Skip to main content

సాయి బాబానా, దేవుడా?

యధాలాపంగా చానెళ్ళు తిరగేస్తుంటే ABN/ఆంధ్రజ్యోతి లో ఒక వింత చర్చ కనిపించింది. 'అందరి వాడేనా' అనే టైటిల్ తో ఒక సాయి బాబా భక్తుడు గారు, ఒక శాస్త్రులు గారిని కూర్చో బెట్టి యాంకరు వీర లెవెల్లో తతంగం నడిపిస్తున్నాడు. నేను మధ్యలో జాయినైనానేమో ముందేమీ అర్థం కాలేదు. చివరకి అర్థమైన సారాంశం ఇదీ.

గుంటూరు జిల్లాకి చెందినా ఒక డాక్టరు గారు 'షిర్డీ సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు' అంటూ వాదం లేవ దీస్తూ ఒక పుస్తకం రాశాడట. దాంట్లో సాయిబాబా అసలు హిందువే కాదని, నిరంతరం 'అల్లా మాలిక్' అనుకుంటూ తిరిగిన వాడిని హిందువు లెందుకు పూజించాలని ఆయన ప్రశ్నలు లేవ దీశాడు. సనాతన ధర్మం రోజు రోజుకీ అటకెక్కి, జనం సాయి జపంలో మునిగి తేలుతున్న ఈ తరుణంలో కక్కా లేక మింగా లేక గుర్రుగా వున్న సనాతన వాదులకు దీంతో కొంత బలం చేకూరినట్టే కనిపిస్తుంది. అందుకే కాబోలు, శాస్త్రులు గారు వీర లెవెల్లో వాదన వినిపిస్తున్నారు.

ఎప్పుడూ నాస్తికులకు, అస్తిత్వ వాదులకు మధ్యన జరిగే వాదనలు విని విని విసుగెత్తిన తరుణంలో ఇదేదో కొత్తగా బాగానే ఉందని పించింది. వార్తల చానెల్సుకి కూడా కొత్త విషయం దొరికి నట్లుంది, రెండు వైపులా బాగానే ఎగ దోస్తున్నారు.

మన శాస్త్రుల వారు, రామాయణం, భాగవతం వగైరాలను ఉటంకిస్తూ అనర్ఘళంగా వాదించారు. దీనికి ప్రమాణం ఏంటి, దానికి ప్రమాణం ఏంటి అంటూ అడిగేసరికి బిత్తర పోవటం సాయి బాబా భక్తుల పని అయ్యింది. ఓహో, భక్తి విశ్వాసాలకు కూడా ప్రమాణా లుంటాయా? అని నేననుకునే లోపే మన సాయి భక్తులు తేరుకున్నారు. వారేం తక్కువ తిన్నారా? వీరికన్నా గొప్ప భక్తులు వారుకదా!

'సాయి చేసిన పరోపకారం చాలు సాయిని పూజించడానికి' అని ఒకాయన అందుకున్నాడు. ఓహో, పరోపకారం చేస్తే చాలు, పూజ లందు కోవచ్చన్న మాట అని నేననుకునే లోపే ఇంకొకాయన 'సాయి ఎన్నో మహిమలు చూపించాడు' అని మొదలు పెట్టాడు. మహిమలు చూపిస్తే దేవుడంటారా? అయితే టీవీ సీరియల్లో రాక్షసులకు కూడా బోల్డన్ని మహిమ లుంటాయే! మరి వారిని కూడా పూజించొచ్చా అనే ధర్మ సందేహం నాకోచ్చే లోపే, మన శాస్త్రుల వారు ఊరుకుంటారా? 'కుష్టు వ్యాధినే నయం చేసుకోలేని వాడు, ఇంకా మహిమలేమిటి? ఠాట్, అదంతా ఇంద్రజాలం' అంటూ కొట్టి పారేశారు.

దీనికి చిర్రెత్తు కొచ్చిన మన సాయి భక్తుడు, 'అసలు పదహారు వేల భామలతో కులికిన కృష్ణున్ని, భార్యను అడవులకు పంపిన రామున్ని పూజించగా లేనిది, సాయిని ఎందుకు పూజించ కూడదు?' అంటూ ఎదురు తిరిగాడు. 

ఏదయితే నేంగాని, చాలా రోజుల తర్వాత, భక్తులు భక్తులు కొట్టుకునే కార్యక్రమం ఒకటి చూడ్డానికి లభించింది. ఇందుకు ఆంధ్రజ్యోతి వారిని అభినందించాల్సిందే. మొత్తానికి మన భక్త బృందం తర్కాన్ని ఉపయోగించి (ఎదుటి వారిని తిట్టడం కోసమైనా సరే) వాదించడం సంతొషించ దగ్గ పరిణామం!

Comments

  1. అయ్యా తమరెవరోగానీ ఆ చర్చ నాముందు జరిగి ఉంటే ఆ శాస్త్రులు గారికి తగిన సమాధానం ఇచ్చి ఉండేవాడిని :)

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ, చర్చ నా ముందు జరగ లేదండి, ABN ఆంధ్రజ్యోతి వారి చానెల్లో జరిగింది.

    ReplyDelete
  3. మా వీధిలో షిర్డీ సాయిబాబా కూడా కాదు, సత్యసాయిబాబాకే భక్తులు ఎక్కువ. క్రైస్తవులు, ముస్లింలకి ఎంత మంది ప్రవక్తలు ఉన్నా ఒకే దేవుడిని నమ్ముతారు. మనవాళ్ళలాగ కొత్త దేవుళ్ళని సృష్ఠించుకోరు.

    ReplyDelete
  4. ఏ పుట్టలో ఏ పాముందో కాసిని పాలు పోద్దాం, ఏ రాయిలో ఏ మహిముందో ఓ మొక్కు పడేద్దామనే మన వాల్లకు సాయిబాబా అయితేనేమీ, కసాయి బాబు అయితేనేమి.

    బ్లాకు టికెట్లమ్ముకున్న బాలసాయిబాబాకి కూడా బహుషా ఓ యాభై ఏల్లు దాటితే ఊరూరా గుళ్ళు కడతారేమో.

    ReplyDelete
  5. This is Hilarious! Those two people proved themselves.


    రాముడు మనకి నేర్పించింది విరోధికి కూడా తగిన గౌరవమివ్వడం. షిరిడీ సాయిబాబా నేర్పించింది అనవసరమైన వాదనలకి దిగకపోవడం.

    వీళ్ళిద్దరూ కొట్టుకున్న విధానాన్ని చూస్తే వీళ్ళెలాంటి రామ/సాయి భక్తులో తెలియట్లేదా? :))

    ReplyDelete
  6. well said Rowdeejee. Such worthless discussions these are. Even to read such an article is a sheer waste of time. సాటి మనిషికి సహాయం చెయ్యలేని స్వార్ధపరులు ప్రజల కోసమే జీవించినవారిని మాటలనటం. ఇంతకన్నా హాస్యాస్పదం ఉండదేమో.

    ReplyDelete
  7. ఇక్కడ ఎవరూ మానవ సేవ చెయ్యడం తప్పు అనలేదు. మానవ సేవ పేరుతో మూఢ నమ్మకాలు ప్రచారం చెయ్యడం ఎందుకు? షిర్డీ సాయిబాబాకి మహిమలు ఉన్నాయని చెపుతున్నారు కాబట్టే విమర్శలు. మంత్రాలు, మహిమలు లాంటి మూఢ నమ్మకాలు మానసిక వికాసానికి అభివృద్ధికరమా, అభివృద్ధి నిరోధకమా? యండమూరి కాష్మోరా నవలని విమర్శించినవాళ్ళు అలాంటి మూఢనమ్మకాలనే నమ్మడం హాస్యాస్పదంగా ఉంది.

    ReplyDelete
  8. నేనూ నిన్న చూసా ఈ చర్చ.నవ్వు వచ్చింది నాకు.ఎదొ ఒకటి కెలకందే మన టీవీ వాల్లకీ త్రుప్తి ఉండదు,సో కాల్డ్ సనాతన వాదులకీ తోచదు.సాయి బాబా నన్ను పూజించండి అని తనకు తాను ఎప్పుడూ చెప్పలేదు.ఇష్టమయిన వాళ్ళు పూజిస్తున్నారు.ఈ పుస్తక రచయిత ఇప్పుడు కొత్తగా ఆయన గురించి చెప్పేదేమిటో నాకు అర్ధం కాదు.

    ఇలా మనలో మనమే ఇన్ని రకాలుగా కొట్టుకుంటాము కాబట్టే మత మార్పిడులు ఎక్కువ అయ్యాయి అని నా అభిప్రాయం

    ReplyDelete
  9. షిర్డీ సాయిబాబా 1990 తరువాతే పాపులర్ అయ్యాడు. 1990కి ముందు ఆ బాబా ఎవరో మాకు తెలియదు. 1990 తరువాత కరీంనగర్ లో కొంత మంది షిర్డీ సాయిబాబా భక్తులు పరిచయమైన తరువాత తెలిసింది.

    ReplyDelete
  10. నచికేత గారు. కల్కి భగవాన్ కి కూడా ఆలయాలు కట్టేవాళ్ళు ఉన్నారు.

    ReplyDelete
  11. పద్మ గారు,

    "సాటి మనిషికి సహాయం చెయ్యలేని స్వార్ధపరులు" అని మీరు ఎవరిని గురించి అన్నారో తెలియదు కానీ, ప్రజలకోసం జీవించిన వాల్లందరికీ మనం గుడి కట్టి పూజించం. ఒక గాంధీ, తిలక్, అంబేద్కర్, పటేల్, బోస్, భగత్ సింగ్ లాంటి వారికెవ్వరికీ గుడులు లేవు.

    వెర్రి జనం ఎవరి మాజిక్లు చూసి మోసపోతారో వాల్లనే దేవుడు అని అనుకుని గుడులు కడుతారు.

    ReplyDelete
  12. అసలు ఈ టివీ ల వాళ్ళూ ముఖ్యంగా tv9, ఆంద్రజ్యోతి పని కట్టుకొని విషయం తెలిసిన వాళ్ళను కాక పనికి మాలిన వాళ్ళను ఇంటర్వూ చేస్తుంటారు.వాళ్ళ మోటివ్ ఇలాంటి అలజడి సృష్టీంచటమే. అసలు సాయి భక్తులు రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎలా కించపరచ గలుగు తారు? అది ఆయన స్పూర్తి కే విరుద్దం.
    ఒక సారి పూరి జగన్నాధ్ గుడి గూర్చి ఒకాయన చేత పనికిమాలిన మాటలు చెప్పించారు.
    అసలు విషయం ఏమిటంటే, గురువుని దైవం గా భావించటం, యోగుల్ని పూజించటం హిందూ మతం ఒప్పుకొనే విషయమే. అయితే అందరు ఆయా గురువుల్ని పూజించక పొవచ్చు, ఒప్పుకోక పోవచ్చు. అయినంత మాత్రాన ఇతరుల్ని తప్పు పట్టాల్సిన పని లేదు. హిందూ మతం గొప్ప తనమే ఆ స్వేచ్చ. ఆ మాటకు వస్తే ఆది శంకరుల వారు, రామానుజాచార్యులు కూడా గురువులేకదా. వారిని ఆయా సంప్రదాయాలు పాటించేవారు దైవ సమానులుగా భావిస్తారు. గురు పూజ తప్పుకాదు. ఇది ముక్తికి సులభ మార్గం. మనకు ఎందరు పనికి మాలిన గురువులు పుట్టినా అంతకంటే ఎక్కువ సంఖ్యలొ అధ్భుత మైన గురువులు ఉన్నారుకనుకనే ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. రమణ మహర్షి, వివేకానంద స్వామి లాంటి వారిని కన్నది ఈ భరతమాత.

    ReplyDelete
  13. గుళ్ళు, వ్యక్తి పూజల గూర్చి చెప్పాలంటే మరి కుష్బూకి, నగ్మాకు రజనీకాంత్ కి, వైయస్సార్ కి ఆఖరికి నమితకు గుళ్ళు కట్టించారు. ఈ పిచ్చికి, అమాయకత్వానికి, స్వార్ధానికి మతాన్ని ముడి పెట్టనక్కరలేదు. దేవుళ్ళని కాదన్న వాళ్ళు రాజకీయ నాయకుల్ని, సినిమావాళ్ళని పూజిస్తున్నారు అంతకు మించిన ఎదుగుదల లేదు.

    ReplyDelete
  14. కాషాయం కట్టుకున్న ప్రతివాడిని పూజించడమే? విశ్వామిత్ర, శాండిల్య, భరద్వాజ మహర్షులు కూడా కాషాయం కట్టుకున్నారు. వాళ్ళకి గుడులు లేవు కానీ సాయిబాబాలకి ఎందుకు ఉన్నాయి?

    ReplyDelete
  15. మైత్రేయి గారు. నాస్తికులు ఎక్కడా వ్యక్తి పూజ చెయ్యరు. చిరంజీవికి, రజనికాంత్ కి ఆలయం కట్టిన నాస్తికులు ఎక్కడ ఉన్నారు?

    ReplyDelete
  16. మనము ఇలాగే కొట్టుకుంటూ ఉందాము,ఎంచక్కా చాప కింద నీరులాగ "దేవుని బిడ్డలు" etc తమ పని కానిచ్చెస్తారు.అప్పుడు మన తరువాత తరాల వాళ్ళకి చెప్పుకోవచ్చు "హిందూ" మతం అని ఒక మతం ఉండేది అప్పుడు అని.

    పనికిమాలిన టీవీలుపనికిమాలిన చర్చలు.సానియా,ఆయెషా,లలిత్ మోడీ గోల అయింది అనుకుంటే ఇదా ఇప్పుడు.వేరే మతం లో కూడా కాస్తో కూస్తో భిన్న అభిప్రాయాలు ఉంటాయి అవి ఎందుకు హైలైట్ చెయ్యరో మన టీవీల వాళ్ళు.అంత దమ్ము లేదు కనుక ఎవరికీను.ఎవరినీ ఏమీ అనకుండా చవటల్లాగ ఎవరయినా చర్చ లేవదీస్తే కొట్టుకునేది మనము మాత్రమే అని టీవీ ల వాళ్ళకి కూడా తెలుసు కనుక.ఎవరినీ నొప్పించాలి అని కాదు ఇలా రాసింది,ఎందుకు ఇలా వాదులాటలు,ఎవరికి ఇష్టమయిన దేవుడిని/బాబాని/యాక్టర్ ని వారు పూజించుకోక.

    ReplyDelete
  17. ప్రవీణ్, నేను తమిళ సోదరులని చూసి చెప్తున్నాను. డి యం కె మొత్తం నాస్తికులే వాళ్ళ మూల సిద్దాంతమే అది కాని వాళ్ళు వాళ్ళ నాయకుల కాళ్ళ పై పడటం, పూజలు చెయ్యటం కామన్. కమ్యూనిష్ట్ నాస్తికులు వ్యక్తి పూజ చెయ్యని మాట ఒప్పుకోవచ్చు.

    ReplyDelete
  18. రుషి గారు,

    భక్తి వ్యక్తి గతం. ఎవరికీ నచ్చిన దేవుణ్ణి వారు తప్పకుండా పూజించుకోవచ్చు. సంస్తాన్ ట్రస్టులు, వగైరాలు పెట్టి భక్తిని కార్పోరాటే స్థాయికి, రాజకీయాల స్తాయికి దిగజార్చు తున్నారు.

    పైగా భక్తి నమ్మకంతో, విశ్వాసంతో కూడుకున్నది. 'అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమః' అన్న విధంగా తమ తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి భక్తికి మించిన మందు లేదు. పరిపూర్ణ విశ్వాసంతో దేవున్ని పూజించే వారిని ఈ కాలంలో వెల్ల మీద లెక్క పెట్ట వచ్చు. తొంభై శాతం మంది 'చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద' అన్న చందంగా ఉంటారు.

    విశ్వాసంతో కూడి ఉండవలసిన భక్తికి ప్రమాణాలు, తార్కాణాలు వెదకడం, తర్క వివరణ చేయడం హాస్యాస్పదం కాదూ? పైగా తాము విశ్వసించేదే ఒప్పని, ఇతరులు విశ్వసిన్చేది తప్పనీ.

    మైత్రేయి గారు,

    చర్చలో కూర్చున్న వారు పనికి మాలిన వారేమీ కాదండి. వారి వారి విభాగాల్లో గొప్ప స్తానాల్లో ఉన్న వారే.

    పద్మ గారు,

    బ్లాగులు వ్రాయడం చదవడం కూడా కాలయాపనకే అన్న విషయం మీకు తెలియనిది కాదనుకుంటాను. ఏదో కామెడీ గా వుందని నాలుగు ముక్కలు రాశాను. మీ సమయాన్ని వృధా చేసుకుని ఈ వ్యాసం చదవడమే గాకుండా, తీరిక చేసుకిని వ్యాఖ్యానించి మరింత కామెడీ పంచినందుకు సంతోషం.

    పైన వ్యాఖ్యానించిన వారందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  19. దొంగ సాముల చేతులు , కాళ్ళు నరికేయాలి అప్పుడు వాళ్ళు కషాయం దుస్తులు వేసుకోలేరు. ఏమంటారు చె.శ గారు ?

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ