ఈరోజు టీవీలో జయప్రకాష్ నారాయణ గారి కార్యక్రమం చూసాను. అయన చెప్పే వాస్తవాలు విటుంటే కళ్లు తిరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మార్పూ రావాలనే కోరిక ఉంటుంది. అయితే నా ఒక్కడివల్ల ఏం అవుండానే నిర్లిప్తత ఉంటుంది. దీన్ని అవకాశవాద రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించు కుంటున్నాయి. ఆయన విశ్లేషణ వింటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. వచ్చే బడ్జెట్ లో 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక ఓటు పై దాదాపు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి అవినీతినే ఆశయంగా మలుచుకున్న పార్టీలు ఓటు పై వందో వెయ్యో ఖర్చు చేయడానికి వెనుకాడవు. ఈవిషయాలను సామాన్య ప్రజానీకానికి ప్రతి ఆలోచించే వ్యక్తీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ ఓటును సక్రమంగా వినియోగించ గలిగిన నాడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం స్ద్ధిస్తుందని చెప్పితే అతిశయోక్తి కాదు.
ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది. పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.