Skip to main content

మన విద్యా విధానం ఎటు వెళ్తుంది?

అందరం క్లాసులో నిశ్శబ్దంగా కూర్చున్నాం. అపుడు నేను REC వరంగల్ లో కొత్తగా చేరాను. మొదటి క్లాసు కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. రాబోయేది అయ్యంగార్ సార్. అందరికీ కొత్త కావడంతో భయం భయంగా కూర్చున్నాం. అందులో జరగ బోయేది మాథ్స్ క్లాసు.

అయ్యంగార్ గారు రానే వచ్చారు. మొదట అందరిని పరిచయం చేసుకున్నారు. తనను తానూ పరిచయం చేసుకున్నారు. తరువాత చాక్ పీసు తీసుకుని బోర్డుపై అడ్డంగా ఒక గీత గీసారు.

"ఇదేమిటి"? ఒకడిని లేపి అడిగారు. వాడు సరిగా చెప్పలేక పోయాడు.

ఒకరిద్దరి తర్వాత ఒకడు చెప్పాడు. "X axis".

"Good. మరి ఇదేమిటి?" ఇప్పుడు నిలువుగా గీత గీసి ఇంకొకడిని అడిగారు.

ఈసారి వెంటనే వచ్చింది జవాబు. "Y axis".

అలా ఒక్కొక్క బిందువును గుర్తిస్తూ, గీతలు గీస్తూ క్లాసులో ప్రతి ఒక్కరిని లేపి ప్రశ్నలు వేయ సాగారు. కొద్ది నిముషాల్లో మా భయం, బెరుకు పోయింది. అయన మాకో అధ్యాపకుడిగా కాక ఒక స్నేహితుడిగా కనిపించ సాగారు. ఉత్సాహంతో జవాబులు చెప్పడం మొదలు పెట్టాం.అలా అరగంట పాటు చర్చ కొనసాగింది. ఇంతలో నా స్నేహితుడు లేచి ఒక విషయం చెప్పాడు.

"Yes, this is what exactly is called as Roll's theorem." ఆయన చెప్పారు.

ఆశ్చర్య పోవడం మావంతైంది. Roll's theorem మొదటి పాఠం అని తెలుసు (ముందే సిలబస్ చూసుకున్నాం కాబట్టి). కాని ఆ సిద్ధాంతాన్ని మా అంత మేమే చెపుతామని అస్సలు ఉహించ లేదు! ఇక ఆ థియరీని జీవితంలో ఎలా మరిచి పోగలం? తర్వాత ఆయన ఆ చాప్టర్ లో ఒక్క లెక్కని కుడా చెప్పలేదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే వాటిని మేమే పరిష్కరించి వేసాం. మూల సిద్ధాంతం తెలిసిన తర్వాత సమస్యలు పరిష్కరించడం ఎంత సులభమో అప్పుడు తెలిసింది.

సరిగ్గా ఇలాంటి విద్యా విధానమే మనకు కావలసినది. అయితే B Tech లో కాదు. ప్రాథమిక పాఠశాల నుండే మొదలు కావాలి. కాని జరుగు తున్నది వేరు. తోచింది చెప్పడం. గంటలకు గంటలు పిల్లల తో బట్టీయం వేయించడం. బండెడు హోం వరకు చేయించడం. దీంతో పిల్లలకు కనీసం ఆడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇక ఇంటర్మీడియేట్ కాలేజీల విషయం మరీ దారుణం. పిల్లలని చదివే యంత్రాలు గా భావిస్తున్నారు. ఫలితంగా ర్యాంకుల మాటేమో గాని, పిల్లలు మానసిక రోగులు గా మారుతున్నారు. ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.

Comments

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...