Skip to main content

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను.

  • సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
  • శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ.
  • నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొందించిన ప్రాజెక్టు కాదు. కేవలం జలవిద్యుత్తు కొరకై నిర్మించ బడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు కొండల మధ్య నిర్మించ బడింది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే నీటిని వదల డానికి మట్టి కట్ట లేదు. పైగా నీరు నిండితే కర్నూలు మునిగి పోతుంది.
  • మన జల నిర్వహణ అసలు ప్రణాళిక ప్రకారం నాగార్జున సాగర్ ఎప్పుడూ నిండుగా ఉంచాలి, శ్రీశైలం ఎప్పుడూ నిండ నివ్వ కూడదు. కాని జరిగేది దీనికి విరుద్ధంగా వుంది.
  • పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగిన దరిమిలా శ్రీశైలం డ్యాములో మిగులు జలాలు ఉన్నాయని చూపించుకోవ డానికి గేట్లు ఎత్తడానికి కావలసిన కావలిసిన అధికారాల్ని ముఖ్య మంత్రి కార్యాలయం లో అట్టి పెట్టుకున్నారు. అలాగే నియమిత నీటి నిలువ పరిమితిని కూడా ప్రాజెక్టు నిర్మించినప్పుడు విధించిన పరిమితి కన్నా అధికంగా పెంచి వేశారు. ఇంజనీర్లు తీసుకోవలిసిన నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలుగా మారి పోయాయి.
  • అలమట్టి, నారాయణ పూర్ డ్యాం లనుండి నీటిని వదులుతున్నట్టు మూడు రోజుల నుండే సంకేతాలున్నా శ్రీశైలం డ్యాం లో నీటి నిలువను తగ్గించ డానికి చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ లోకి నీటిని ముందుగా వదిలి వుంటే పరిస్థితి వేరుగా వుండేది.
  • తప్పి పోయిన ముఖ్య మంత్రిని వెదక డానికి ఆఘ మేఘాల మీద హెలికాప్టర్లు, వెతికే విమానాలు, చివరికి అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. లక్షల మంది ప్రజలు ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు మాత్రం కనీసం హెలికాప్టర్లు కూడా జాడ లేవు. వచ్చిన హెలికాప్టర్లను కూడా ఇంధనం లేదని ఉపయోగించుకోలేక పోవడం కన్నా సిగ్గుచేటు లేదు.
  • ఇన్ని లక్షల మంది ప్రాణాలు ప్రమాదం లో పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు గా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమైన విషయం.

Comments

  1. అంతా చచ్చినోడి దయ అంటారు.

    ReplyDelete
  2. oremuna గారు

    ఒక్క ముక్కలో తేల్చేసారు!

    ReplyDelete
  3. ఈ పనికిమాలినవాళ్ళని ఆఫ్టరాల్ రెండొందల రూపాయల పింఛన్ల కోసం ఎన్నుకున్న బౌద్ధిక బడుద్ధాయిలున్నారు గదా ! వాళ్ళకి కళ్ళు తెఱిపించగలవారెవరైనా ఉంటే....

    సామూహిక పాపాన్ని సామూహికంగానే అనుభవించాలి ప్రజలు. అనుభవించనివ్వండి.

    --తాడేపల్లి

    ReplyDelete
  4. అవును నిజమే, ఎవరిది ఈ పాపం? చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete
  5. ఆయన మొదటిసారి వచ్చాక
    -కనీస మట్టాన్ని (MDDL) 836 అడుగుల నుంచి 854కు పెంచేసాడు.
    -పోతిరెడ్డీపాడు రెగ్యులేటరును 11 వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచే పని మొదలెట్టాడు.
    -సొంత కర్మాగారాలు మొదలెట్టాడు.

    సొంతలాభం సుంత కూడా మానుకోలేదు.

    ReplyDelete
  6. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని రాజశేఖర్ రెడ్డి ఎలా కాలరాశాడనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇది మొదటిది మాత్రమే.

    ReplyDelete
  7. oremuna, LBS, AMMA ODI, చదువరి, కత్తి మహేష్ కుమార్ గార్ల కామెంట్లకు ధన్య వాదాలు.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీరిచ్చిన వివరాలకు ధన్య వాదాలు, అవి సరిగా గుర్తు రాక నేను వ్రాయ లేదు.

    ReplyDelete
  9. అన్నిటికన్నా పెద్ద పాపం మనదే - ఎడాపెడా చెట్లు నరికెయ్యడం. దీనివల్ల ప్రవాహానికి అడ్డులేకుండా పోయి ఊహించలేని వేగంతో నదుల్లో, వాగుల్లో నీరు చేరుతోంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ