Skip to main content

కుహనా సమైక్య వాదం, కుహనా ప్రత్యేక వాదం

ఇప్పుడు రగులుతున్న తెలంగాణా సమస్యలో ప్రధానంగా రెండు వాదాలు వినిపిస్తాయి. రాష్ట్రాన్ని విభజించాలని చెప్పే ప్రత్యేక వాదం ఒకటి కాగా, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని చెప్పే సమైక్య వాదం ఒకటి.

ప్రత్యేక వాదుల విషయానికొస్తే మొదలు చెప్పుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సాధనం మాత్రమే సమస్యకు ఏకైక వికల్పంగా భావిస్తున్న తెలంగాణా ప్రాంతంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, మేధావులు, రాజకీయులు. అలాగే ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంతో మాత్రమే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆంధ్రా ప్రజలు, మేధావులు, రాజకీయులు. తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సానుభూతితో విభజన కోరుతున్న ఆంధ్రా ప్రజలు, మేధావులు. వీరందరూ ఏదో ఒక కారణంతో రాష్ట్ర విభజననే కోరుతున్నారు.

ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పే వాదనలు తెలుగు జాతి, తెలుగు జాతి సౌభ్రాతృత్వం, తెలుగు జాతి సమైక్యత చుట్టూ తిరుగుతుంటాయి. వీరి వాదనలో విపరీతమైన భాషాప్రేమ తప్ప మరేమీ కనిపించదు. సగటు తెలంగాణా పౌరుడు 'తన పొట్ట నిండడమా? తెలుగుపై ప్రేమా?' అన్న మీమాంసలో మొదటి దాన్నే ఎంచుకున్నాడని వీరు గుర్తించరు. తెలుగు జాతి సౌభ్రాత్వుత్వం గురించి మాట్లాడే వారికి, తమ సోదరులు కోరుతున్న న్యాయ బద్ధమైన కోరికలు కనపడవు. వారి పోరాటాలు, త్యాగాలు కనపడవు. కాని వారు ఆవేశంలో చేసిన చిన్న చిన్న పొరబాట్లు మాత్రం భూతద్దంలో చూసినట్టు కనబడతాయి.

ఇక పోతే ఇప్పుడు శీర్షికలో ప్రస్తావించిన కుహనా వాదాల గురించి ప్రస్తావిద్దాం. 

మొదట కుహనా సమైక్యవాదం గురించి.

వీరు సమైక్య వాదం పై పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతారు. వీరి వాదాలు అన్నీ వీగిపోయే సమయం వచ్చినప్పుడు మాత్రం అసలు విషయం బయట పెడతారు. అదేనండీ, హైదరాబాదు. మాకు హైదరాబాదు ఇచ్చేస్తే, ఒక్క రోజులో తెలంగాణా ఇస్తాం అంటారు, అదేదో వారి ఇంటినుండి తెచ్చి ఇచ్చేటట్టు! వీరికి ఉన్నది హైదరాబాదు నగరం పై కాంక్ష తప్ప సమైక్యత భావన ఆవగింజంత కూడా ఉండదు. ఇంకొంత మంది మాత్రం 'హైదరాబాదు కూడా కాదు, మాది నీటి సమస్య' అంటారు. వీరు కొంతలో కొంత నయం మనసులో మాట చెప్పినందుకు. మరి వీరికున్న భయాలేవో మాత్రం చెప్పరు. ఇప్పుడ అన్ని రాష్ట్రాల మధ్య నీటి ట్రిబ్యునళ్ళు ఎలా పని చేస్తున్నాయో, విడిపోయాక కూడా అలాగే పని చేస్తాయి  అనే విషయం వీరికి తెలియదనుకోవాలా?

ఇక కుహనా ప్రత్యేకవాదం గురించి.

వీరు మేం ప్రత్యేక వాదులమనే చెప్పుతారు.  పైగా 1972 ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నామని కూడా చెపుతారు. 'విడిపోతే మేం మీకంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం' అంటారు. 'మరి విడిపోవచ్చు గదా?' అని అడిగితే మాత్రం అసలు రంగు బయట పెడతారు. 'మీరు మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి విడిపోం' అన్నది వీరి ముఖ్యమైన వాదన. ఏ ఉద్యమమైనా దేనికో ఒకదానికి వ్యతిరేకంగానే పుడుతుంది. ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అన్ని రకాల భాషలు ప్రయోగింప బడతాయి. ఇలాంటి వారికి తెలంగాణా వాదులను తాలిబాన్లని సంబోధించడం మాత్రం కనపడదు. తాము ఒకప్పుడు తెలంగాణాకి అనుకూలంగా ఉన్న ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేసామన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచి పోతారు. వీరు బయటికి చెప్పేది ప్రత్యేక వాదమే అయినా వీరిది కుహనా సమైక్య వాదులకు, వీరికి పెద్దగా తేడా లేదు. అదేమిటో బహిరంగ రహస్యమే, హైదరాబాదు పై, దామాషాకు మించిన జలాలపై ఆశ తప్ప మరేమీ కాదు.

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ