Skip to main content

ఆత్మహత్యలు నాయకులెవ్వరూ చేసుకోరేం?

ప్రత్యేక తెలంగాణా పోరాటంలో భాగంగా చోటు చేసుకున్న వివిధ రకాలైన పోరాట రూపాలు బహుశా ఏఉద్యమంలో కూడా ఇంతవరకు చోటు చేసుకోలేదేమో! బాధాకరమైన విషయం ఏమంటే ఆత్మాహుతులు, ఆత్మహత్యలు కూడా ఉద్యమ రూపంగా మారడం. వీటి కారణంగా ఆరొందలకు పైగా లేతప్రాణాలు ఆహుతి పోయాయి అని గుర్తొచ్చినప్పుడు మనసున్న ప్రతి మనిషికీ అది వికలం కాక తప్పదు.

ఆత్మహత్యలు నాయకులెవ్వరూ చేసుకోరేం?

దాదాపుగా ప్రతి వేదికలోనూ తెలంగాణా వ్యతిరేకులు వేసే ప్రశ్న ఇది. అపరిపక్వంగా ఆలోచించే విద్యార్థులెవరైనా ఇలాంటి ప్రశ్నలడిగితే సరే అనుకోవచ్చు, కాని వివిధ పార్టీలకు చెందిన మహానాయకులు, మేధావులమని చెప్పుకు తిరిగే వారు కూడా ఇదే ప్రశ్న వేయడం విస్మయాన్ని కలిగిస్తుంది. దీన్ని అపరిపక్వత అని అనుకోలేం. ఒక తర్కవిరుద్ధమైన భావాన్ని వ్యాపింప చేయడానికి తార్కికమైన వాదన ఉపయోగ పడదు, తర్కరాహిత్యాన్ని శరణు కోరాల్సిందే. అందుకే ఇలాంటి వాదనలు వస్తుంటాయి.

నాయకుడంటే ఎవరు? నలుగురినైనా లేదా నాలుగు కోట్లమందినైనా నడిపించగలిగే వాడే నాయకుడు. ఒక సంఘటనపై కోపం తెచ్చుకొని తనను తాను ఆత్మాహుతికి గురి చేసుకునే వాడు నాయకుడు కాబోడు. తన కోపాన్ని ప్రజాగ్రహంగా మలచగలిగే వాడే నాయకుడు.

దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీపై తెల్లవాడు దాడి చేసినప్పుడు మొదట ఆయనకి విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. వెంటనే వెళ్లి ఆ తెల్లోడిని చంపి వేయాలనే కోపం వచ్చి ఉంటుంది. కాని ఆ కోపాన్ని నిగ్రహించుకున్నాడు. నిగ్రహించు కున్నాడు కాని మరచిపోలేదు. అందుకే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పంపి వేసే వరకూ విశ్రమించ లేదు. మరచి పోయి ఉంటే మరుసటి రోజున మామూలుగా అందరు లాయర్ల మాదిరిగానే కోర్టుకు వెళ్ళుతూ సాధారణ జీవితం గడిపి ఉండేవాడు.

నాయకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు అని అడగడం, గాంధీ ఎందుకు డయ్యర్ ని చంపలేదు? అని అడిగినట్టు ఉంటుంది. ఇలా అడిగే సమైక్యాంధ్ర నాయకులు మరి సమైక్యాంధ్ర కోసం తమలో ఒకరైనా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదేం అని అడిగితే ఏం చెపుతారు? తిరిగి పై వివరణే ఇవ్వాల్సి ఉంటుంది. ఆత్మ హత్యలు దేనికీ పరిష్కారం కాదు. మనిషికి ఆగ్రహం వచ్చినప్పుడు నిగ్రహించుకోలేని వాడు ఎదుటివాడిపై దాడి చేసి నేరస్తుడిగా మారుతాడు. లేదా తనకు తాను ఆశక్తుడిగా భావించిన వాడు, ఆత్మహత్యకు పాల్పడతాడు. ఇలాంటి వారు అదృష్టవశాత్తూ చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఒక్కడు నిగ్రహం కోల్పోయి ఆత్మాహుతికి పాల్పడితే అది ఒక లక్ష మంది ఆగ్రహానికి ప్రతిరూపంగా భావించాలి. 

అందువలననే ఒక పది మంది రైతులో, చేనేత కార్మికులో  ఒకేసారి ఆత్మహత్యలకు పాల్పడ్డప్పుడు చాలా చర్చలు జరుగుతాయి. అవి రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పురికొల్ప బడతాయి. అదంతా కేవలం పదిమంది చనిపోయినందుకే కాదు. ఆ పదిమంది వెనక ఉన్న పదిలక్షలమంది ప్రజల వేదనను గమనించడమే దానికి కారణం. 

అదేవిధంగా ఆరొందల మంది ఆత్మహత్యలు కేవలం ఆ ఆరొందల మంది ఆకాంక్షలను ప్రతిబింబించవు. అవి యావత్తు తెలంగాణా ప్రజల ఆకాంక్షలను తెలియ బరుస్తాయి. కాని దురదృష్టవశాత్తూ వీటిపై జరగాల్సినంత, జరగాల్సిన విధంగా చర్చ జరగడం లేదు. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మరణాలపై హేళనా పూర్వకంగా వ్యాఖ్యానాలు చేయడం. జోకులు పేల్చడానికి ప్రయత్నించడం. 

ఆత్మహత్యలను ఎవరూ కోరుకోవడం లేదు, కాని అవి జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒకటో రెండో ఆత్మాహుతుల వార్తలు పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం. ఆత్మహత్యలకు పాల్పడ వద్దని తెలంగాణాలోని అన్ని పార్టీల నాయకులు, JAC వారు విజ్ఞప్తి చేశారు. అయినా ఆగడం లేదు.

భవిష్యత్తులోనైనా ఈసమస్యకు తొందరగా పరిష్కారం లభించి ఆత్మహత్యలు ఆగిపోతాయని ఆశిద్దాం.

Comments

  1. "ఒక తర్క విరుద్ధమైన భావాన్ని వ్యాపింప చేయడానికి ,తార్కికమైన వాదన ఉపయోగపడదు ,తర్కరహిత్యాన్ని శరణు కోరాల్సిందే .అందుకే ఇలాంటి వాదనలు వస్తుంటాయి "చాలా బాగ చెప్పారు .మీరు రాసిన విషయం లో గొప్ప వేదనుంది.రాసిన పద్దతిలో చాలా హేతుబద్దత ఉంది .మొత్తంగా నిజాయితి ఉంది .

    ReplyDelete
  2. Hari, thanks a lot for the mature post.

    This type of rhetoric is just a diversion tactic. I once responded to this question by "KCR (లేదా ఇంకో నాయకుడు) ఆత్మహత్య చేసుకుంటే, నువ్వు మాకు తెలంగాణ తేచ్చిస్తవా?". No answer, he just changed topic and started other nonsense like "తెలంగాణ వచ్చినంక దొరల రాజ్యమయితది"

    I have no problems with people criticizing suicides but they don't even express a word of regret.

    ReplyDelete
  3. Thanks Udaya

    Thanks Jai,

    Coming across this question very often and thought of expressing my views.

    ReplyDelete
  4. ఆత్మ హత్యలపై మీరు రాసిన తీరు బాగుంది...
    నిజమే...నాయకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు..
    చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు..
    మరి అమాయకుల సంగతి..
    దేశం ఎంతో ముందుకు పోతుంది అనుకుంటూనే మనం కొన్ని విషయాలలో
    వెనుక బడి ఆలోచిస్తున్నాం .
    రోటి, కపడా , మఖాన్ ..ఈ మూడు ఉంటె చాలు అనుకునే సగటు మనిషి
    నేడు ఆత్మ హత్య చేసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో ముందు ఊహించండి ..
    ఒక పరిశోధక సిద్దాంత వ్యాసం లో చెప్పినట్లు ఆత్మా హత్య ఒక మానసిక సంచలనం...
    ఒక సునామి లాంటి తీవ్రమైన మానసిక ఆవేదనకు గురి అయితేనే మనిషి ఇటువంటి పనులు చేడానికి పూనుకుంటాడని దీని భావం..
    మరి ఇలాంటి మానసిక సంచలనాలకు గురవుతున్న యువతకు, మానసికంగా క్రుంగి ఉన్నవారికి
    ఎన్ని ప్రభుత్వాలు, గవర్నమెంట్లు, నాయకులు , సంస్థలు చేయూత నిస్తున్నాయి.
    ఇక్కడ ప్రాంతం అనేది ముఖ్యం కాదు..
    ఏ ప్రాంతం వారైన వారు ఆత్మహత్య చేసుకొని చనిపోతే మనసున్న ప్రతి ఒక్కరు బాధపడతారు..
    మానవత్వం ఉన్న ప్రతి ప్రాంతం వాడు బాధ పడతాడు..
    ఇవ్వన్ని కూడా నాణానికి ఒక పక్క మాత్రమె...
    కాని నేడు ఆత్మహత్యల పేరుతొ దేశంలో అనేక చోట్ల దౌర్జన్యా హత్యలు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి ) .వీటి కి సమాధానం ఏ సగటు మనిషి దగ్గర వుండదు.ఒక్క భగవంతుని వద్ద తప్ప)

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...