Skip to main content

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది.

ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది. 

పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే.

ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు.

ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు.

నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులుబాటు ఉండదు. అయితే ప్రైవేటులో ఉన్న పోటీ తత్వం వల్ల నిపుణులైన ఉద్యోగులను  కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు వేతనాలను సమీక్షిస్తుంది. అదికూడా నిపుణులైన వారికి మాత్రమే. 

ఇక ప్రభుత్వం విషయానికి వస్తే, మన ప్రజా ప్రభుత్వాలకు ఉన్న జవాబుదారీ తనం ఎంతో పేపరు చదివే ప్రతి ఒక్కరికీ తెలుసు. తాము ఇచ్చిన GOలు ప్రజలకిచ్హిన వాగ్దానాలు, అవినీతి ఆరోపణలు, కోర్టు మొట్టికాయలు ఇలా ఎన్నని చెప్పలి? దేనికి స్పందించకుండా యధేచ్చగా తమ దోపిడీ యఙ్ఞాన్ని మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తాయి మన ప్రభుత్వాలు.

అలాంటిది ఇక ప్రభుత్వ ఉద్యోగుల గోడు పట్టించు కునేదెవరు? రాష్ట్ర చరిత్రలో  ఉద్యోగులు సమ్మె చేయకుండా ఎన్నిసార్లు pay revision జరిగింది? ఎన్నిసార్లు వారి న్యాయమైన కోర్కెలకు పరిష్కారం లభించింది? ప్రభుత్వం తన బాధ్యతలు తాను సక్రమంగా నిర్వర్తిస్తే సమ్మెలు చేసేవారెవరు?

మధ్య యుగాల నాటి బానిస చాకిరీల విముక్తికై ఎన్నో త్యాగాలతో కూడిన పోరాటాలు చేసి సంపాదించుకున్నది సమ్మె హక్కు. అలాంటి హక్కును, ILO స్పూర్తికి విరుద్ధంగా ఒక్క కలం పోటుతో హక్కులను కాలరాచే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బహుషా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇలాంటి GO ఇచ్చే సాహసం చేసి ఉండదు.

ప్రజల్లో reforms తీసుకు రావాలనుకునే ముందు ప్రభుత్వం తాన పద్ధతులను ముందు సవరించుకోవాల్సి ఉంటుంది. 610 జీవో విడుదల చేసి పాతికేళ్ళు దాటినా, ఇప్పటివరకూ అమలుకు నోచుకోలేదు. నిర్నయాలు, నియామకాలు, వాగ్దానాల అమలు, ఇలా ప్రతి దానిలోనూ అవకతవకలే. 

ఇంతటి అవక తవకలతో కూడిన ప్రభుత్వం తనపై మాత్రం ఎవ్వరూ నిరసన తెలుపకూడదని చెప్ప బూనడం నియంతృత్వం తప్ప మరోటి కాదు. ఈ GO కేవలం ఒక ప్రాంతం వారికే వ్యతిరేకంగా ఉందని కొందమంది అప్పుడే చంకలు గుద్దుకోవడం మొదలు పెట్టారు. కానీ, భూతాన్ని తయారు చేసి వదిలాక అది ఎవరినైనా మింగుతుందని ప్రతి ఒక్కరూ భావించాలి.               


Comments

  1. పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు.

    Idi nenu asalu nammanu,andulo government jobs lo prati okkadu pani cheyyakunda jeetam teesukovali anukoe valle ekkuva.
    Inka cheppalante chesina paniki lancham kuda expect chestaru ga.
    ivi nenu vini telusukonnavi kadu,experience.
    I saw corruption every where in the government employees.
    teachers ayte okka sign pettesi velli vadi own school lo no,lekapote vere private school lo no patalu cheptadu.
    i have a friend in irrigation department,everday he will get lancham.
    vadu danni goppaga cheppukontadu,teesukoka pote kudaradu,evari vata vallaki vuntundi ani.
    naku ayte cheppu teesukoni kottalanipistundi.
    chese job ki responsibility feel avvam kani,rights matram kavali.
    evadyna kastapadi government job techu konte chalu,aa tarvata kastapada akkarledu anukone vade.
    deenni batti ardam avutundi ga government job chese vallu entha baga chestunnaro.

    ReplyDelete
  2. @అనానిమస్

    కరప్షన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది, వారి పై ఆఫీసర్లలో, రాజకీయ నాయకుల్లో అంతకన్నా ఎక్కువే ఉంది.

    కరప్షన్ ఆపడానికి శిక్ష ఈ జీవో అంటారా కొంపదీసి? మరి అంతకన్నా ఎక్కువ కరప్షన్ చేసే ఐఏస్, ఐపీఎస్, మినిష్తర్లకు ఏం షిక్ష విధిద్దాం?

    గాయం ఒకచోట ఉంటే మందు ఇంకో చోట పెడితే ప్రయోజనం ఏముంది?

    ReplyDelete
  3. అవినీతి ఎందుకు ఉందంటే "తమ ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు, సమాజం ఏమైపోతే మనకేమిటి" అనుకునే narrow minded ideas వలన. అటువంటి narrow minded ideasని విమర్శించకుండా ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచాలకోర్లు అంటే ప్రయోజనం ఉండదు. చంద్రస్వామి ప్రభుత్వ ఉద్యోగి కాదు. అతను ఎన్ని మోసాలూ, ఫోర్జరీలూ చెయ్యలేదు? అతను ప్రభుత్వ ఉద్యోగిలాగ వెయ్యి, రెండు వేలు లంచం తీసుకోలేదు. లక్షలు, కోట్లు తీసుకునేవాడు. మిడిల్ క్లాస్ వ్యక్తి పది వేలు రూపాయలు మింగితే డబ్బున్నవాడు పది కోట్లు రూపాయలు మింగగలడు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ