Skip to main content

గ్రేటర్ రాయలసీమ, గ్రేటర్ తెలంగాణా

శ్రీకృష్ణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఎంపీలతో జోరుగా మంతనాలు జరుపుతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కారమైతే చాలు, పరిష్కారం వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ సీమాంధ్ర వారిని, తెలంగాణా వారిని ఒకే పరిష్కారం దిశగా ఒప్పించడం నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో చిదంబరం గారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా.

ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా అది తన విధివిధానాలలో లేని అంశమని భావించ వచ్చు.

తెలంగాణా వారు సీమాంధ్రులతో కలిసి ఉండడం ఒప్పుకోనట్టే, రాయలసీమ వారు కూడా కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడం ఒప్పుకోవటం లేదు. సమైక్యంగానైనా ఉంచండి, లేదా రాయలసీమ (వీలైతే గ్రేటర్ రాయలసీమ) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని వారు చెపుతున్నారు.

కోస్తా పెట్టుబడిదారులపై తెలంగాణా వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో, వారికీ అలాంటి భయాలే ఉన్నాయి. ఇప్పటికే వారు  శ్రీబాఘ్ ఒప్పందం తుంగలో తొక్కారని ప్రతి వేదికపై కోస్తాంధ్ర వారిపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ లుకలుకలు కనపడవు. విడిపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఇవన్నీ తప్పక బయటికి వస్తాయి. అయితే ఇవి తెలంగాణా/ఆంధ్ర వంటి జటిలమైన సమస్యలు కాక పోయినా వీటిని పూర్తిగా త్రోసివేయలేం.

ఇటువంటి పరిస్థితిలో కోస్తాని రెండు ముక్కలు చేసి, రాయలసీమకు తెలంగాణాకు ఒక్కోటి కలిపివేసి రెండురాష్ట్రాలు గా చేసే ఆలోచన చేసిఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కోస్తా వారిపై తెలంగాణా వారిదే మెజారిటీ అవుతుంది కాబట్టి తెలంగాణా వారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణాకి ఓడ రేవుల సమస్య కూడా తీరుతుంది. హైదరాబాదుపై , నదీజలాలపై కోస్తావారికున్న భావోద్వేగాల దృష్ట్యా కోస్తా వారు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమ వారు మొదటి నుండి గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు కాబట్టి వారు కూడా సంతోషించే అవకాశం ఉంది.

నిజానికి ఇలాంటి ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజల వద్దనుండి వచ్చాయి. వారు చేసిన ఆరు ప్రతిపాదనలకి తోడుగా ఏడోదిగా దీన్నికూడా చేర్చి ఉంటే చర్చకు కొంత అవకాశం ఉండేది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో ఈ ప్రతిపాదనని అంగీకరింప చేసేందుకు ప్రయత్నించేదేమో. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకి తెర పడినట్టే. 
  

Comments

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...