Skip to main content

ఎన్నికల ఫలితాలు

ఎన్నికలు అయి పోయి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వారు తప్ప ప్రతి ఒక్కరు రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అనుకున్నారు. కాని ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పీకల లోతు అవినీతిలో కూరుకు పోయి నప్పటికీ విజయం సాధించడం ఏ విపరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా వుంది.

చంద్రబాబు కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసినప్పటికి అది ఆశించిన స్థాయిలో లేదు. కారణం సుస్పష్టం. చంద్ర బాబు ఏ విషయం లేవనెత్తినా కాంగ్రెస్ వారు దానికి ప్రతిగా గత తెలుగు దేశం పాలనలో జరిగిన ఉదంతాలను ఉదహరించి ఎదురు దాడికి దిగే వారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే తామూ మచ్చ లేకుండా వుండటం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షంలో అది లోపించింది. పైగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మచ్చ లేని పాలన అందించడం కూడా కాంగ్రెస్ కి ఒక ప్లస్ అయింది.

అంతకు ముందు తెదేపా పాలనలో అభివృద్ధికి కృషి జరిగినప్పటికీ అవినీతి, అట్టడుగు ప్రజానీకాన్ని, రైతులను పట్టించుకు పోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరింగింది. 2004 లో చంద్ర బాబు అధికారం లోంచి దిగి పోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వ్యతిరేకత అలాగే వుంది.

గత సంవత్సరంగా ఓటరులో మార్పు రాసాగింది. రాబందుల పాలన ఎలా వుంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన తరువాత. చివరిసారి ఉప ఎన్నికల్లో ఆ రకమైన సంకేతం ఇచ్చాడు వోటరు. కాని ఎప్పటిలాగే వోటరు నాడిని అంచనా వేయడంలో చంద్రబాబు దెబ్బ తిన్నాడు. ప్రజలపై కన్నా కూటములపై, కుటిల రాజకీయాలపై ఎక్కువ విశ్వాసం కనబర్చాడు. సహజంగా ఇది ఓటరుకి నచ్చలేదు.

ఫలితం... బై ఎలెక్షన్లో గెలిచిన తలసాని, కడియం కుడా ఇప్పుడు ఓడి పోవడం.

తద్విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ప్రజలనే నమ్మాడు. తాను చేసిన కార్య క్రమాలను(!) ప్రజలు ఆమోదిస్తారని పూర్తిగా విశ్వసించాడు. అది ప్రజలకు బాగా నచ్చింది.

చంద్రబాబు చెప్పిన నగదు బదిలీ, కలర్ టీవీ పథకాలను విశ్వసించే స్థితిలో లేరు జనం. గతంలో ఎన్నో ఇలాంటి ప్రజాకర్షక పథకాలకు రాం రాం చెప్పిన చంద్రబాబును జనం ఇంకా మరిచిపోలేదు.

నగదు బదిలీ పథకం ప్రజలకు చేరలేదు అనే వాదన తర్క విరుద్ధం. ఈ రోజుల్లో టీవీ లో ఇలా ప్రకటన వస్తే అలా అందరికీ తెలిసి పోతుంది. అయితే తన సిద్ధాంతాలకు తానే తిలోదకాలిచ్సిన బాబులో వారికి పరిపక్వత కనిపించలేదు. ఏ ఎండ కా గొడుగు పట్టే వాడిలా కనిపించాడు.

ఇక ప్రజారాజ్యం లో సామజిక న్యాయం కన్నాసామజిక వర్గ ప్రాధాన్యం, టికెట్లు అమ్ము కోవడం, రాజకీయ ఉపన్యాసాలలో అపరిపక్వత అతన్ని హీరో కాకుండా జీరో చేసాయి.

ఈ ఫలితాలు తమ పాలనకు సర్టిఫికేట్ అని బొత్స లాంటి వారు ఇప్పటికే చెపుతున్నారు. వచ్చే ఐదేళ్ళలో పరిపాలన ఎలా వుంటుందో మనం తేలిగ్గానే ఉహించ వచ్చు.

ఒక సారి భవిష్యత్తులోకి వెళితే...

మూల విరాట్టు కుమారుడు ఈసారి సంపాదనలో ముఖేష్ అంబానీని మించి పోవచ్చు.

రాయల సీమ ఫ్యాక్షనిజం ఈసారి పూర్తిగా తుడిచి పెట్టుకొని పోవచ్చు, ఒకటే ఫ్యాక్షన్ ఉంటుంది కాబట్టి.

మక్కా మసీదు, లుంబిని, గోకుల్ చాట్ పేలుళ్ళ విచారణకు వచ్చే ఐదు సంవత్సరాలలో కూడా ఆతీ గతీ ఉండదు. పైగా ప్రతి సంవత్సరం మక్కా మసీదు కాల్పులకు ప్రతీకార హత్యలు యదాతథం. అఫ్గన్, స్వాత్ లోయలో చోటు లేని తాలిబాన్లకు పాత బస్తీ స్వర్గ ధామం కావచ్చు.

మిగిలిన ప్రభుత్వ భూములు పూర్తిగా కైంకర్యం, అయినా ప్రాజెక్టులకు డబ్బులు శూన్యం.

దేవాదుల లీకేజీలు మరింతగా పెరిగి రిపేరు వీలుకాదని ఇంజనీర్లు సర్టిఫికేట్ ఇవ్వ వచ్చు.

ప్రముఖ వార్తా పత్రిక ఆస్తులను కాపాడుకోవడానికి తన 'పద్ధతులు' మార్చు కోవచ్చు.

రోడ్లపై గుంటలు తప్పించు కుంటూ స్పీడుగా డ్రైవ్ చేయడం కుర్రకారుకు ఫ్యాషన్ అవుతుంది.

GHMC గా మారినందు వల్ల నిధులు పెరిగినా, వాటితో పాటు చెత్త కుప్పలు, డ్రైనేజీ సెలయేళ్ళు హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడి గా కంపు కొడుతూనే ఉంటాయి. కుళాయిలలో మురుగు నీరు రాకుండా వుంటే వార్త అవుతుంది.

నిధుల కొరత వల్ల రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు అటకెక్క వచ్చు.

Comments

  1. Meeru mari chala badha padipothunnaru papam. good luck for all your wishes...

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...