Skip to main content

సమస్యాపూరణం

శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగులో ఇటీవల నేను చేసిన పూరణలు.

ఆ.వె.

జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి
దొంగ స్వామి నగరి దూరి నంత
చేరె చక్రధరుని చెల్లియే తనచెంత
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె

కం.

మిడిమేళపు దొర యొక్కడు
కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్
నడిరేయి గండి పడెనట
గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

కం.

ఏమూలో దాగిన కవి
సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్
ఆ మాన్యు ప్రోద్బలము చే
పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

కం.

హవ్వా యనగను సిబియై
చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్
ఇవ్విధమగు శోధనమున
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

తే.గీ.

రైతు మరచిన హైటెక్కు రాజకీయు
డతని నోడించి నొక 'దేవు' కందల మిడ
వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?

కం.

తానధికారము నుండగ
ఏనాడూ కానలేదు ఈయన రైతున్
కానగ రైతులపై అభి
మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

ఆ.వె.

దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను
దారి మరచినంత తప్ప నగును
దారి వెతికి వెతికి దరిజేరకున్నను
దారి తప్పు వాడు; ధర్మ విధుడు

తే.గీ.

వీధివీధిలో భిక్షకై వేడుకొనగ
దొరకలేదెట నొక రొట్టె తునకయైన
కోర మృష్టాన్నమును; సద్ది కూడు, గొడ్డు
కార మొసఁగు జల్లదనము కన్నుఁ గవకు

కం.

లడ్లా స్వీట్లవి పడదుర
గ్రుడ్లా వద్దుర అరుగవు కుక్షికి బరువై
గుడ్లను కన్నీరు దిరుగు
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

కం.

మర మనుషుల కాలంబున
తెరువరియై మనిషి జేయ దీటుగ క్లోనింగ్
అరయగ నచ్చెరువెందుకు?
"సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్"

తే.గీ.

పరమ గురువు నిత్యానంద బాబ యైన
కల్కి భగవానుడని చెప్పు కపటుడైన
తనకు కోర్కెలు కలిగి సందడిని చేయ
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

కం.

ఓదార్పు యాత్రలనుచును
గోదాలో దిగిన జగను కొంపల పైనన్
సోదా జరుగునని తలచి
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.

కం.

భాషించడు దుర్భాషలు
ద్వేషించడు వెనుక గొయ్యి తీసెడు జనులన్
దోషుల గాంచుచు పలుకక
రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్

కం.

ఓదార్చెద నేనంచును
ఓదారుపు యాత్ర చేయ నొక్కడు వెడలెన్
'ఓదార్పు' పదవి కైనను
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

కం.

వినినంత జనులు ఆగక
తనగొప్పలు చెప్పి చెప్పి దంచుచు ఊకన్
జనులను ఊదర గొట్టగ
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.

Comments

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...