ఇప్పుడు బరిలో ఉన్న ముఖ్యమైన పార్టీల గుణగణాల పై ఒక పరిశీలన. కాంగ్రెస్ పార్టీ : ప్రస్తుతం ఈ పార్టీ తో ఏ ఇతర ప్రముఖ పార్టీ చేతులు కలపడానికి భయపడుతుంది. కారణం (ఎన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి) ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీనేతల కుంభకోణాలే. ఈ పార్టీ పాలనలో జలయజ్ఞం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచితవిద్యుత్తు మొదలైన కార్యక్రమాలు ఎంతో కొంత అమలైన మాట వాస్తవం. వీటి వల్ల లబ్ది పొందినవారు ఈ పార్టీ కే వోటు వేయడం సహజం. అయితే ఆలోచనా శీలురైన ప్రజలు ఈ పార్టీ అవినీతిపనులను ఎంతవరకు సమర్థిస్తారు అనే విషయం వేచి చూడాల్సిందే. తెలుగు దేశం - మహా కూటమి : ఈ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ కుంభ కోణాలను ఎండగట్టడంలో తల మునకలై ఉంది. ఇది మంచి వ్యూహమే ఐనప్పటికీ గతంలో చంద్ర బాబు పాలనలోనిఅవినీతి, కుంభ కోణాలు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక వీరు ఎంత సేపు వీరుఅవినీతి పై పోరాటం సాగిస్తున్నా మంటున్నారు కాని, అధికారం లోకి వస్తే నీతివంతమైన పరిపాలనకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. దానికి తోడు తెలంగాణా ఇవ్వాలా వద్దా అనే వాదోప వాదాలు ఎలాగూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకులకు ఈ కూటమి బలమైనప్రత్యా
జీవితంలో చీకటి, వెలుగు రెండూ ఉంటాయి. ఒకటే కావాలని కోరేవారికి రెండోది బోనస్గా వస్తుంది.