ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉంది. స్వతంత్ర భారత దేశంలో బహుషా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గడ్డు పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ వచ్చి ఉండదు.
ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.
జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది.
ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి. ఈవిషయంలో ఎటువేపు వెళ్ళినా ఇంకోవర్గం వారి వ్యతిరేకతను చవిచూడక తప్పదు! ఒక పాలసీ అంటూ లేకుండా తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆ పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ ఈ పార్టీకి అటువంటి అలవాట్లు లేవన్నది చారిత్రక సత్యం.
ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, పెట్రోలు ధరలు, నీటి సమస్యలు మొదలైన అంశాలతో చంద్రబాబు నాయుడు పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్నికలలో గెలవలేలనే శంకే లేకపోయి ఉండకపోతే ఆయన ఈపాటికే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ బలహీనతలు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఒక వరంలా మారాయని చెప్పవచ్చు.
పద్ధెనిమిదిమంది ఎమ్మెల్యేలతో చక్రం తిప్పే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చిరంజీవి రోజూ కాంగ్రేస్ తలుపు తట్టి వస్తున్నాడు, కాని ఎందుకో కాంగ్రేస్ వారే ఆయన్ను గడప దగ్గరే అపేస్తున్నారు. బహుశా ఈయన్ని తీసుకొని ఇంకొన్ని సమస్యలు కొనుక్కోవడం ఇష్టం లేనట్టుంది వారికి!
ఇలాంటి పరిస్థితులలో రేపు తెలంగాణా పై జరుగబోయే రెండో అఖిలపక్ష సమావేశంలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి ఎదురయ్యింది. వంద సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికి ఎలాంటి సర్వరోగ నివారిణిని కనిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది.
ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.
జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది.
ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి. ఈవిషయంలో ఎటువేపు వెళ్ళినా ఇంకోవర్గం వారి వ్యతిరేకతను చవిచూడక తప్పదు! ఒక పాలసీ అంటూ లేకుండా తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆ పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ ఈ పార్టీకి అటువంటి అలవాట్లు లేవన్నది చారిత్రక సత్యం.
ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, పెట్రోలు ధరలు, నీటి సమస్యలు మొదలైన అంశాలతో చంద్రబాబు నాయుడు పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్నికలలో గెలవలేలనే శంకే లేకపోయి ఉండకపోతే ఆయన ఈపాటికే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ బలహీనతలు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఒక వరంలా మారాయని చెప్పవచ్చు.
పద్ధెనిమిదిమంది ఎమ్మెల్యేలతో చక్రం తిప్పే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చిరంజీవి రోజూ కాంగ్రేస్ తలుపు తట్టి వస్తున్నాడు, కాని ఎందుకో కాంగ్రేస్ వారే ఆయన్ను గడప దగ్గరే అపేస్తున్నారు. బహుశా ఈయన్ని తీసుకొని ఇంకొన్ని సమస్యలు కొనుక్కోవడం ఇష్టం లేనట్టుంది వారికి!
ఇలాంటి పరిస్థితులలో రేపు తెలంగాణా పై జరుగబోయే రెండో అఖిలపక్ష సమావేశంలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి ఎదురయ్యింది. వంద సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికి ఎలాంటి సర్వరోగ నివారిణిని కనిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.