Skip to main content

గాంధీ భవన్, భీంరావ్ భాడా

ఈరోజు అసెంబ్లీ లో చర్చ చూసాను. గాంధీ భవన్ కి స్థలం అవసరమైంది, పార్టీ ఆఫీసు సరిపోవటం లేదు కాబట్టి. గవర్నమెంటు స్థలం ఇవ్వడానికి పూనుకొంది. గవర్నమెంటు స్థలం ఇస్తే ఏ గొడవా లేదు. అయితే గాంధీ భవన్ కి ఆనుకొని గవర్నమెంటు స్థలం లేదు కాబట్టి వెనుకనే ఉన్నా బస్తి లో 90 సంవత్సరాలుగా ఉంటున్న పట్టాదరులైన ప్రజల ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయించారు. వీరికి 350 గజాలలో మరో మురికివాడ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇంకో విషయమేమంటే దీనికోసం 13 కోట్ల ప్రజల డబ్బుని వెచ్చించారు.

ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తప్పక స్ఫురిస్తాయి.
  1. పార్టీ ఆఫీసు లకి భూములు కేటాయించే విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రభుత్వం ఎంత కావాలంటే అంత భూమి కేటాయించు కోవచ్చా?
  2. ప్రభుత్వ భూమి మాత్రమే ఇవ్వాలా? ప్రజలవద్దనుచి బలవంతంగా లాక్కుని ఆయా పార్టీలకు అవసరమైన చోట మాత్రమే ఇవ్వాలా?
  3. భూమిని ఇవ్వడమే కాక ప్రత్యేకమైన భూములు మాత్రమే ఇవ్వడానికి అవసరమైన మరికొంత ధనం వెచ్చించ వచ్చా?
  4. ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి వ్యతిరేకించినా (వారు చట్టపరంగా అ భూమికి అధికారులు... పట్టాదారులు) బలవంతంగా ఖాళీ చేయించే వెసులుబాటు ఉంటుందా?
  5. మనిషికి చట్టపరంగా తానూ కట్టుకున్న ఇంటిలో తాను నివసించే హక్కు లేదా?

విషయం లో రాజకీయ నాయకులు నిస్సిగ్గు గా తమను తాము సమర్ధించుకోవడం చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. ప్రజలకు చైతన్యం రావాలని వేచి చూడడం తప్ప ఇప్పట్లో చేయదగినది ఏమీ లేదేమో. కొన్ని ఉదాత్తమైన పనులకోసం వ్యక్తుల నుండి వారి ఆస్తులను తీసుకొని, ప్రత్యామ్నాయం కల్పిస్తే అర్థం ఉంది. అవి అంత గొప్ప ప్రజోపయోగమైన పనులై ఉండాలి. కాని ఇలా పార్టీ ఆఫీసుల కోసం, నాయకుల ఇళ్ళ కోసం ప్రజల ఆస్తులు కొల్ల గొట్టడం మొదలు పెడితే మానవ హక్కులకి అర్థం లేకుండా పోతుంది.

తమకు నిజంగా ప్రస్తుతమున్న కార్యాలయం సరిపోకపోతే దాన్ని ప్రభుత్వానికి ఏదయినా ప్రజోపయోగపు పని కోసం అప్పగించి వేరే చోట మరింత ఎక్కువ స్థలం కోరితే ఆ పార్టీకి ఎంతో గొప్పగా వుండేది.

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...