ఆంధ్ర జ్యోతి పత్రిక కొన్ని అతిశయోక్తి అలంకారాలతో ప్రజారాజ్యం పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక వ్యాసం రాసింది. ఆ వెంటనే ప్రజారాజ్యం కార్యకర్తలు ఆగ్రహోదగ్రులై ఆంధ్ర జ్యోతి కార్యాలయం పై ఆటవికంగా దాడి చేశారు.
ఈ విషయంలో ఆంధ్ర జ్యోతిది తప్పే కావచ్చు. అలా అని ఇప్పుడు తెలుగులో నిష్పక్షపాతంగా జర్నలిజం నియమాలను పాటిస్తున్న పత్రిక ఒక్కటైనా ఉందా? ఆంధ్ర జ్యోతి క్షమించ రానటువంటి ఘోరమైన వార్తనే వ్రాసింది అనుకుందాం. దాన్ని ఖండించ డానికి ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి. అంతే కాక press council కి కూడా నివేదించ వచ్చు.
కాని ప్రజారాజ్యం వారు ఏం చేసారు? వీరు చేసిన దాడి ఏ విధంగానూ సమర్ధించ లేనిది. వీరు పార్టీ ఇంకా ఏర్పడకముందే రాజశేఖర్, జీవిత లపై దాడి చేసి 'పూవు పుట్టగానే పరిమళిస్తుంది' అన్న సామెతని నిజం చేశారు. ఇప్పుడేమో ఏకంగా ఒక మీడియా సంస్థ మీదనే దాడికి తెగ బడ్డారు. వీరు ఇప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, రేపు పొరపాటున అధికారం లోకి వస్తే పరిస్తితి ఎలా వుంటుందో ఊహించు కోవాలంటేనే భయం వేస్తుంది.
ఇప్పటికీ చిరంజీవి ఈ దాడిని ఖండించక పోవడం చూస్తుంటే ఇదే వీరి పాలసీ అని అనుకోవలసి వస్తుంది.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.