ఈరోజు అసెంబ్లీ లో చర్చ చూసాను. గాంధీ భవన్ కి స్థలం అవసరమైంది, పార్టీ ఆఫీసు సరిపోవటం లేదు కాబట్టి. గవర్నమెంటు స్థలం ఇవ్వడానికి పూనుకొంది. గవర్నమెంటు స్థలం ఇస్తే ఏ గొడవా లేదు. అయితే గాంధీ భవన్ కి ఆనుకొని గవర్నమెంటు స్థలం లేదు కాబట్టి వెనుకనే ఉన్నా బస్తి లో 90 సంవత్సరాలుగా ఉంటున్న పట్టాదరులైన ప్రజల ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయించారు. వీరికి 350 గజాలలో మరో మురికివాడ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇంకో విషయమేమంటే దీనికోసం 13 కోట్ల ప్రజల డబ్బుని వెచ్చించారు.
ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తప్పక స్ఫురిస్తాయి.
ఈ విషయం లో రాజకీయ నాయకులు నిస్సిగ్గు గా తమను తాము సమర్ధించుకోవడం చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. ప్రజలకు చైతన్యం రావాలని వేచి చూడడం తప్ప ఇప్పట్లో చేయదగినది ఏమీ లేదేమో. కొన్ని ఉదాత్తమైన పనులకోసం వ్యక్తుల నుండి వారి ఆస్తులను తీసుకొని, ప్రత్యామ్నాయం కల్పిస్తే అర్థం ఉంది. అవి అంత గొప్ప ప్రజోపయోగమైన పనులై ఉండాలి. కాని ఇలా పార్టీ ఆఫీసుల కోసం, నాయకుల ఇళ్ళ కోసం ప్రజల ఆస్తులు కొల్ల గొట్టడం మొదలు పెడితే మానవ హక్కులకి అర్థం లేకుండా పోతుంది.
తమకు నిజంగా ప్రస్తుతమున్న కార్యాలయం సరిపోకపోతే దాన్ని ప్రభుత్వానికి ఏదయినా ప్రజోపయోగపు పని కోసం అప్పగించి వేరే చోట మరింత ఎక్కువ స్థలం కోరితే ఆ పార్టీకి ఎంతో గొప్పగా వుండేది.
ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తప్పక స్ఫురిస్తాయి.
- పార్టీ ఆఫీసు లకి భూములు కేటాయించే విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రభుత్వం ఎంత కావాలంటే అంత భూమి కేటాయించు కోవచ్చా?
- ప్రభుత్వ భూమి మాత్రమే ఇవ్వాలా? ప్రజలవద్దనుచి బలవంతంగా లాక్కుని ఆయా పార్టీలకు అవసరమైన చోట మాత్రమే ఇవ్వాలా?
- భూమిని ఇవ్వడమే కాక ప్రత్యేకమైన భూములు మాత్రమే ఇవ్వడానికి అవసరమైన మరికొంత ధనం వెచ్చించ వచ్చా?
- ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి వ్యతిరేకించినా (వారు చట్టపరంగా అ భూమికి అధికారులు... పట్టాదారులు) బలవంతంగా ఖాళీ చేయించే వెసులుబాటు ఉంటుందా?
- మనిషికి చట్టపరంగా తానూ కట్టుకున్న ఇంటిలో తాను నివసించే హక్కు లేదా?
ఈ విషయం లో రాజకీయ నాయకులు నిస్సిగ్గు గా తమను తాము సమర్ధించుకోవడం చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. ప్రజలకు చైతన్యం రావాలని వేచి చూడడం తప్ప ఇప్పట్లో చేయదగినది ఏమీ లేదేమో. కొన్ని ఉదాత్తమైన పనులకోసం వ్యక్తుల నుండి వారి ఆస్తులను తీసుకొని, ప్రత్యామ్నాయం కల్పిస్తే అర్థం ఉంది. అవి అంత గొప్ప ప్రజోపయోగమైన పనులై ఉండాలి. కాని ఇలా పార్టీ ఆఫీసుల కోసం, నాయకుల ఇళ్ళ కోసం ప్రజల ఆస్తులు కొల్ల గొట్టడం మొదలు పెడితే మానవ హక్కులకి అర్థం లేకుండా పోతుంది.
తమకు నిజంగా ప్రస్తుతమున్న కార్యాలయం సరిపోకపోతే దాన్ని ప్రభుత్వానికి ఏదయినా ప్రజోపయోగపు పని కోసం అప్పగించి వేరే చోట మరింత ఎక్కువ స్థలం కోరితే ఆ పార్టీకి ఎంతో గొప్పగా వుండేది.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.