ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను.
'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం.
పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు.
నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు.
'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?'
మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.'
నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు!
పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుంటే మరి ప్రభుత్వం ఎలా చేస్తుందో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే తెలిసింది. తీర ప్రాంతంలో చెట్లు విచక్షణా రహితంగా నరికి వేయడానికి, తుఫాను విధ్వంస తీవ్రతకు సంబంధం ఉంది. ఈ విషయం ప్రపంచ పర్యావరణ సంస్థ మాజీ సలహాదారు శ్రీ జీవానంద రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా ఈ క్రింది విషయాలు తెలిపారు.
శతాబ్దాల నుండి మడ అడవులు, గడ్డి దుబ్బులు, రబ్బరు చెట్లు, జీడి మామిడి తీర ప్రాంతానికి సహజ రక్షణగా ఉండేవి. మితి మీరిన పారిశ్రామికీకరణలో భాగంగా వీటిని నేల మట్టం చేస్తున్నారు.
ఇలా తూర్పు గోదావరిలో 32000 ల హెక్టార్లు, కృష్ణాలో 30000 ల హెక్టార్ల మడ అడవులు ఈ విధంగా కనుమరుగు అయ్యాయి. చేపల, రొయ్యల సాగుకోసం ఈ జిల్లాలలో విచక్షణా రహితంగా వీటిని నరికి చెరువులు తవ్వారు.
నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాలలో పరిశ్రమలకు భూమిని కేటాయిస్తున్నారు. మచిలీపట్నం వద్ద ఒక ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి భూమి కేటాయించిన కారణంగా వేల ఎకరాల్లోని మడ అడవులను కొట్టి వేశారు. ఇలాగే కాకినాడలో వేరొక సంస్థ.
చరిత్ర ఏం చెబుతుంది?
ఆధారాలు:
'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం.
పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు.
నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు.
'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?'
మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.'
నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు!
పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుంటే మరి ప్రభుత్వం ఎలా చేస్తుందో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే తెలిసింది. తీర ప్రాంతంలో చెట్లు విచక్షణా రహితంగా నరికి వేయడానికి, తుఫాను విధ్వంస తీవ్రతకు సంబంధం ఉంది. ఈ విషయం ప్రపంచ పర్యావరణ సంస్థ మాజీ సలహాదారు శ్రీ జీవానంద రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా ఈ క్రింది విషయాలు తెలిపారు.
శతాబ్దాల నుండి మడ అడవులు, గడ్డి దుబ్బులు, రబ్బరు చెట్లు, జీడి మామిడి తీర ప్రాంతానికి సహజ రక్షణగా ఉండేవి. మితి మీరిన పారిశ్రామికీకరణలో భాగంగా వీటిని నేల మట్టం చేస్తున్నారు.
ఇలా తూర్పు గోదావరిలో 32000 ల హెక్టార్లు, కృష్ణాలో 30000 ల హెక్టార్ల మడ అడవులు ఈ విధంగా కనుమరుగు అయ్యాయి. చేపల, రొయ్యల సాగుకోసం ఈ జిల్లాలలో విచక్షణా రహితంగా వీటిని నరికి చెరువులు తవ్వారు.
నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాలలో పరిశ్రమలకు భూమిని కేటాయిస్తున్నారు. మచిలీపట్నం వద్ద ఒక ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి భూమి కేటాయించిన కారణంగా వేల ఎకరాల్లోని మడ అడవులను కొట్టి వేశారు. ఇలాగే కాకినాడలో వేరొక సంస్థ.
చరిత్ర ఏం చెబుతుంది?
- తీర ప్రాంతంలో అటవీశాఖ పెంచిన సరుగుడు వనాలు 1980 నుంచి 1987 వరకు వచ్చిన తుఫాన్ల తీవ్రతను చాలా వరకు అరికట్టాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పుడు నిధుల కేటాయింపు జరపక పోవడం వల్ల అటవీ శాఖ ఇవి పెంచడం లేదు.
- మడ అడవులు 1977 లో వచ్చిన ఉప్పెన నుండి గుంటూరు జిల్లాను కాపాడాయి. అప్పటికే దివిసీమ ప్రాంతంలో ఈ మడ అడవులను విచక్షణా రహితంగా నరికి వేయడం వళ్ళ పెనుప్రమాదం సంభవించింది.
- కేరళలోని కొల్లం, అళపుళ జిల్లాలలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఇక్కడ నష్టం అపరిమితంగా ఉంటుంది.
ఆధారాలు:
అందరూ ఆలోచించాల్సిన విషయాలు చెప్పారు.
ReplyDelete