అయేషా మీరా హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన సత్యం బాబు కన్ఫెషన్ వీడియో ఇది.
ఈ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని పోలీసులు ఏమీ సంపాదించ లేక పోయారు. ఈ కన్ఫెషన్ వీడియో, మరియు ఇతర సాంకేతిక పరమైన సాక్ష్యాలు తీర్పుకోసం పరిగణలోకి తీసుకున్నట్టు టీవీ ద్వారా విన్న సమాచారం.
నాకు న్యాయ పరమైన విషయాలు పెద్దగా తెలియవు. కాని ఒక సామాన్యుడిగా పరిశీలించినా, ఈ కేసులో దర్యాప్తు గాని, విచారణ గాని న్యాయబద్ధంగా జరిగాయని అనిపించడం లేదు.
ఎంతటి నేరస్తుడైనా, తాను చేసిన నేరాన్ని వివరిస్తున్నప్పుడు ఏదో ఒకలాంటి భావోద్వేగానికి గురి కావడం సర్వ సాధారణమైన విషయం. చేసిన డానికి పశ్చాత్తాపానికైనా గురవుతాడు, ఉన్మాదిగా నైనా మాట్లాడతాడు, ఏడుస్తాడు, లేదా గర్వంగా చెపుతాడు. కాని పై వీడియోలో చూస్తే సత్యం బాబు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోలీసుల వైపునుండి ఒక్క ప్రశ్న కూడా లేకుండా కథంతా పూసగుచ్చినట్టు చెప్పడం కూడా ఎవరో నేర్పించినట్టుగా లేదూ?
వెనక వైపున ఒక లుంగీనో దేన్నో బ్యాక్ డ్రాప్ గా కట్టారు. ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ పోలీసు స్టేషన్ లోనే కన్ఫెషన్ జరిగి ఉంటే ఆ బ్యాక్ డ్రాపు అవసరం ఏమిటి? పోలీసు స్టేషన్ గదో, గదిలో టేబులో, కుర్చీయో, లాకప్పో, తుపాకులో కనబడితే నష్టమేమిటి? అవి అదనపు సాక్ష్యంగా పనికి వస్తాయి కదా? పైగా వీడియోలో కేవలం నిందితున్నే చిత్రీకరిస్తూ, కన్ఫెషన్ రికార్డు చేస్తున్న వారిని చిత్రీకరించక పోవడం మరొక అనుమానాస్పదమైన విషయం. ఈ వీడియోను చూస్తుంటే ఇది పోలీసు స్టేషను లోనైనా, మరెక్కడైనా కూడా చిత్రీకరించారని అనుకోవాడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి.
కనీసం బాధితులకైనా ఓదార్పు నివ్వని ఈ తీర్పు ఎవరిని ఉద్ధరించడానికో అన్నది జగమెరిగిన సత్యం. తీర్పు వెలువడిన వెంటనే ఆయేషా మీరా తల్లిదండ్రులు, సత్యం బాబు అసలు దోషి కాదని, అసలు దోషులు కోనేరు వారి బంధు వర్గమని స్పష్టంగా ప్రకటించారు. బాధితులు నేరారోపణ చేసిన వారిని ఏమాత్రం విచారించకుండా, ఎవరో దారే పోయే లడ్డూని కొంతకాలం వేధించి, ఆనక సత్యం బాబు తో మమ అనిపించడం చూస్తుంటే న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం సన్నగిల్లుతుంది.
ఈ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షులు గాని, సాక్ష్యాధారాలు గాని పోలీసులు ఏమీ సంపాదించ లేక పోయారు. ఈ కన్ఫెషన్ వీడియో, మరియు ఇతర సాంకేతిక పరమైన సాక్ష్యాలు తీర్పుకోసం పరిగణలోకి తీసుకున్నట్టు టీవీ ద్వారా విన్న సమాచారం.
నాకు న్యాయ పరమైన విషయాలు పెద్దగా తెలియవు. కాని ఒక సామాన్యుడిగా పరిశీలించినా, ఈ కేసులో దర్యాప్తు గాని, విచారణ గాని న్యాయబద్ధంగా జరిగాయని అనిపించడం లేదు.
ఎంతటి నేరస్తుడైనా, తాను చేసిన నేరాన్ని వివరిస్తున్నప్పుడు ఏదో ఒకలాంటి భావోద్వేగానికి గురి కావడం సర్వ సాధారణమైన విషయం. చేసిన డానికి పశ్చాత్తాపానికైనా గురవుతాడు, ఉన్మాదిగా నైనా మాట్లాడతాడు, ఏడుస్తాడు, లేదా గర్వంగా చెపుతాడు. కాని పై వీడియోలో చూస్తే సత్యం బాబు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోలీసుల వైపునుండి ఒక్క ప్రశ్న కూడా లేకుండా కథంతా పూసగుచ్చినట్టు చెప్పడం కూడా ఎవరో నేర్పించినట్టుగా లేదూ?
వెనక వైపున ఒక లుంగీనో దేన్నో బ్యాక్ డ్రాప్ గా కట్టారు. ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ పోలీసు స్టేషన్ లోనే కన్ఫెషన్ జరిగి ఉంటే ఆ బ్యాక్ డ్రాపు అవసరం ఏమిటి? పోలీసు స్టేషన్ గదో, గదిలో టేబులో, కుర్చీయో, లాకప్పో, తుపాకులో కనబడితే నష్టమేమిటి? అవి అదనపు సాక్ష్యంగా పనికి వస్తాయి కదా? పైగా వీడియోలో కేవలం నిందితున్నే చిత్రీకరిస్తూ, కన్ఫెషన్ రికార్డు చేస్తున్న వారిని చిత్రీకరించక పోవడం మరొక అనుమానాస్పదమైన విషయం. ఈ వీడియోను చూస్తుంటే ఇది పోలీసు స్టేషను లోనైనా, మరెక్కడైనా కూడా చిత్రీకరించారని అనుకోవాడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి.
కనీసం బాధితులకైనా ఓదార్పు నివ్వని ఈ తీర్పు ఎవరిని ఉద్ధరించడానికో అన్నది జగమెరిగిన సత్యం. తీర్పు వెలువడిన వెంటనే ఆయేషా మీరా తల్లిదండ్రులు, సత్యం బాబు అసలు దోషి కాదని, అసలు దోషులు కోనేరు వారి బంధు వర్గమని స్పష్టంగా ప్రకటించారు. బాధితులు నేరారోపణ చేసిన వారిని ఏమాత్రం విచారించకుండా, ఎవరో దారే పోయే లడ్డూని కొంతకాలం వేధించి, ఆనక సత్యం బాబు తో మమ అనిపించడం చూస్తుంటే న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం సన్నగిల్లుతుంది.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.