Skip to main content

అడవులు

ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను.

'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం.

పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు.

నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు.

'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?'

మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.'

నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు!

పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుంటే మరి ప్రభుత్వం ఎలా చేస్తుందో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే తెలిసింది. తీర ప్రాంతంలో చెట్లు విచక్షణా రహితంగా నరికి వేయడానికి, తుఫాను విధ్వంస తీవ్రతకు సంబంధం ఉంది. ఈ విషయం ప్రపంచ పర్యావరణ సంస్థ మాజీ సలహాదారు శ్రీ జీవానంద రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా ఈ క్రింది విషయాలు తెలిపారు.

శతాబ్దాల నుండి మడ అడవులు, గడ్డి దుబ్బులు, రబ్బరు చెట్లు, జీడి మామిడి తీర ప్రాంతానికి సహజ రక్షణగా ఉండేవి. మితి మీరిన పారిశ్రామికీకరణలో భాగంగా వీటిని నేల మట్టం చేస్తున్నారు.

ఇలా తూర్పు గోదావరిలో 32000 ల హెక్టార్లు, కృష్ణాలో 30000 ల హెక్టార్ల మడ అడవులు ఈ విధంగా కనుమరుగు అయ్యాయి. చేపల, రొయ్యల సాగుకోసం ఈ జిల్లాలలో విచక్షణా రహితంగా వీటిని నరికి చెరువులు తవ్వారు.

నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాలలో పరిశ్రమలకు భూమిని కేటాయిస్తున్నారు. మచిలీపట్నం వద్ద ఒక ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి భూమి కేటాయించిన కారణంగా వేల ఎకరాల్లోని మడ అడవులను కొట్టి వేశారు. ఇలాగే కాకినాడలో వేరొక సంస్థ.

చరిత్ర ఏం చెబుతుంది?
  • తీర ప్రాంతంలో అటవీశాఖ పెంచిన సరుగుడు వనాలు 1980 నుంచి 1987 వరకు వచ్చిన తుఫాన్ల తీవ్రతను చాలా వరకు అరికట్టాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పుడు నిధుల కేటాయింపు జరపక పోవడం వల్ల అటవీ శాఖ ఇవి పెంచడం లేదు.
  • మడ అడవులు 1977 లో వచ్చిన ఉప్పెన నుండి గుంటూరు జిల్లాను కాపాడాయి. అప్పటికే దివిసీమ ప్రాంతంలో ఈ మడ అడవులను విచక్షణా రహితంగా నరికి వేయడం వళ్ళ పెనుప్రమాదం సంభవించింది.
  • కేరళలోని కొల్లం, అళపుళ జిల్లాలలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఇక్కడ నష్టం అపరిమితంగా ఉంటుంది.
ఇప్పుడు వచ్చిన లైలా సృష్టించిన పెను బీభత్సానికి కారణాలేమిటి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు మేల్కుని చెట్ల యొక్క విలువని గుర్తించి ప్రవర్తిస్తే మేలు.

ఆధారాలు:
  1. మన విధ్వంసం వల్లే పెను భీభత్సం 
  2. 'మడ'మ తిప్పేస్తున్నాం 

Comments

  1. అందరూ ఆలోచించాల్సిన విషయాలు చెప్పారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ