Skip to main content

ఎన్నికల ఫలితాలు

ఎన్నికలు అయి పోయి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వారు తప్ప ప్రతి ఒక్కరు రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అనుకున్నారు. కాని ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకు పోయి నప్పటికీ విజయం సాధించడం ఏ విపరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా వుంది.

చంద్రబాబు కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసినప్పటికి అది ఆశించిన స్థాయిలో లేదు. కారణం సుస్పష్టం. చంద్ర బాబు ఏ విషయం లేవనెత్తినా కాంగ్రెస్ వారు దానికి ప్రతిగా గత తెలుగు దేశం పాలనలో జరిగిన ఉదంతాలను ఉదహరించి ఎదురు దాడికి దిగే వారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే తామూ మచ్చ లేకుండా వుండటం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షంలో అది లోపించింది. పైగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మచ్చ లేని పాలన అందించడం కూడా కాంగ్రెస్ కి ఒక ప్లస్ అయింది.

అంతకు ముందు తెదేపా పాలనలో అభివృద్ధికి కృషి జరిగినప్పటికీ అవినీతి, అట్టడుగు ప్రజానీకాన్ని, రైతులను పట్టించుకు పోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరింగింది. 2004 లో చంద్ర బాబు అధికారం లోంచి దిగి పోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వ్యతిరేకత అలాగే వుంది.

గత సంవత్సరంగా ఓటరులో మార్పు రాసాగింది. రాబందుల పాలన ఎలా వుంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన తరువాత. చివరిసారి ఉప ఎన్నికల్లో ఆ రకమైన సంకేతం ఇచ్చాడు వోటరు. కాని ఎప్పటిలాగే వోటరు నాడిని అంచనా వేయడంలో చంద్రబాబు దెబ్బ తిన్నాడు. ప్రజలపై కన్నా కూటములపై, కుటిల రాజకీయాలపై ఎక్కువ విశ్వాసం కనబర్చాడు. సహజంగా ఇది ఓటరుకి నచ్చలేదు.

ఫలితం... బై ఎలెక్షన్లో గెలిచిన తలసాని, కడియం కుడా ఇప్పుడు ఓడి పోవడం.

తద్విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ప్రజలనే నమ్మాడు. తాను చేసిన కార్య క్రమాలను(!) ప్రజలు ఆమోదిస్తారని పూర్తిగా విశ్వసించాడు. అది ప్రజలకు బాగా నచ్చింది.

చంద్రబాబు చెప్పిన నగదు బదిలీ, కలర్ టీవీ పథకాలను విశ్వసించే స్థితిలో లేరు జనం. గతంలో ఎన్నో ఇలాంటి ప్రజాకర్షక పథకాలకు రాం రాం చెప్పిన చంద్రబాబును జనం ఇంకా మరిచిపోలేదు.

నగదు బదిలీ పథకం ప్రజలకు చేరలేదు అనే వాదన తర్క విరుద్ధం. ఈ రోజుల్లో టీవీ లో ఇలా ప్రకటన వస్తే అలా అందరికీ తెలిసి పోతుంది. అయితే తన సిద్ధాంతాలకు తానే తిలోదకాలిచ్సిన బాబులో వారికి పరిపక్వత కనిపించలేదు. ఏ ఎండ కా గొడుగు పట్టే వాడిలా కనిపించాడు.

ఇక ప్రజారాజ్యం లో సామజిక న్యాయం కన్నాసామజిక వర్గ ప్రాధాన్యం, టికెట్లు అమ్ము కోవడం, రాజకీయ ఉపన్యాసాలలో అపరిపక్వత అతన్ని హీరో కాకుండా జీరో చేసాయి.

ఈ ఫలితాలు తమ పాలనకు సర్టిఫికేట్ అని బొత్స లాంటి వారు ఇప్పటికే చెపుతున్నారు. వచ్చే ఐదేళ్ళలో పరిపాలన ఎలా వుంటుందో మనం తేలిగ్గానే ఉహించ వచ్చు.

ఒక సారి భవిష్యత్తులోకి వెళితే...

మూల విరాట్టు కుమారుడు ఈసారి సంపాదనలో ముఖేష్ అంబానీని మించి పోవచ్చు.

రాయల సీమ ఫ్యాక్షనిజం ఈసారి పూర్తిగా తుడిచి పెట్టుకొని పోవచ్చు, ఒకటే ఫ్యాక్షన్ ఉంటుంది కాబట్టి.

మక్కా మసీదు, లుంబిని, గోకుల్ చాట్ పేలుళ్ళ విచారణకు వచ్చే ఐదు సంవత్సరాలలో కూడా ఆతీ గతీ ఉండదు. పైగా ప్రతి సంవత్సరం మక్కా మసీదు కాల్పులకు ప్రతీకార హత్యలు యదాతథం. అఫ్గన్, స్వాత్ లోయలో చోటు లేని తాలిబాన్లకు పాత బస్తీ స్వర్గ ధామం కావచ్చు.

మిగిలిన ప్రభుత్వ భూములు పూర్తిగా కైంకర్యం, అయినా ప్రాజెక్టులకు డబ్బులు శూన్యం.

దేవాదుల లీకేజీలు మరింతగా పెరిగి రిపేరు వీలుకాదని ఇంజనీర్లు సర్టిఫికేట్ ఇవ్వ వచ్చు.

ప్రముఖ వార్తా పత్రిక ఆస్తులను కాపాడుకోవడానికి తన 'పద్ధతులు' మార్చు కోవచ్చు.

రోడ్లపై గుంటలు తప్పించు కుంటూ స్పీడుగా డ్రైవ్ చేయడం కుర్రకారుకు ఫ్యాషన్ అవుతుంది.

GHMC గా మారినందు వల్ల నిధులు పెరిగినా, వాటితో పాటు చెత్త కుప్పలు, డ్రైనేజీ సెలయేళ్ళు హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడి గా కంపు కొడుతూనే ఉంటాయి. కుళాయిలలో మురుగు నీరు రాకుండా వుంటే వార్త అవుతుంది.

నిధుల కొరత వల్ల రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు అటకెక్క వచ్చు.

Comments

  1. Meeru mari chala badha padipothunnaru papam. good luck for all your wishes...

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...