ఇప్పుడు రగులుతున్న తెలంగాణా సమస్యలో ప్రధానంగా రెండు వాదాలు వినిపిస్తాయి. రాష్ట్రాన్ని విభజించాలని చెప్పే ప్రత్యేక వాదం ఒకటి కాగా, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని చెప్పే సమైక్య వాదం ఒకటి.
ప్రత్యేక వాదుల విషయానికొస్తే మొదలు చెప్పుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సాధనం మాత్రమే సమస్యకు ఏకైక వికల్పంగా భావిస్తున్న తెలంగాణా ప్రాంతంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, మేధావులు, రాజకీయులు. అలాగే ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంతో మాత్రమే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆంధ్రా ప్రజలు, మేధావులు, రాజకీయులు. తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సానుభూతితో విభజన కోరుతున్న ఆంధ్రా ప్రజలు, మేధావులు. వీరందరూ ఏదో ఒక కారణంతో రాష్ట్ర విభజననే కోరుతున్నారు.
ఇక కుహనా ప్రత్యేకవాదం గురించి.
వీరు మేం ప్రత్యేక వాదులమనే చెప్పుతారు. పైగా 1972 ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నామని కూడా చెపుతారు. 'విడిపోతే మేం మీకంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం' అంటారు. 'మరి విడిపోవచ్చు గదా?' అని అడిగితే మాత్రం అసలు రంగు బయట పెడతారు. 'మీరు మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి విడిపోం' అన్నది వీరి ముఖ్యమైన వాదన. ఏ ఉద్యమమైనా దేనికో ఒకదానికి వ్యతిరేకంగానే పుడుతుంది. ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అన్ని రకాల భాషలు ప్రయోగింప బడతాయి. ఇలాంటి వారికి తెలంగాణా వాదులను తాలిబాన్లని సంబోధించడం మాత్రం కనపడదు. తాము ఒకప్పుడు తెలంగాణాకి అనుకూలంగా ఉన్న ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేసామన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచి పోతారు. వీరు బయటికి చెప్పేది ప్రత్యేక వాదమే అయినా వీరిది కుహనా సమైక్య వాదులకు, వీరికి పెద్దగా తేడా లేదు. అదేమిటో బహిరంగ రహస్యమే, హైదరాబాదు పై, దామాషాకు మించిన జలాలపై ఆశ తప్ప మరేమీ కాదు.
ప్రత్యేక వాదుల విషయానికొస్తే మొదలు చెప్పుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సాధనం మాత్రమే సమస్యకు ఏకైక వికల్పంగా భావిస్తున్న తెలంగాణా ప్రాంతంలోని అత్యధిక శాతం మంది ప్రజలు, మేధావులు, రాజకీయులు. అలాగే ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంతో మాత్రమే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆంధ్రా ప్రజలు, మేధావులు, రాజకీయులు. తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై సానుభూతితో విభజన కోరుతున్న ఆంధ్రా ప్రజలు, మేధావులు. వీరందరూ ఏదో ఒక కారణంతో రాష్ట్ర విభజననే కోరుతున్నారు.
ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పే వాదనలు తెలుగు జాతి, తెలుగు జాతి సౌభ్రాతృత్వం, తెలుగు జాతి సమైక్యత చుట్టూ తిరుగుతుంటాయి. వీరి వాదనలో విపరీతమైన భాషాప్రేమ తప్ప మరేమీ కనిపించదు. సగటు తెలంగాణా పౌరుడు 'తన పొట్ట నిండడమా? తెలుగుపై ప్రేమా?' అన్న మీమాంసలో మొదటి దాన్నే ఎంచుకున్నాడని వీరు గుర్తించరు. తెలుగు జాతి సౌభ్రాత్వుత్వం గురించి మాట్లాడే వారికి, తమ సోదరులు కోరుతున్న న్యాయ బద్ధమైన కోరికలు కనపడవు. వారి పోరాటాలు, త్యాగాలు కనపడవు. కాని వారు ఆవేశంలో చేసిన చిన్న చిన్న పొరబాట్లు మాత్రం భూతద్దంలో చూసినట్టు కనబడతాయి.
ఇక పోతే ఇప్పుడు శీర్షికలో ప్రస్తావించిన కుహనా వాదాల గురించి ప్రస్తావిద్దాం.
మొదట కుహనా సమైక్యవాదం గురించి.
వీరు సమైక్య వాదం పై పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతారు. వీరి వాదాలు అన్నీ వీగిపోయే సమయం వచ్చినప్పుడు మాత్రం అసలు విషయం బయట పెడతారు. అదేనండీ, హైదరాబాదు. మాకు హైదరాబాదు ఇచ్చేస్తే, ఒక్క రోజులో తెలంగాణా ఇస్తాం అంటారు, అదేదో వారి ఇంటినుండి తెచ్చి ఇచ్చేటట్టు! వీరికి ఉన్నది హైదరాబాదు నగరం పై కాంక్ష తప్ప సమైక్యత భావన ఆవగింజంత కూడా ఉండదు. ఇంకొంత మంది మాత్రం 'హైదరాబాదు కూడా కాదు, మాది నీటి సమస్య' అంటారు. వీరు కొంతలో కొంత నయం మనసులో మాట చెప్పినందుకు. మరి వీరికున్న భయాలేవో మాత్రం చెప్పరు. ఇప్పుడ అన్ని రాష్ట్రాల మధ్య నీటి ట్రిబ్యునళ్ళు ఎలా పని చేస్తున్నాయో, విడిపోయాక కూడా అలాగే పని చేస్తాయి అనే విషయం వీరికి తెలియదనుకోవాలా?
వీరు మేం ప్రత్యేక వాదులమనే చెప్పుతారు. పైగా 1972 ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నామని కూడా చెపుతారు. 'విడిపోతే మేం మీకంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం' అంటారు. 'మరి విడిపోవచ్చు గదా?' అని అడిగితే మాత్రం అసలు రంగు బయట పెడతారు. 'మీరు మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి విడిపోం' అన్నది వీరి ముఖ్యమైన వాదన. ఏ ఉద్యమమైనా దేనికో ఒకదానికి వ్యతిరేకంగానే పుడుతుంది. ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అన్ని రకాల భాషలు ప్రయోగింప బడతాయి. ఇలాంటి వారికి తెలంగాణా వాదులను తాలిబాన్లని సంబోధించడం మాత్రం కనపడదు. తాము ఒకప్పుడు తెలంగాణాకి అనుకూలంగా ఉన్న ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేసామన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచి పోతారు. వీరు బయటికి చెప్పేది ప్రత్యేక వాదమే అయినా వీరిది కుహనా సమైక్య వాదులకు, వీరికి పెద్దగా తేడా లేదు. అదేమిటో బహిరంగ రహస్యమే, హైదరాబాదు పై, దామాషాకు మించిన జలాలపై ఆశ తప్ప మరేమీ కాదు.
http://www.telangana.org/Mulki_Rules.htm
ReplyDelete