శ్రీకృష్ణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఎంపీలతో జోరుగా మంతనాలు జరుపుతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కారమైతే చాలు, పరిష్కారం వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ సీమాంధ్ర వారిని, తెలంగాణా వారిని ఒకే పరిష్కారం దిశగా ఒప్పించడం నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో చిదంబరం గారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.
జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా.
ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా అది తన విధివిధానాలలో లేని అంశమని భావించ వచ్చు.
తెలంగాణా వారు సీమాంధ్రులతో కలిసి ఉండడం ఒప్పుకోనట్టే, రాయలసీమ వారు కూడా కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడం ఒప్పుకోవటం లేదు. సమైక్యంగానైనా ఉంచండి, లేదా రాయలసీమ (వీలైతే గ్రేటర్ రాయలసీమ) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని వారు చెపుతున్నారు.
కోస్తా పెట్టుబడిదారులపై తెలంగాణా వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో, వారికీ అలాంటి భయాలే ఉన్నాయి. ఇప్పటికే వారు శ్రీబాఘ్ ఒప్పందం తుంగలో తొక్కారని ప్రతి వేదికపై కోస్తాంధ్ర వారిపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ లుకలుకలు కనపడవు. విడిపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఇవన్నీ తప్పక బయటికి వస్తాయి. అయితే ఇవి తెలంగాణా/ఆంధ్ర వంటి జటిలమైన సమస్యలు కాక పోయినా వీటిని పూర్తిగా త్రోసివేయలేం.
ఇటువంటి పరిస్థితిలో కోస్తాని రెండు ముక్కలు చేసి, రాయలసీమకు తెలంగాణాకు ఒక్కోటి కలిపివేసి రెండురాష్ట్రాలు గా చేసే ఆలోచన చేసిఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కోస్తా వారిపై తెలంగాణా వారిదే మెజారిటీ అవుతుంది కాబట్టి తెలంగాణా వారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణాకి ఓడ రేవుల సమస్య కూడా తీరుతుంది. హైదరాబాదుపై , నదీజలాలపై కోస్తావారికున్న భావోద్వేగాల దృష్ట్యా కోస్తా వారు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమ వారు మొదటి నుండి గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు కాబట్టి వారు కూడా సంతోషించే అవకాశం ఉంది.
నిజానికి ఇలాంటి ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజల వద్దనుండి వచ్చాయి. వారు చేసిన ఆరు ప్రతిపాదనలకి తోడుగా ఏడోదిగా దీన్నికూడా చేర్చి ఉంటే చర్చకు కొంత అవకాశం ఉండేది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో ఈ ప్రతిపాదనని అంగీకరింప చేసేందుకు ప్రయత్నించేదేమో. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకి తెర పడినట్టే.
జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా.
ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా అది తన విధివిధానాలలో లేని అంశమని భావించ వచ్చు.
తెలంగాణా వారు సీమాంధ్రులతో కలిసి ఉండడం ఒప్పుకోనట్టే, రాయలసీమ వారు కూడా కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడం ఒప్పుకోవటం లేదు. సమైక్యంగానైనా ఉంచండి, లేదా రాయలసీమ (వీలైతే గ్రేటర్ రాయలసీమ) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని వారు చెపుతున్నారు.
కోస్తా పెట్టుబడిదారులపై తెలంగాణా వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో, వారికీ అలాంటి భయాలే ఉన్నాయి. ఇప్పటికే వారు శ్రీబాఘ్ ఒప్పందం తుంగలో తొక్కారని ప్రతి వేదికపై కోస్తాంధ్ర వారిపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ లుకలుకలు కనపడవు. విడిపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఇవన్నీ తప్పక బయటికి వస్తాయి. అయితే ఇవి తెలంగాణా/ఆంధ్ర వంటి జటిలమైన సమస్యలు కాక పోయినా వీటిని పూర్తిగా త్రోసివేయలేం.
ఇటువంటి పరిస్థితిలో కోస్తాని రెండు ముక్కలు చేసి, రాయలసీమకు తెలంగాణాకు ఒక్కోటి కలిపివేసి రెండురాష్ట్రాలు గా చేసే ఆలోచన చేసిఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కోస్తా వారిపై తెలంగాణా వారిదే మెజారిటీ అవుతుంది కాబట్టి తెలంగాణా వారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణాకి ఓడ రేవుల సమస్య కూడా తీరుతుంది. హైదరాబాదుపై , నదీజలాలపై కోస్తావారికున్న భావోద్వేగాల దృష్ట్యా కోస్తా వారు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమ వారు మొదటి నుండి గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు కాబట్టి వారు కూడా సంతోషించే అవకాశం ఉంది.
నిజానికి ఇలాంటి ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజల వద్దనుండి వచ్చాయి. వారు చేసిన ఆరు ప్రతిపాదనలకి తోడుగా ఏడోదిగా దీన్నికూడా చేర్చి ఉంటే చర్చకు కొంత అవకాశం ఉండేది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో ఈ ప్రతిపాదనని అంగీకరింప చేసేందుకు ప్రయత్నించేదేమో. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకి తెర పడినట్టే.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.