Skip to main content

మన విద్యా విధానం ఎటు వెళ్తుంది?

అందరం క్లాసులో నిశ్శబ్దంగా కూర్చున్నాం. అపుడు నేను REC వరంగల్ లో కొత్తగా చేరాను. మొదటి క్లాసు కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. రాబోయేది అయ్యంగార్ సార్. అందరికీ కొత్త కావడంతో భయం భయంగా కూర్చున్నాం. అందులో జరగ బోయేది మాథ్స్ క్లాసు.

అయ్యంగార్ గారు రానే వచ్చారు. మొదట అందరిని పరిచయం చేసుకున్నారు. తనను తానూ పరిచయం చేసుకున్నారు. తరువాత చాక్ పీసు తీసుకుని బోర్డుపై అడ్డంగా ఒక గీత గీసారు.

"ఇదేమిటి"? ఒకడిని లేపి అడిగారు. వాడు సరిగా చెప్పలేక పోయాడు.

ఒకరిద్దరి తర్వాత ఒకడు చెప్పాడు. "X axis".

"Good. మరి ఇదేమిటి?" ఇప్పుడు నిలువుగా గీత గీసి ఇంకొకడిని అడిగారు.

ఈసారి వెంటనే వచ్చింది జవాబు. "Y axis".

అలా ఒక్కొక్క బిందువును గుర్తిస్తూ, గీతలు గీస్తూ క్లాసులో ప్రతి ఒక్కరిని లేపి ప్రశ్నలు వేయ సాగారు. కొద్ది నిముషాల్లో మా భయం, బెరుకు పోయింది. అయన మాకో అధ్యాపకుడిగా కాక ఒక స్నేహితుడిగా కనిపించ సాగారు. ఉత్సాహంతో జవాబులు చెప్పడం మొదలు పెట్టాం.అలా అరగంట పాటు చర్చ కొనసాగింది. ఇంతలో నా స్నేహితుడు లేచి ఒక విషయం చెప్పాడు.

"Yes, this is what exactly is called as Roll's theorem." ఆయన చెప్పారు.

ఆశ్చర్య పోవడం మావంతైంది. Roll's theorem మొదటి పాఠం అని తెలుసు (ముందే సిలబస్ చూసుకున్నాం కాబట్టి). కాని ఆ సిద్ధాంతాన్ని మా అంత మేమే చెపుతామని అస్సలు ఉహించ లేదు! ఇక ఆ థియరీని జీవితంలో ఎలా మరిచి పోగలం? తర్వాత ఆయన ఆ చాప్టర్ లో ఒక్క లెక్కని కుడా చెప్పలేదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే వాటిని మేమే పరిష్కరించి వేసాం. మూల సిద్ధాంతం తెలిసిన తర్వాత సమస్యలు పరిష్కరించడం ఎంత సులభమో అప్పుడు తెలిసింది.

సరిగ్గా ఇలాంటి విద్యా విధానమే మనకు కావలసినది. అయితే B Tech లో కాదు. ప్రాథమిక పాఠశాల నుండే మొదలు కావాలి. కాని జరుగు తున్నది వేరు. తోచింది చెప్పడం. గంటలకు గంటలు పిల్లల తో బట్టీయం వేయించడం. బండెడు హోం వరకు చేయించడం. దీంతో పిల్లలకు కనీసం ఆడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇక ఇంటర్మీడియేట్ కాలేజీల విషయం మరీ దారుణం. పిల్లలని చదివే యంత్రాలు గా భావిస్తున్నారు. ఫలితంగా ర్యాంకుల మాటేమో గాని, పిల్లలు మానసిక రోగులు గా మారుతున్నారు. ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ