Skip to main content

సమస్యాపూరణం

శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం బ్లాగులో ఇటీవల నేను చేసిన పూరణలు.

ఆ.వె.

జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి
దొంగ స్వామి నగరి దూరి నంత
చేరె చక్రధరుని చెల్లియే తనచెంత
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె

కం.

మిడిమేళపు దొర యొక్కడు
కడ గ్రేడు సిమెంటు వాడి కట్టగ డ్యామున్
నడిరేయి గండి పడెనట
గొడుగెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్!

కం.

ఏమూలో దాగిన కవి
సాముగరిడి చేసె కంది శంకరు మహిమన్
ఆ మాన్యు ప్రోద్బలము చే
పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.

కం.

హవ్వా యనగను సిబియై
చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్
ఇవ్విధమగు శోధనమున
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

తే.గీ.

రైతు మరచిన హైటెక్కు రాజకీయు
డతని నోడించి నొక 'దేవు' కందల మిడ
వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?

కం.

తానధికారము నుండగ
ఏనాడూ కానలేదు ఈయన రైతున్
కానగ రైతులపై అభి
మానమ్మే లేనివాఁడు మాన్యుం డయ్యెన్.

ఆ.వె.

దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను
దారి మరచినంత తప్ప నగును
దారి వెతికి వెతికి దరిజేరకున్నను
దారి తప్పు వాడు; ధర్మ విధుడు

తే.గీ.

వీధివీధిలో భిక్షకై వేడుకొనగ
దొరకలేదెట నొక రొట్టె తునకయైన
కోర మృష్టాన్నమును; సద్ది కూడు, గొడ్డు
కార మొసఁగు జల్లదనము కన్నుఁ గవకు

కం.

లడ్లా స్వీట్లవి పడదుర
గ్రుడ్లా వద్దుర అరుగవు కుక్షికి బరువై
గుడ్లను కన్నీరు దిరుగు
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

కం.

మర మనుషుల కాలంబున
తెరువరియై మనిషి జేయ దీటుగ క్లోనింగ్
అరయగ నచ్చెరువెందుకు?
"సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్"

తే.గీ.

పరమ గురువు నిత్యానంద బాబ యైన
కల్కి భగవానుడని చెప్పు కపటుడైన
తనకు కోర్కెలు కలిగి సందడిని చేయ
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

కం.

ఓదార్పు యాత్రలనుచును
గోదాలో దిగిన జగను కొంపల పైనన్
సోదా జరుగునని తలచి
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.

కం.

భాషించడు దుర్భాషలు
ద్వేషించడు వెనుక గొయ్యి తీసెడు జనులన్
దోషుల గాంచుచు పలుకక
రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్

కం.

ఓదార్చెద నేనంచును
ఓదారుపు యాత్ర చేయ నొక్కడు వెడలెన్
'ఓదార్పు' పదవి కైనను
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

కం.

వినినంత జనులు ఆగక
తనగొప్పలు చెప్పి చెప్పి దంచుచు ఊకన్
జనులను ఊదర గొట్టగ
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ