Skip to main content

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను. 

మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను.

రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను. 

ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.


గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు. 

దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది. 

ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటారు. అందులో కొన్ని బూతు అర్థాలను కూడా స్ఫురించేలా ఉంటాయి. ఇవన్నీ హిట్లకోసం చేసే ప్రయత్నాలన్న మాట!


Comments

  1. ఈ స్క్రీన్‌షాట్ చూడండి: http://vizaghost.net/images/Clipboard01.jpg మూఢ నమ్మకాల విషయంలో పాలక వర్గాన్ని విమర్శిస్తూ వ్రాసిన టాపిక్‌ని ఎక్కువ మంది చదవలేదు.

    ReplyDelete
  2. కొంతవరకూ మీ ఆలోచన కరెక్ట్ అయినా మీరు టపా పెట్టిన టైం ఈ హిట్స్ విషయం లో చాలా ముఖ్యం కనుక మీ కంక్లూషన్ లాజికల్ గా కరెక్ట్ కాదు.. నేను అరుణాచల్ ప్రదేశ్ గురించి పెట్టిన టపా చూశాను కానీ దాని ముందు టపా గురించి ఇప్పుడు మీరు చెబితే తప్ప నాకు తెలియదు.. భారతకాలమానం ప్రకారం ఆదివారం రాత్రి టపా పెట్టండి ఎక్కువ హిట్స్ వస్తాయి.. ఈ విధంగా రెండు వారాలు చెయ్యండి అప్పుడు అవి పోల్చి చూడండి..(ఏదో ఒక ఐదు పైసల సలహా నచ్చకపోతే పిచ్చపిచ్చగా లైట్ తీస్కోండి ;))

    ReplyDelete
  3. అవినీతిపై యుద్ధం సంగతి అందరూ చాలాచోట్ల చదివీ/వినే ఉంటారు కాబట్టి కొత్తవిషయం కాదని చదవలేదు. గూగులోడి వార్త ఎక్కడా వినలేదని చెప్పి తెరిచి చూశారు.

    ReplyDelete
  4. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం ఉన్నవాళ్లు అవినీతి వ్యతిరేక పోరాటాలని అర్థం చేసుకుంటారా? అవినీతి విషయంలో వాళ్లు చెప్పేవి పైపై కబుర్లే. అవినీతి గురించిన మీ టాపిక్‌లో మొదటి కామెంట్ చదివారు కదా, అతను ఏమి వ్రాసాడో.

    ReplyDelete
  5. కార్తీక్ గారు,

    నా ఉద్దేశం వివాదాస్పదంగా ఉన్న విషయాలపై చదువరులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని ఒక పరిశీలన మాత్రమే. మీ సలహాకి ధన్యవాదాలు.

    ప్రవీణ్ గారు,

    లింక్స్ కి ధన్యవాదాలు.

    అనానిమస్,

    అది కూడా పాయింటే.

    ReplyDelete
  6. స్క్రీన్‌షాట్ల మీద క్లిక్ చేసి చూడండి. మనవాళ్ళకి సినిమాల మీద ఉన్న ఆసక్తి సమాజం మీద లేదని అర్థమవుతోంది. బజ్‌లో నన్ను అనుసరించేవాళ్ళూ ఉన్నారు. వాళ్ళలో కొందరు తెలంగాణావాదులు, కొందరు నాస్తికులు, స్త్రీలకి సంబంధించిన ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్న కొందరు ఉన్నారు. సినిమాలూ, సొల్లు కబుర్ల గురించి వ్రాస్తే ఫాలోవర్స్ పెరుగుతారు కానీ సినిమాల మీద నాకు అంత ఆసక్తి లేదు. చిన్నప్పుడు సమాజం గురించి ఏమీ తెలియని రోజుల్లో సినిమా పత్రికలే చదివేవాడ్ని. సమాజంలో సినిమాలు కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గ్రహించడానికి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...