Skip to main content

గాంధీ భవన్, భీంరావ్ భాడా

ఈరోజు అసెంబ్లీ లో చర్చ చూసాను. గాంధీ భవన్ కి స్థలం అవసరమైంది, పార్టీ ఆఫీసు సరిపోవటం లేదు కాబట్టి. గవర్నమెంటు స్థలం ఇవ్వడానికి పూనుకొంది. గవర్నమెంటు స్థలం ఇస్తే ఏ గొడవా లేదు. అయితే గాంధీ భవన్ కి ఆనుకొని గవర్నమెంటు స్థలం లేదు కాబట్టి వెనుకనే ఉన్నా బస్తి లో 90 సంవత్సరాలుగా ఉంటున్న పట్టాదరులైన ప్రజల ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయించారు. వీరికి 350 గజాలలో మరో మురికివాడ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇంకో విషయమేమంటే దీనికోసం 13 కోట్ల ప్రజల డబ్బుని వెచ్చించారు.

ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తప్పక స్ఫురిస్తాయి.
  1. పార్టీ ఆఫీసు లకి భూములు కేటాయించే విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రభుత్వం ఎంత కావాలంటే అంత భూమి కేటాయించు కోవచ్చా?
  2. ప్రభుత్వ భూమి మాత్రమే ఇవ్వాలా? ప్రజలవద్దనుచి బలవంతంగా లాక్కుని ఆయా పార్టీలకు అవసరమైన చోట మాత్రమే ఇవ్వాలా?
  3. భూమిని ఇవ్వడమే కాక ప్రత్యేకమైన భూములు మాత్రమే ఇవ్వడానికి అవసరమైన మరికొంత ధనం వెచ్చించ వచ్చా?
  4. ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి వ్యతిరేకించినా (వారు చట్టపరంగా అ భూమికి అధికారులు... పట్టాదారులు) బలవంతంగా ఖాళీ చేయించే వెసులుబాటు ఉంటుందా?
  5. మనిషికి చట్టపరంగా తానూ కట్టుకున్న ఇంటిలో తాను నివసించే హక్కు లేదా?

విషయం లో రాజకీయ నాయకులు నిస్సిగ్గు గా తమను తాము సమర్ధించుకోవడం చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. ప్రజలకు చైతన్యం రావాలని వేచి చూడడం తప్ప ఇప్పట్లో చేయదగినది ఏమీ లేదేమో. కొన్ని ఉదాత్తమైన పనులకోసం వ్యక్తుల నుండి వారి ఆస్తులను తీసుకొని, ప్రత్యామ్నాయం కల్పిస్తే అర్థం ఉంది. అవి అంత గొప్ప ప్రజోపయోగమైన పనులై ఉండాలి. కాని ఇలా పార్టీ ఆఫీసుల కోసం, నాయకుల ఇళ్ళ కోసం ప్రజల ఆస్తులు కొల్ల గొట్టడం మొదలు పెడితే మానవ హక్కులకి అర్థం లేకుండా పోతుంది.

తమకు నిజంగా ప్రస్తుతమున్న కార్యాలయం సరిపోకపోతే దాన్ని ప్రభుత్వానికి ఏదయినా ప్రజోపయోగపు పని కోసం అప్పగించి వేరే చోట మరింత ఎక్కువ స్థలం కోరితే ఆ పార్టీకి ఎంతో గొప్పగా వుండేది.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ