Skip to main content

అయేషా మీరా హత్య కేసు

అయేషా మీరా హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన సత్యం బాబు కన్ఫెషన్ వీడియో ఇది.



ఈ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని పోలీసులు ఏమీ సంపాదించ లేక పోయారు. ఈ కన్ఫెషన్ వీడియో, మరియు ఇతర సాంకేతిక పరమైన సాక్ష్యాలు తీర్పుకోసం పరిగణలోకి తీసుకున్నట్టు టీవీ ద్వారా విన్న సమాచారం.

నాకు న్యాయ పరమైన విషయాలు పెద్దగా తెలియవు. కాని ఒక సామాన్యుడిగా పరిశీలించినా, ఈ కేసులో దర్యాప్తు గాని, విచారణ గాని న్యాయబద్ధంగా జరిగాయని అనిపించడం లేదు.

ఎంతటి నేరస్తుడైనా, తాను చేసిన నేరాన్ని వివరిస్తున్నప్పుడు ఏదో ఒకలాంటి భావోద్వేగానికి గురి కావడం సర్వ సాధారణమైన విషయం. చేసిన డానికి పశ్చాత్తాపానికైనా గురవుతాడు, ఉన్మాదిగా నైనా మాట్లాడతాడు, ఏడుస్తాడు, లేదా గర్వంగా చెపుతాడు. కాని పై వీడియోలో చూస్తే సత్యం బాబు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోలీసుల వైపునుండి ఒక్క ప్రశ్న కూడా లేకుండా కథంతా పూసగుచ్చినట్టు చెప్పడం కూడా ఎవరో నేర్పించినట్టుగా లేదూ?

వెనక వైపున ఒక లుంగీనో దేన్నో బ్యాక్ డ్రాప్ గా కట్టారు. ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ పోలీసు స్టేషన్ లోనే కన్ఫెషన్ జరిగి ఉంటే ఆ బ్యాక్ డ్రాపు అవసరం ఏమిటి? పోలీసు స్టేషన్ గదో, గదిలో టేబులో, కుర్చీయో, లాకప్పో, తుపాకులో కనబడితే నష్టమేమిటి? అవి అదనపు సాక్ష్యంగా పనికి వస్తాయి కదా? పైగా వీడియోలో కేవలం నిందితున్నే చిత్రీకరిస్తూ, కన్ఫెషన్ రికార్డు చేస్తున్న వారిని చిత్రీకరించక పోవడం మరొక అనుమానాస్పదమైన విషయం. ఈ వీడియోను చూస్తుంటే ఇది పోలీసు స్టేషను లోనైనా, మరెక్కడైనా కూడా చిత్రీకరించారని అనుకోవాడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి.

కనీసం బాధితులకైనా ఓదార్పు నివ్వని ఈ తీర్పు ఎవరిని ఉద్ధరించడానికో అన్నది జగమెరిగిన సత్యం. తీర్పు వెలువడిన వెంటనే ఆయేషా మీరా తల్లిదండ్రులు, సత్యం బాబు అసలు దోషి కాదని, అసలు దోషులు కోనేరు వారి బంధు వర్గమని స్పష్టంగా ప్రకటించారు. బాధితులు నేరారోపణ చేసిన వారిని ఏమాత్రం విచారించకుండా, ఎవరో దారే పోయే లడ్డూని కొంతకాలం వేధించి, ఆనక సత్యం బాబు తో మమ అనిపించడం చూస్తుంటే న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం సన్నగిల్లుతుంది.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ