Skip to main content

రాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

ఇప్పుడు బరిలో ఉన్న ముఖ్యమైన పార్టీల గుణగణాల పై ఒక పరిశీలన.

  1. కాంగ్రెస్ పార్టీ: ప్రస్తుతం ఈ పార్టీ తో ఏ ఇతర ప్రముఖ పార్టీ చేతులు కలపడానికి భయపడుతుంది. కారణం (ఎన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి) ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీనేతల కుంభకోణాలే. ఈ పార్టీ పాలనలో జలయజ్ఞం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచితవిద్యుత్తు మొదలైన కార్యక్రమాలు ఎంతో కొంత అమలైన మాట వాస్తవం. వీటి వల్ల లబ్ది పొందినవారు ఈ పార్టీ కే వోటు వేయడం సహజం. అయితే ఆలోచనా శీలురైన ప్రజలు ఈ పార్టీ అవినీతిపనులను ఎంతవరకు సమర్థిస్తారు అనే విషయం వేచి చూడాల్సిందే.
  2. తెలుగు దేశం - మహా కూటమి: ఈ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ కుంభ కోణాలను ఎండగట్టడంలో తల మునకలై ఉంది. ఇది మంచి వ్యూహమే ఐనప్పటికీ గతంలో చంద్ర బాబు పాలనలోనిఅవినీతి, కుంభ కోణాలు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక వీరు ఎంత సేపు వీరుఅవినీతి పై పోరాటం సాగిస్తున్నా మంటున్నారు కాని, అధికారం లోకి వస్తే నీతివంతమైన పరిపాలనకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. దానికి తోడు తెలంగాణా ఇవ్వాలా వద్దా అనే వాదోప వాదాలు ఎలాగూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకులకు ఈ కూటమి బలమైనప్రత్యామ్నాయంగా కనిపిస్తుందనటం లో అతిశయోక్తి లేదు.
  3. ప్రజా రాజ్యం: కొత్త గా పెట్టబడిన ఈ పార్టీ చిరంజీవి గ్లామర్ పై పూర్తి గా ఆధార పడింది. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణా అనే నేతి బీరకాయలను ప్రధాన పాలసీగాచెప్పుకుంటుంది. ఇప్పటివరకు నిర్మాణం జరిగిన పార్టీ పలక వర్గంలో ఆ పార్టీ చెప్పే 'సామాజికన్యాయం' ఎక్కడా కనపడ్డం లేదు. అందుకే నేతి బీర కాయ అనవలిసి వచ్చింది. ఈ పార్టీ మరోఅస్త్రం కాంగ్రెస్, టీడీపీ ల అవినీతి. అయితే ఈ పార్టీ కుడా తాము అధికారం లోకి వస్తే అవినీతినిఎలా నిర్ములిస్తారో, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. ఎన్నికల్లో మద్యం, డబ్బు వినియోగించమని హామీ ఇవ్వటం లేదు. పైగా అన్ని పార్టీల 'ఘనాపాటీ' లను అక్కున చేర్చుకుంటున్నారు. పురిటి లోనే బంధు గణాలకు పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ గా పెరుమోసింది. అయితేఇవన్నీ ఆలోచించే సమయం లేని ప్రజలు ఈ పార్టీకి కుడా పెద్ద పీట వేస్తారనటంలో ఆశ్చర్యం లేదు.
    ఈ పరిస్థితి లో మూడు కూటములకు దాదాపుగా సమానమైన సీట్లు వస్తాయని అనిపిస్తుంది. అంటే ప్రతి కూటమికి 90 నుండి 110 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది హంగ్ అసెంబ్లీ కి దారి తీయవచ్చు. ఆ పరిస్థితిలో చిరంజీవి, చంద్ర బాబు చెరి రెండున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రి పదవిలో ఉండవచ్చు. ముందు చిరంజీవికి అవకాశం దక్కితే రెండున్నరేళ్ళు చేస్తాడు. చంద్రబాబు కి దక్కితే?

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. >> "చంద్రబాబు కి దక్కితే?"

    ఆ పరిస్థితే వస్తే, పదవి చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే తెరాస, కమ్యూనిస్టుల మద్దతూ అతనికే + వాళ్లకీ ఎన్నో కొన్ని సీట్లొస్తాయి కాబట్టి. బాబొక సారి ముఖ్యమంత్రయ్యాక ప్రరాపా గతేమవుతుందో ఊహించటం కష్టం కాదు.

    ఐనా, మీరు 'సపోర్ట్ లోక్ సత్తా' అని పేరెట్టుకుని మిగిలినోళ్లలో ఎవరు ముఖ్యమంత్రవుతారనే దాని మీద చర్చ లేవదీయటం ఏంటో :-)

    ReplyDelete
  3. అబ్రకదబ్ర గారి వ్యాఖ్య కి ధన్య వాదాలు.

    లోక్ సత్తాను సపోర్ట్ చేయడమే ఉద్దేశమైనప్పటికి సమకాలీన రాజకీయాలు చర్చించడంలో తప్పులేదనుకుంటాను. లోక్ సత్తాను సపోర్ట్ చేస్తున్నప్పటికీ, ఈ ఎన్నికలలో లోక్ సత్తా ముఖ్య మంత్రిని చూస్తామనే భ్రమలో లేను. అయితే ఆ వైపుకు జనం చైతన్య వంటమవ్వాలనేదే కోరిక, ఈ బ్లాగు లోని ప్రతి పోస్ట్ లో కుడా అంతర్లీనంగా ఉండే భావం కుడాను. విజ్ఞులంతా ఈ చర్చలో పాల్గొనాలనేదే నా కోరిక.

    ReplyDelete
  4. చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వడానికి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి.

    ఒకటి సొంతంగా మెజారిటీ సాధించడం - ఇది కష్టమే అయినా ప్రజల మనసులో ఏముందో ఎవరూ చెప్పలేము.

    రెండోది హంగ్ అసెంబ్లీ - ఇది చాలా వరకు సాధ్యం. ఈ సందర్భంలో వై ఎస్ లేక చంద్రబాబు చిరంజీవికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చెయ్యవచ్చును. ఎందుకంటే వై ఎస్, చంద్రబాబు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు కాబట్టీ.

    ఇక వై ఎస్ లేక చంద్రబాబు సొంతంగా మెజారిటీ తెచ్చుకొంటే వాళ్ళే ఎలాగూ ముఖ్యమంత్రి అవుతారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...