Skip to main content

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను. 

మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను.

రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను. 

ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.


గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు. 

దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది. 

ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటారు. అందులో కొన్ని బూతు అర్థాలను కూడా స్ఫురించేలా ఉంటాయి. ఇవన్నీ హిట్లకోసం చేసే ప్రయత్నాలన్న మాట!


Comments

  1. ఈ స్క్రీన్‌షాట్ చూడండి: http://vizaghost.net/images/Clipboard01.jpg మూఢ నమ్మకాల విషయంలో పాలక వర్గాన్ని విమర్శిస్తూ వ్రాసిన టాపిక్‌ని ఎక్కువ మంది చదవలేదు.

    ReplyDelete
  2. కొంతవరకూ మీ ఆలోచన కరెక్ట్ అయినా మీరు టపా పెట్టిన టైం ఈ హిట్స్ విషయం లో చాలా ముఖ్యం కనుక మీ కంక్లూషన్ లాజికల్ గా కరెక్ట్ కాదు.. నేను అరుణాచల్ ప్రదేశ్ గురించి పెట్టిన టపా చూశాను కానీ దాని ముందు టపా గురించి ఇప్పుడు మీరు చెబితే తప్ప నాకు తెలియదు.. భారతకాలమానం ప్రకారం ఆదివారం రాత్రి టపా పెట్టండి ఎక్కువ హిట్స్ వస్తాయి.. ఈ విధంగా రెండు వారాలు చెయ్యండి అప్పుడు అవి పోల్చి చూడండి..(ఏదో ఒక ఐదు పైసల సలహా నచ్చకపోతే పిచ్చపిచ్చగా లైట్ తీస్కోండి ;))

    ReplyDelete
  3. అవినీతిపై యుద్ధం సంగతి అందరూ చాలాచోట్ల చదివీ/వినే ఉంటారు కాబట్టి కొత్తవిషయం కాదని చదవలేదు. గూగులోడి వార్త ఎక్కడా వినలేదని చెప్పి తెరిచి చూశారు.

    ReplyDelete
  4. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం ఉన్నవాళ్లు అవినీతి వ్యతిరేక పోరాటాలని అర్థం చేసుకుంటారా? అవినీతి విషయంలో వాళ్లు చెప్పేవి పైపై కబుర్లే. అవినీతి గురించిన మీ టాపిక్‌లో మొదటి కామెంట్ చదివారు కదా, అతను ఏమి వ్రాసాడో.

    ReplyDelete
  5. కార్తీక్ గారు,

    నా ఉద్దేశం వివాదాస్పదంగా ఉన్న విషయాలపై చదువరులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని ఒక పరిశీలన మాత్రమే. మీ సలహాకి ధన్యవాదాలు.

    ప్రవీణ్ గారు,

    లింక్స్ కి ధన్యవాదాలు.

    అనానిమస్,

    అది కూడా పాయింటే.

    ReplyDelete
  6. స్క్రీన్‌షాట్ల మీద క్లిక్ చేసి చూడండి. మనవాళ్ళకి సినిమాల మీద ఉన్న ఆసక్తి సమాజం మీద లేదని అర్థమవుతోంది. బజ్‌లో నన్ను అనుసరించేవాళ్ళూ ఉన్నారు. వాళ్ళలో కొందరు తెలంగాణావాదులు, కొందరు నాస్తికులు, స్త్రీలకి సంబంధించిన ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్న కొందరు ఉన్నారు. సినిమాలూ, సొల్లు కబుర్ల గురించి వ్రాస్తే ఫాలోవర్స్ పెరుగుతారు కానీ సినిమాల మీద నాకు అంత ఆసక్తి లేదు. చిన్నప్పుడు సమాజం గురించి ఏమీ తెలియని రోజుల్లో సినిమా పత్రికలే చదివేవాడ్ని. సమాజంలో సినిమాలు కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గ్రహించడానికి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...