Skip to main content

అవినీతా అసమర్థతా

రోజూ ఆఫీసుకి వెళుతూ వుంటాం, ఇంటికి వస్తూ వుంటాం. తొందరలో పడి ఏది పూర్తిగా గమనిచం. గమనిచినా పట్టించుకోం. ఉదాహరణకి...
  1. మాన్ హోల్ కవర్లు ఎప్పుడూ రోడ్డుకి నాలుగు ఇంచులు లోపలికో, నాలుగు ఇంచులు బయటికో ఎందుకు వేయబడి ఉంటాయ్? రోడ్డుకి సమాంతరంగా వేసే టెక్నాలజీ ఇంకా మనకు లేదా?
  2. కొన్ని చోట్ల అమాంతంగా రోడ్డు ఎందుకు కురచ బడి పోతుంది? రోడ్డుకి ఏ స్మశానమో, మరోటో ఎందుకు అడ్డంగా వుంటుంది?
  3. అసలు రోడ్డు కూడా ఏ ముఖ్య కేంద్ర నాయకుడో, అంతర్జాతీయ నాయకుడో వచ్చినప్పుడే ఎందుకు వేయబడుతుంది? ఉన్నవి మైంటైన్ చేయటానికి, కొత్తవి వేయటానికి నిర్నీతమైన గడువులేమీ వుండవా?
  4. కొత్తగా వేసిన రోడ్డుని తవ్వి పోసి నిటి సరఫరా పనులో, కేబుల్ వర్కో చేస్తుంటారు. మళ్ళీ ఆ రోడ్లను వేయరు. వేసినా కూడా నాసిరకంగా వేస్తుంటారు. ఏదయినా పని చేసిన తర్వాత యధావిధంగా రోడ్డును పునరుద్ధరించాలని కాంట్రాక్టులో ఉండదా? ఉన్నా అమలుకాదా?
  5. ఫుట్ పాత్ మీద మొత్తం ఆక్రమణలు ఉంటాయి. వీటిని ఎవరు తొలగించాలి? కొన్ని చోట్ల ఫుట్ పాత్ మాత్రమే కాక రోడ్డు కూడా రెండు మూడు గజాల వరకు అక్రమించుకోబడి ఉంటుంది.
  6. కరెంటు స్థంభాలకి కేబుల్సు సాలె గూడులా వేలాడుతుంటాయి. వీటిని ఎవరు పట్టించుకోవాలి? ఇవి కొన్నిసార్లు రోడ్డుపై పడిపోయి ప్రమాదాలకు కారణమవుతుంటాయి.
  7. కొన్ని హోటల్లు రోడ్డుపైకి కుంపట్లను పెట్టి ఆ పొగను, వేడిని రోడ్డు పైకి వదులుతుంటాయి.
  8. బస్సులను బస్ బే లో ఆపరు. ఆపనివ్వకుండా అక్కడ ఆటోలో, తోపుడు బళ్ళో, హకర్సో తిష్ట వేసి వుంటారు.
  9. కొన్ని చోట్ల అవసరం లేక పోయినా రోడ్లు వెడల్పు చేస్తారు, వంతెనలను వేస్తారు. మరికొన్ని చోట్ల ఎంత అవసరం ఉన్నప్పటికీ పట్టించుకోరు.
  10. కొన్ని చోట్ల రోడ్డు పెద్దగానే వుంటుంది. కాని ట్రాఫిక్ పోలీసులే రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద బారికేడ్లు పెడతారు. అవి ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాదు.
అర్థం కాని ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. నిత్యం ఇలాంటి విషయాలు ఎన్నో గోచరిస్తూ వుంటాయి. మరి మీకు?

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...