకున్న విజయరామ గజపతి పేరు విజయనగరం జిల్లాకి ఉంది. ఇప్పుడు కడప జిల్లాకి ఒక ఫాక్షనిస్ట్ పేరు పెట్టడం జరిగింది.

    ReplyDelete
  3. ఇలాంటి దురాచారాల్ని ఎదించలేని మన బలహీనత వికృత చేష్టలు చేసేవారికి బలం . ఆబలంతోనే కదా ఏడుకొండలనే మింగాలని చూసినది .

    ReplyDelete
  4. పొట్టి శ్రీరాములు గారి పేరు ఒక జిల్లాకు పెట్టటానికి యాభై సంవత్సరాలు పట్టింది, అదే రాజశేఖరుడి పేరెట్టటానికి యాభై రూజులు కూడా పట్టలేదు.

    ReplyDelete
  5. చరిత్రకెపుడో చెదలు పట్టాయి. బలవంతుడిదే రాజ్యం. కానీ ఎప్పుడో చలిచీమలు లేవవా !

    ReplyDelete
  6. బహుశ చరిత్ర, సంస్కృతులను 'నామ' రూపాల్లేకుండా నాశనం చేయడం అంటే ఇదే నేమో?

    తాడేపల్లి, ప్రవీణ్, దుర్గేశ్వర, కన్న గాడు, ఎస్. ఆర్. రావు గార్ల వ్యాఖ్యలకు ధన్య వాదాలు.

    ReplyDelete
  7. ఇది జోక్ కాకపోతే మరేమిటి? మా తాత మూడు సార్లు MLAగా, ఒక సారి MPగా పని చేశారు. అతని నియోజక వర్గంలో అతను పుట్టిన మండలానికి అతని పేరు పెట్టాలని డిమాండ్ చెయ్యగలను. ఆ మండలం నుంచి ఇంకొకాయన ఒక సారి MLA, ఒక సారి జిల్లా పరిషత్ చైర్మన్, ఒక సారి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. అతని కొడుకో, మనవడో ఆ మండలానికి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తారు. మండలాల పేర్లు సరిపోవంటే గ్రామాల పేర్లు కూడా మార్చాలి. గోపాలరావు అని పేరు ఉన్న MLA గారు చనిపోతే అతని మండలానికి గోపాల మండలం అని పేరు పెట్టారు. అతని తరువాత అదే మండలానికి చెందిన సుగ్రీవ రావు అనే పేరు ఉన్న అతను MLAగా పని చేసి చనిపోయారు. అప్పుడు ఆ మండలంలోని MLA స్వగ్రామానికి సుగ్రీవపురం అని పేరు పెట్టాలంటారు. ఆ MLA అవినీతిపరుడైనా ఫర్వాలేదు, చనిపోయిన మనిషిని స్మరించడం సంప్రదాయం అంటారు.

    ReplyDelete
  8. భారత దేశాన్ని కూడా ఓ రోజు సోనియా దేశంగానో, రాజీవ్ దేశం గానో మారుస్తారు వీళ్ళు. ఇదివరకు ఓ కూడలికో, ఓ రోడ్డుకో పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఊళ్ళకు పేర్లు పెడుతున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ నుండి దేవుడే రక్షించాలి.

    ReplyDelete
  9. గాంధీ రోడ్, నెహ్రూ చౌక్, అంబేద్కర్ జంక్షన్ లాంటి పేర్లు ఉన్న వీధులు చూశాను. వాళ్ళు జాతి నాయకులుగా భావించబడే వ్యక్తులు. వాళ్ళ సంగతి వేరు. హైదరాబాద్ లోనూ, శ్రీకాకుళం జిల్లాలోనూ జళగం వెంగళరావు పేరు ఉన్న వీధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జిల్లాలకే రాజకీయ నాయకుల పేర్లు పెడుతున్నారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ