ఎన్నికల నోటిసు వచ్చిన తరువాత రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కు తున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాతో వున్నారు. చిరంజీవి గ్లామర్ మరియు సంతర్పణ హామీలు, చంద్రబాబు ఎల్లలు దాటిన సంతర్పణ, రాజశేఖర్ రెడ్డి ఇదివరకే చేసివున్న సంతర్పణ లపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ మాటల వరస చూస్తుంటే వీళ్ళకు ప్రజలు తమ కాళ్ళమీద తామే నిలబడడం కంటే బిచ్చగాళ్ళ లాగా అడుక్కుంటే ఎక్కువ సంతోష పడతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెపుతుంటారు. వీళ్ళు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? ప్రజల డబ్బేగా?
మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం లేదు. అందుకే తమ వోటుని వందకి, రెందొందలకి అమ్ముకోవడానికి వెనుకాడడం లేదు.
విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు, కొద్ది శాతం మినహాయిస్తే. ఎమ్మెల్సీ ఎలెక్షన్లలో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ల నియోజక వర్గాల్లో నిర్లజ్జగా తమ వోట్లను, డబ్బులకు, సెల్ ఫోన్లకు అమ్ముకోవడం నేను చూసాను. వోటుపై, ఎన్నికలపై ప్రతి ఒక్కరి, కనీసం మెజారిటీ ప్రజల దృక్పథం లో మార్పు వస్తే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం లేదు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కోరుకుందాం.
మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం లేదు. అందుకే తమ వోటుని వందకి, రెందొందలకి అమ్ముకోవడానికి వెనుకాడడం లేదు.
విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు, కొద్ది శాతం మినహాయిస్తే. ఎమ్మెల్సీ ఎలెక్షన్లలో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ల నియోజక వర్గాల్లో నిర్లజ్జగా తమ వోట్లను, డబ్బులకు, సెల్ ఫోన్లకు అమ్ముకోవడం నేను చూసాను. వోటుపై, ఎన్నికలపై ప్రతి ఒక్కరి, కనీసం మెజారిటీ ప్రజల దృక్పథం లో మార్పు వస్తే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం లేదు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కోరుకుందాం.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.