Skip to main content

రాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

ఇప్పుడు బరిలో ఉన్న ముఖ్యమైన పార్టీల గుణగణాల పై ఒక పరిశీలన.

  1. కాంగ్రెస్ పార్టీ: ప్రస్తుతం ఈ పార్టీ తో ఏ ఇతర ప్రముఖ పార్టీ చేతులు కలపడానికి భయపడుతుంది. కారణం (ఎన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి) ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీనేతల కుంభకోణాలే. ఈ పార్టీ పాలనలో జలయజ్ఞం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచితవిద్యుత్తు మొదలైన కార్యక్రమాలు ఎంతో కొంత అమలైన మాట వాస్తవం. వీటి వల్ల లబ్ది పొందినవారు ఈ పార్టీ కే వోటు వేయడం సహజం. అయితే ఆలోచనా శీలురైన ప్రజలు ఈ పార్టీ అవినీతిపనులను ఎంతవరకు సమర్థిస్తారు అనే విషయం వేచి చూడాల్సిందే.
  2. తెలుగు దేశం - మహా కూటమి: ఈ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ కుంభ కోణాలను ఎండగట్టడంలో తల మునకలై ఉంది. ఇది మంచి వ్యూహమే ఐనప్పటికీ గతంలో చంద్ర బాబు పాలనలోనిఅవినీతి, కుంభ కోణాలు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక వీరు ఎంత సేపు వీరుఅవినీతి పై పోరాటం సాగిస్తున్నా మంటున్నారు కాని, అధికారం లోకి వస్తే నీతివంతమైన పరిపాలనకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. దానికి తోడు తెలంగాణా ఇవ్వాలా వద్దా అనే వాదోప వాదాలు ఎలాగూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకులకు ఈ కూటమి బలమైనప్రత్యామ్నాయంగా కనిపిస్తుందనటం లో అతిశయోక్తి లేదు.
  3. ప్రజా రాజ్యం: కొత్త గా పెట్టబడిన ఈ పార్టీ చిరంజీవి గ్లామర్ పై పూర్తి గా ఆధార పడింది. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణా అనే నేతి బీరకాయలను ప్రధాన పాలసీగాచెప్పుకుంటుంది. ఇప్పటివరకు నిర్మాణం జరిగిన పార్టీ పలక వర్గంలో ఆ పార్టీ చెప్పే 'సామాజికన్యాయం' ఎక్కడా కనపడ్డం లేదు. అందుకే నేతి బీర కాయ అనవలిసి వచ్చింది. ఈ పార్టీ మరోఅస్త్రం కాంగ్రెస్, టీడీపీ ల అవినీతి. అయితే ఈ పార్టీ కుడా తాము అధికారం లోకి వస్తే అవినీతినిఎలా నిర్ములిస్తారో, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. ఎన్నికల్లో మద్యం, డబ్బు వినియోగించమని హామీ ఇవ్వటం లేదు. పైగా అన్ని పార్టీల 'ఘనాపాటీ' లను అక్కున చేర్చుకుంటున్నారు. పురిటి లోనే బంధు గణాలకు పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ గా పెరుమోసింది. అయితేఇవన్నీ ఆలోచించే సమయం లేని ప్రజలు ఈ పార్టీకి కుడా పెద్ద పీట వేస్తారనటంలో ఆశ్చర్యం లేదు.
    ఈ పరిస్థితి లో మూడు కూటములకు దాదాపుగా సమానమైన సీట్లు వస్తాయని అనిపిస్తుంది. అంటే ప్రతి కూటమికి 90 నుండి 110 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది హంగ్ అసెంబ్లీ కి దారి తీయవచ్చు. ఆ పరిస్థితిలో చిరంజీవి, చంద్ర బాబు చెరి రెండున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రి పదవిలో ఉండవచ్చు. ముందు చిరంజీవికి అవకాశం దక్కితే రెండున్నరేళ్ళు చేస్తాడు. చంద్రబాబు కి దక్కితే?

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. >> "చంద్రబాబు కి దక్కితే?"

    ఆ పరిస్థితే వస్తే, పదవి చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే తెరాస, కమ్యూనిస్టుల మద్దతూ అతనికే + వాళ్లకీ ఎన్నో కొన్ని సీట్లొస్తాయి కాబట్టి. బాబొక సారి ముఖ్యమంత్రయ్యాక ప్రరాపా గతేమవుతుందో ఊహించటం కష్టం కాదు.

    ఐనా, మీరు 'సపోర్ట్ లోక్ సత్తా' అని పేరెట్టుకుని మిగిలినోళ్లలో ఎవరు ముఖ్యమంత్రవుతారనే దాని మీద చర్చ లేవదీయటం ఏంటో :-)

    ReplyDelete
  3. అబ్రకదబ్ర గారి వ్యాఖ్య కి ధన్య వాదాలు.

    లోక్ సత్తాను సపోర్ట్ చేయడమే ఉద్దేశమైనప్పటికి సమకాలీన రాజకీయాలు చర్చించడంలో తప్పులేదనుకుంటాను. లోక్ సత్తాను సపోర్ట్ చేస్తున్నప్పటికీ, ఈ ఎన్నికలలో లోక్ సత్తా ముఖ్య మంత్రిని చూస్తామనే భ్రమలో లేను. అయితే ఆ వైపుకు జనం చైతన్య వంటమవ్వాలనేదే కోరిక, ఈ బ్లాగు లోని ప్రతి పోస్ట్ లో కుడా అంతర్లీనంగా ఉండే భావం కుడాను. విజ్ఞులంతా ఈ చర్చలో పాల్గొనాలనేదే నా కోరిక.

    ReplyDelete
  4. చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వడానికి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి.

    ఒకటి సొంతంగా మెజారిటీ సాధించడం - ఇది కష్టమే అయినా ప్రజల మనసులో ఏముందో ఎవరూ చెప్పలేము.

    రెండోది హంగ్ అసెంబ్లీ - ఇది చాలా వరకు సాధ్యం. ఈ సందర్భంలో వై ఎస్ లేక చంద్రబాబు చిరంజీవికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చెయ్యవచ్చును. ఎందుకంటే వై ఎస్, చంద్రబాబు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు కాబట్టీ.

    ఇక వై ఎస్ లేక చంద్రబాబు సొంతంగా మెజారిటీ తెచ్చుకొంటే వాళ్ళే ఎలాగూ ముఖ్యమంత్రి అవుతారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ