Skip to main content

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను.

  • సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
  • శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ.
  • నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొందించిన ప్రాజెక్టు కాదు. కేవలం జలవిద్యుత్తు కొరకై నిర్మించ బడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు కొండల మధ్య నిర్మించ బడింది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే నీటిని వదల డానికి మట్టి కట్ట లేదు. పైగా నీరు నిండితే కర్నూలు మునిగి పోతుంది.
  • మన జల నిర్వహణ అసలు ప్రణాళిక ప్రకారం నాగార్జున సాగర్ ఎప్పుడూ నిండుగా ఉంచాలి, శ్రీశైలం ఎప్పుడూ నిండ నివ్వ కూడదు. కాని జరిగేది దీనికి విరుద్ధంగా వుంది.
  • పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగిన దరిమిలా శ్రీశైలం డ్యాములో మిగులు జలాలు ఉన్నాయని చూపించుకోవ డానికి గేట్లు ఎత్తడానికి కావలసిన కావలిసిన అధికారాల్ని ముఖ్య మంత్రి కార్యాలయం లో అట్టి పెట్టుకున్నారు. అలాగే నియమిత నీటి నిలువ పరిమితిని కూడా ప్రాజెక్టు నిర్మించినప్పుడు విధించిన పరిమితి కన్నా అధికంగా పెంచి వేశారు. ఇంజనీర్లు తీసుకోవలిసిన నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలుగా మారి పోయాయి.
  • అలమట్టి, నారాయణ పూర్ డ్యాం లనుండి నీటిని వదులుతున్నట్టు మూడు రోజుల నుండే సంకేతాలున్నా శ్రీశైలం డ్యాం లో నీటి నిలువను తగ్గించ డానికి చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ లోకి నీటిని ముందుగా వదిలి వుంటే పరిస్థితి వేరుగా వుండేది.
  • తప్పి పోయిన ముఖ్య మంత్రిని వెదక డానికి ఆఘ మేఘాల మీద హెలికాప్టర్లు, వెతికే విమానాలు, చివరికి అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. లక్షల మంది ప్రజలు ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు మాత్రం కనీసం హెలికాప్టర్లు కూడా జాడ లేవు. వచ్చిన హెలికాప్టర్లను కూడా ఇంధనం లేదని ఉపయోగించుకోలేక పోవడం కన్నా సిగ్గుచేటు లేదు.
  • ఇన్ని లక్షల మంది ప్రాణాలు ప్రమాదం లో పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు గా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమైన విషయం.

Comments

  1. అంతా చచ్చినోడి దయ అంటారు.

    ReplyDelete
  2. oremuna గారు

    ఒక్క ముక్కలో తేల్చేసారు!

    ReplyDelete
  3. ఈ పనికిమాలినవాళ్ళని ఆఫ్టరాల్ రెండొందల రూపాయల పింఛన్ల కోసం ఎన్నుకున్న బౌద్ధిక బడుద్ధాయిలున్నారు గదా ! వాళ్ళకి కళ్ళు తెఱిపించగలవారెవరైనా ఉంటే....

    సామూహిక పాపాన్ని సామూహికంగానే అనుభవించాలి ప్రజలు. అనుభవించనివ్వండి.

    --తాడేపల్లి

    ReplyDelete
  4. అవును నిజమే, ఎవరిది ఈ పాపం? చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete
  5. ఆయన మొదటిసారి వచ్చాక
    -కనీస మట్టాన్ని (MDDL) 836 అడుగుల నుంచి 854కు పెంచేసాడు.
    -పోతిరెడ్డీపాడు రెగ్యులేటరును 11 వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచే పని మొదలెట్టాడు.
    -సొంత కర్మాగారాలు మొదలెట్టాడు.

    సొంతలాభం సుంత కూడా మానుకోలేదు.

    ReplyDelete
  6. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని రాజశేఖర్ రెడ్డి ఎలా కాలరాశాడనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇది మొదటిది మాత్రమే.

    ReplyDelete
  7. oremuna, LBS, AMMA ODI, చదువరి, కత్తి మహేష్ కుమార్ గార్ల కామెంట్లకు ధన్య వాదాలు.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీరిచ్చిన వివరాలకు ధన్య వాదాలు, అవి సరిగా గుర్తు రాక నేను వ్రాయ లేదు.

    ReplyDelete
  9. అన్నిటికన్నా పెద్ద పాపం మనదే - ఎడాపెడా చెట్లు నరికెయ్యడం. దీనివల్ల ప్రవాహానికి అడ్డులేకుండా పోయి ఊహించలేని వేగంతో నదుల్లో, వాగుల్లో నీరు చేరుతోంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...