Skip to main content

గ్రేటర్ రాయలసీమ, గ్రేటర్ తెలంగాణా

శ్రీకృష్ణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఎంపీలతో జోరుగా మంతనాలు జరుపుతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కారమైతే చాలు, పరిష్కారం వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ సీమాంధ్ర వారిని, తెలంగాణా వారిని ఒకే పరిష్కారం దిశగా ఒప్పించడం నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో చిదంబరం గారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా.

ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా అది తన విధివిధానాలలో లేని అంశమని భావించ వచ్చు.

తెలంగాణా వారు సీమాంధ్రులతో కలిసి ఉండడం ఒప్పుకోనట్టే, రాయలసీమ వారు కూడా కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడం ఒప్పుకోవటం లేదు. సమైక్యంగానైనా ఉంచండి, లేదా రాయలసీమ (వీలైతే గ్రేటర్ రాయలసీమ) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని వారు చెపుతున్నారు.

కోస్తా పెట్టుబడిదారులపై తెలంగాణా వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో, వారికీ అలాంటి భయాలే ఉన్నాయి. ఇప్పటికే వారు  శ్రీబాఘ్ ఒప్పందం తుంగలో తొక్కారని ప్రతి వేదికపై కోస్తాంధ్ర వారిపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ లుకలుకలు కనపడవు. విడిపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఇవన్నీ తప్పక బయటికి వస్తాయి. అయితే ఇవి తెలంగాణా/ఆంధ్ర వంటి జటిలమైన సమస్యలు కాక పోయినా వీటిని పూర్తిగా త్రోసివేయలేం.

ఇటువంటి పరిస్థితిలో కోస్తాని రెండు ముక్కలు చేసి, రాయలసీమకు తెలంగాణాకు ఒక్కోటి కలిపివేసి రెండురాష్ట్రాలు గా చేసే ఆలోచన చేసిఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కోస్తా వారిపై తెలంగాణా వారిదే మెజారిటీ అవుతుంది కాబట్టి తెలంగాణా వారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణాకి ఓడ రేవుల సమస్య కూడా తీరుతుంది. హైదరాబాదుపై , నదీజలాలపై కోస్తావారికున్న భావోద్వేగాల దృష్ట్యా కోస్తా వారు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమ వారు మొదటి నుండి గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు కాబట్టి వారు కూడా సంతోషించే అవకాశం ఉంది.

నిజానికి ఇలాంటి ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజల వద్దనుండి వచ్చాయి. వారు చేసిన ఆరు ప్రతిపాదనలకి తోడుగా ఏడోదిగా దీన్నికూడా చేర్చి ఉంటే చర్చకు కొంత అవకాశం ఉండేది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో ఈ ప్రతిపాదనని అంగీకరింప చేసేందుకు ప్రయత్నించేదేమో. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకి తెర పడినట్టే. 
  

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ