Skip to main content

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉంది. స్వతంత్ర భారత దేశంలో బహుషా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గడ్డు పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ వచ్చి ఉండదు.

ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.  

జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది.

ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి. ఈవిషయంలో ఎటువేపు వెళ్ళినా ఇంకోవర్గం వారి వ్యతిరేకతను చవిచూడక తప్పదు! ఒక పాలసీ అంటూ లేకుండా తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆ పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ ఈ పార్టీకి అటువంటి అలవాట్లు లేవన్నది చారిత్రక సత్యం.  

ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, పెట్రోలు ధరలు, నీటి సమస్యలు మొదలైన అంశాలతో చంద్రబాబు నాయుడు పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్నికలలో గెలవలేలనే శంకే లేకపోయి ఉండకపోతే ఆయన ఈపాటికే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ బలహీనతలు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఒక వరంలా మారాయని చెప్పవచ్చు.

పద్ధెనిమిదిమంది ఎమ్మెల్యేలతో చక్రం తిప్పే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చిరంజీవి రోజూ కాంగ్రేస్ తలుపు తట్టి వస్తున్నాడు, కాని ఎందుకో కాంగ్రేస్ వారే ఆయన్ను గడప దగ్గరే అపేస్తున్నారు. బహుశా ఈయన్ని తీసుకొని ఇంకొన్ని సమస్యలు కొనుక్కోవడం ఇష్టం లేనట్టుంది వారికి!

ఇలాంటి పరిస్థితులలో రేపు తెలంగాణా పై జరుగబోయే రెండో అఖిలపక్ష సమావేశంలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి ఎదురయ్యింది. వంద సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికి ఎలాంటి సర్వరోగ నివారిణిని కనిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ