Skip to main content

గాంధీ భవన్, భీంరావ్ భాడా

ఈరోజు అసెంబ్లీ లో చర్చ చూసాను. గాంధీ భవన్ కి స్థలం అవసరమైంది, పార్టీ ఆఫీసు సరిపోవటం లేదు కాబట్టి. గవర్నమెంటు స్థలం ఇవ్వడానికి పూనుకొంది. గవర్నమెంటు స్థలం ఇస్తే ఏ గొడవా లేదు. అయితే గాంధీ భవన్ కి ఆనుకొని గవర్నమెంటు స్థలం లేదు కాబట్టి వెనుకనే ఉన్నా బస్తి లో 90 సంవత్సరాలుగా ఉంటున్న పట్టాదరులైన ప్రజల ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయించారు. వీరికి 350 గజాలలో మరో మురికివాడ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇంకో విషయమేమంటే దీనికోసం 13 కోట్ల ప్రజల డబ్బుని వెచ్చించారు.

ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తప్పక స్ఫురిస్తాయి.
  1. పార్టీ ఆఫీసు లకి భూములు కేటాయించే విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రభుత్వం ఎంత కావాలంటే అంత భూమి కేటాయించు కోవచ్చా?
  2. ప్రభుత్వ భూమి మాత్రమే ఇవ్వాలా? ప్రజలవద్దనుచి బలవంతంగా లాక్కుని ఆయా పార్టీలకు అవసరమైన చోట మాత్రమే ఇవ్వాలా?
  3. భూమిని ఇవ్వడమే కాక ప్రత్యేకమైన భూములు మాత్రమే ఇవ్వడానికి అవసరమైన మరికొంత ధనం వెచ్చించ వచ్చా?
  4. ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి వ్యతిరేకించినా (వారు చట్టపరంగా అ భూమికి అధికారులు... పట్టాదారులు) బలవంతంగా ఖాళీ చేయించే వెసులుబాటు ఉంటుందా?
  5. మనిషికి చట్టపరంగా తానూ కట్టుకున్న ఇంటిలో తాను నివసించే హక్కు లేదా?

విషయం లో రాజకీయ నాయకులు నిస్సిగ్గు గా తమను తాము సమర్ధించుకోవడం చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. ప్రజలకు చైతన్యం రావాలని వేచి చూడడం తప్ప ఇప్పట్లో చేయదగినది ఏమీ లేదేమో. కొన్ని ఉదాత్తమైన పనులకోసం వ్యక్తుల నుండి వారి ఆస్తులను తీసుకొని, ప్రత్యామ్నాయం కల్పిస్తే అర్థం ఉంది. అవి అంత గొప్ప ప్రజోపయోగమైన పనులై ఉండాలి. కాని ఇలా పార్టీ ఆఫీసుల కోసం, నాయకుల ఇళ్ళ కోసం ప్రజల ఆస్తులు కొల్ల గొట్టడం మొదలు పెడితే మానవ హక్కులకి అర్థం లేకుండా పోతుంది.

తమకు నిజంగా ప్రస్తుతమున్న కార్యాలయం సరిపోకపోతే దాన్ని ప్రభుత్వానికి ఏదయినా ప్రజోపయోగపు పని కోసం అప్పగించి వేరే చోట మరింత ఎక్కువ స్థలం కోరితే ఆ పార్టీకి ఎంతో గొప్పగా వుండేది.

Comments

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...