Skip to main content

దోపిడీ స్వభావం

మనిషి నాగరికత నేర్చుకుంటున్న కాలం నించీ అనివార్యంగా సాగుతున్న కార్యక్రమం దోపిడీ. కాలానుగుణంగా దోపిడీ స్వభావం మారింది కాని దోపిడీ అలాగే ఉంది.

అసలు దోపిడీ అంటే ఏమిటి? ఒకడి కష్టార్జితాన్ని ఇంకోడు కొల్లగొట్టడం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, కష్టార్జితం కాకపొతే కొల్లగొట్ట వచ్చునా, అని. ఇవన్నీ నిర్ణయించడానికి, లెక్కగట్టడానికి కారల్ మార్క్స్ ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఇప్పుడు ఆవివరాలలోకి పోవడం నా ఉద్దేశం కాదు.

ఆసలు ఈ దోపిడీ ఎలా పుట్టింది అని ఆలోచిస్తే, ఆదిమ సమాజంలోనే దీనికి బీజాలు పడి ఉంటాయి అని చెప్పక తప్పదు. మనిషి జంతువులా జీవించిన కాలంలో దోపిడీ అంతగా ఉండే అవకాశం లేదు. అయితే గియితే కుటుంబంలోనే బలవంతుడు బలహీనుడు నోటి దగ్గరి కూడు లాక్కునివుంటాడు. అది కూడా దోపిడీయే! కాని వ్యవస్థీకృతం కాదు.

నాగరికత పెరుగుతున్న కొద్దీ జనం జానపదాలుగా (గ్రామాలు) గుమికూడడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి కొంత అదనపు ధాన్యమో, పనిముట్లో కూడబెట్టుకోనే అవకాశం కలిగింది. ఇలా మొదలైంది ప్రైవేటు ఆస్తి. అయితే వ్యవస్థ పై నియంత్రణ లేక పోవడం వలన కొంత మంది బలవంతులు సహజంగానే బలహీనులను బెదిరించి ఇలా కూడబెట్టిన ఆస్తులను కొల్లగొడుతూ ఉంటారు. మొదటిసారిగా ఇలా మొదలైవుంటుంది దోపిడీ.

ఇలాంటి దోపిడీని ఎదిరించడానికి ప్రజల్లోంచే నాయకత్వం తప్పకుండా బయట పడుతుంది. ప్రభావశీలురైన మనుషులు మిగతా ప్రజలకు నాయకత్వం వహించి దోపిడీని ఎదిరించడం సహజ సిద్ధంగా జరిగే పరిణామం. మన పురాణాలలో కనబడే పాత్రలు ఇలాంటి నాయకత్వానికి ప్రతీకలుగా భావించవచ్చు. దోపిడీని ఎదిరించడంలో సఫలీకృతుడైన నాయకుడు అక్కడితో ఆగడు. అతడు నేతగా, చివరికి రాజుగా రూపాంతరం చెందుతాడు.

ఆ విధంగా వచ్చిందే రాజరిక వ్యవస్థ. ఈ విధంగా రాజరిక వ్యవస్థ కూడా దోపిడీని ఎదిరించడానికి పుట్టిందే కాని, దోపిడీ కోసం పుట్టింది కాదు.

చరిత్రని గమనిస్తే అది నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది. అది మార్పు చెందకుండా జడంగా ఉండడం మొదలు పెడుతుందో, అప్పుడు మళ్ళీ డానికి రోగాలు పెరుగుతాయి. అలాగే రాజరిక వ్యవస్థ ముదిరిన కొద్దీ దాని రోగాలు కూడా అనివార్యంగా పెరగ సాగాయి. అలా వేళ్ళూనుకున్నదే  ఫ్యూడల్ వ్యవస్థ.

ఏ దోపిడీకి వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థ మొదలైందో, ఆ దోపిడీనే వేళ సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగించింది రాజరిక/ఫ్యూడల్ వ్యవస్థ. దోపిడీ కొనసాగిన కొద్దీ, అనివార్యంగా దోచుకోబడే వారి సంఖ్య పెరగడం, దోచుకునే వారి సంఖ్య తగ్గడం జరుగురుంది. దోపిడీకి గురయ్యే వారు సంఘటితం కావడం కూడా తప్పనిసరిగా జరిగే పరిణామం.

విప్లవాలు వచ్చాయి, రాజ్యాలు కూలాయి. 'ప్రజాస్వామ్యం' అనే ఆలోచనలకు బీజాలు పడ్డాయి.

సరిగ్గా ఈదశలో రెండురకాల ఆలోచనా విధానానికి అంకురార్పణ జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, కమ్యూనిస్టు వ్యవస్థ. ఇక్కడ గమనించాల్సింది ఈ రెండు రకాల వ్యవస్థలు కూడా దోపిడీ వ్యతిరేక ఉద్యమాలు లేదా విప్లవాల మూలంగానే ఏర్పడ్డాయి. చరిత్ర తనను తాను సవరించు కోవడంలో భాగంగానే ఈ పరిణామాలు సంభవించాయి.

అయితే కాలానుగుణంగా ఈ రెండురకాల వ్యవస్థలలోనూ లోపాలు బయటపడ్డాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు అధికంగా సంపాదించిన వాడు శక్తివంతుడిగా మారాడు. తద్వారా ప్రభుత్వాలను ప్రభావితం చేసి మరింత దోపిడీకి సమకట్టాడు. సంపాదనా సమరంలో వెనుక బడ్డవాడు మరింత పేదవాడుగా మారాడు, బతుకీడ్చలేక మరణించిన సందర్భాలు కూడా కోకొల్లలు.

కమ్యూనిజంలో డబ్బురూపేణా దోపిడీ జరిగే అవకాశం లేదు. అయితే అక్కడ అధికారం ఉన్నవాడే శక్తివంతుడు. అధికార వర్గాలు నానాటికి బలపడి, సాధారణ జన జీవితాన్ని దుర్భరం చేసిన సంఘటనలు జరిగాయి. అంతేకాదు, దోపిడీ అంటే ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవడమే కాదు, తాను కష్ట పడకుండా ఇతరుల కష్టఫలితాన్ని అనుభవించడం కూడా దోపిడీయే అవుతుంది. ఈరకంగా కమ్యూనిస్టు సమాజంలో కూడా దోపిడీ స్వభావం అలాగే ఉంది.

చరిత్ర పరిశీలించినప్పుడు తెలిసేది ఏమంటే, దోపిడీస్వభావం కాలానుగుణంగా గుణాత్మకమైన  మార్పులు సంతరించుకుందే తప్ప దోపిడీ మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ