కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను.
- సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
- శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ.
- నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొందించిన ప్రాజెక్టు కాదు. కేవలం జలవిద్యుత్తు కొరకై నిర్మించ బడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు కొండల మధ్య నిర్మించ బడింది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే నీటిని వదల డానికి మట్టి కట్ట లేదు. పైగా నీరు నిండితే కర్నూలు మునిగి పోతుంది.
- మన జల నిర్వహణ అసలు ప్రణాళిక ప్రకారం నాగార్జున సాగర్ ఎప్పుడూ నిండుగా ఉంచాలి, శ్రీశైలం ఎప్పుడూ నిండ నివ్వ కూడదు. కాని జరిగేది దీనికి విరుద్ధంగా వుంది.
- పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగిన దరిమిలా శ్రీశైలం డ్యాములో మిగులు జలాలు ఉన్నాయని చూపించుకోవ డానికి గేట్లు ఎత్తడానికి కావలసిన కావలిసిన అధికారాల్ని ముఖ్య మంత్రి కార్యాలయం లో అట్టి పెట్టుకున్నారు. అలాగే నియమిత నీటి నిలువ పరిమితిని కూడా ప్రాజెక్టు నిర్మించినప్పుడు విధించిన పరిమితి కన్నా అధికంగా పెంచి వేశారు. ఇంజనీర్లు తీసుకోవలిసిన నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలుగా మారి పోయాయి.
- అలమట్టి, నారాయణ పూర్ డ్యాం లనుండి నీటిని వదులుతున్నట్టు మూడు రోజుల నుండే సంకేతాలున్నా శ్రీశైలం డ్యాం లో నీటి నిలువను తగ్గించ డానికి చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ లోకి నీటిని ముందుగా వదిలి వుంటే పరిస్థితి వేరుగా వుండేది.
- తప్పి పోయిన ముఖ్య మంత్రిని వెదక డానికి ఆఘ మేఘాల మీద హెలికాప్టర్లు, వెతికే విమానాలు, చివరికి అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. లక్షల మంది ప్రజలు ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు మాత్రం కనీసం హెలికాప్టర్లు కూడా జాడ లేవు. వచ్చిన హెలికాప్టర్లను కూడా ఇంధనం లేదని ఉపయోగించుకోలేక పోవడం కన్నా సిగ్గుచేటు లేదు.
- ఇన్ని లక్షల మంది ప్రాణాలు ప్రమాదం లో పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు గా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమైన విషయం.
అంతా చచ్చినోడి దయ అంటారు.
ReplyDeleteoremuna గారు
ReplyDeleteఒక్క ముక్కలో తేల్చేసారు!
ఈ పనికిమాలినవాళ్ళని ఆఫ్టరాల్ రెండొందల రూపాయల పింఛన్ల కోసం ఎన్నుకున్న బౌద్ధిక బడుద్ధాయిలున్నారు గదా ! వాళ్ళకి కళ్ళు తెఱిపించగలవారెవరైనా ఉంటే....
ReplyDeleteసామూహిక పాపాన్ని సామూహికంగానే అనుభవించాలి ప్రజలు. అనుభవించనివ్వండి.
--తాడేపల్లి
అవును నిజమే, ఎవరిది ఈ పాపం? చాలా బాగా విశ్లేషించారు.
ReplyDeleteఆయన మొదటిసారి వచ్చాక
ReplyDelete-కనీస మట్టాన్ని (MDDL) 836 అడుగుల నుంచి 854కు పెంచేసాడు.
-పోతిరెడ్డీపాడు రెగ్యులేటరును 11 వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచే పని మొదలెట్టాడు.
-సొంత కర్మాగారాలు మొదలెట్టాడు.
సొంతలాభం సుంత కూడా మానుకోలేదు.
రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని రాజశేఖర్ రెడ్డి ఎలా కాలరాశాడనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇది మొదటిది మాత్రమే.
ReplyDeleteoremuna, LBS, AMMA ODI, చదువరి, కత్తి మహేష్ కుమార్ గార్ల కామెంట్లకు ధన్య వాదాలు.
ReplyDeleteచదువరి గారు,
ReplyDeleteమీరిచ్చిన వివరాలకు ధన్య వాదాలు, అవి సరిగా గుర్తు రాక నేను వ్రాయ లేదు.
అన్నిటికన్నా పెద్ద పాపం మనదే - ఎడాపెడా చెట్లు నరికెయ్యడం. దీనివల్ల ప్రవాహానికి అడ్డులేకుండా పోయి ఊహించలేని వేగంతో నదుల్లో, వాగుల్లో నీరు చేరుతోంది.
ReplyDelete