ఎలక్షన్లు దగ్గర పడే కొద్ది విపరీతమైన రాజకీయ 'వ్యాపార' ప్రకటనలు టీవీలో, పత్రికలలో కనిపిస్తున్నాయి. అధికార పక్షమైతే ఏకంగా ప్రజల డబ్బు తోనే ప్రకటనలు గుప్పిస్తుంది. అయితే ఇప్పుడు ప్రకటించడంలో కూడా కొత్త ధోరణి కనిపిస్తోంది. దిన పత్రిక లోనైతే మకుటం (హెడ్ లైన్) రూపంలో, టీవీలోనైతే వార్తల మధ్యన ఒక వార్తగా స్ఫురించేటట్లుగా వేయించు కుంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రకటనలు, అది ప్రకటన అని తెలిసే విధంగా ఒక మూల స్పష్టంగా వ్రాయాలి. కాని ఎక్కువ ప్రీమియం వల్లనో ఏమో కాని, పత్రికల వారు, టీవీ వారు అది కూడా విస్మరిస్తున్నారు.
దురదృష్ట వశాత్తు మన దేశంలో ఎక్కువ మంది ఇంకా అమాయకపు ప్రజలే. ఇలాంటి ప్రకటనలు వారు నిజమైన వార్తలుగా నమ్మే అవకాశం ఎక్కువ. ఆ విధంగా ఇవి ప్రజల ఆలోచనలను కృత్రిమంగా ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ఇలాంటివి ప్రకటనలు వేసేటప్పుడు అవి ప్రకటనలని తెలిసేటట్టుగా జాగ్రత్త వహించడం మీడియా యొక్క కనీస బాధ్యత.
దురదృష్ట వశాత్తు మన దేశంలో ఎక్కువ మంది ఇంకా అమాయకపు ప్రజలే. ఇలాంటి ప్రకటనలు వారు నిజమైన వార్తలుగా నమ్మే అవకాశం ఎక్కువ. ఆ విధంగా ఇవి ప్రజల ఆలోచనలను కృత్రిమంగా ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ఇలాంటివి ప్రకటనలు వేసేటప్పుడు అవి ప్రకటనలని తెలిసేటట్టుగా జాగ్రత్త వహించడం మీడియా యొక్క కనీస బాధ్యత.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.