Skip to main content

జూనియర్ డాక్టర్ల సమ్మె - ఒక దీర్ఘ కాలిక పరిష్కారం


జూనియర్ డాక్టర్ల సమ్మె మళ్ళీ మొదలైంది.  ప్రతి సంవత్సరం వీరి సమ్మె ఒక తంతుగా జరుగుతూ వస్తుంటుంది, మనం చూస్తుంటాం.  నిబంధనల ప్రకారం చదువు పూర్తయ్యాక వీరు తప్పని సరిగా గ్రామాల్లో ఒక సంవత్సరం పాటు చేయవలసి వుంటుంది. వీరి సమ్మె జరిగిన ప్రతిసారీ ఆ నిబంధనను తీసివేయడమే పరమావధిగా ఉంటుంది. గ్రామాల్లో డాక్టర్ల లభ్యత లేక పోవడం వల్ల ప్రభుత్వం కూడా ఆ విషయంలో సడలింపు ఇవ్వలేక పోతుంది.

అవసరాలకు సరిపడా డాక్టర్లు లేకపోవడమే సమస్యకు మొత్తం మూలకారణంగా కనిపిస్తోంది. నగరాల్లో అధిక మొత్తంలో వేతనాలతో అవకాశాలు లభిస్తున్నప్పుడు ఊళ్లల్లోకి వెళ్లి స్టైపెండ్ పైనే ఉద్యోగం చెయ్యమంటే సహజంగానే వారికి నిరాశ కలుగుతుంది కదా. గొప్ప ఆశయాలతో, కొంత సేవా దృక్పథంతో వారు కూడా గ్రామాల్లో సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ పోటీ సమాజంతో అంతటి దేశభక్తి కాని, మానవతా దృక్పథం కాని కలిగిన వారు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో జుడాలు మాత్రం అందుకు అతీతంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో.

వారు కోరుతున్నట్టు అధిక వేతనాలు ఇచ్చి ఊళ్లకు పంపవచ్చు, కాని దానివల్ల అనేక ఇతర ఇబ్బందులు, ఉద్యోగుల కేడర్ల వేతనాల సమతుల్యత దెబ్బతిని మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. నిజానికి నగరాల్లో కన్నా గ్రామాల్లో వారికి కర్చు చాలా తక్కువ. ఆ విధంగా ఎక్కువ మొత్తం మిగులుతుంది. కాబట్టి వారి అభ్యంతరాలకు డబ్బు సమస్య కారణం కాదని తెలిసి పోతూనే వుంది. నగరాల్లో ఉండే తళుకు బెళుకుల వల్లో, మరే ఇతర కారణాల వల్లనో కానీ వారు ఒళ్లకు వెళ్ళడానికే ఇష్టపడడం లేదు.  అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ముందుకు వచ్చినా కూడా ఫలితం ఉండేటట్లు అనిపించడం లేదు.

ఆవశ్యకత, లభ్యత మధ్య అంతరం తగ్గనంత వరకూ ఈ సమస్య కొనసాగుతూనే వుంటుంది. కాబట్టి డాక్టర్ల సంఖ్యను పెంచడమే సి సమస్యకు ఉన్న ఒకే ఒక పరిష్కారం. ఒకవైపు నగరాల్లో అడుగడుగునా డాక్టర్లు కనపడితే గ్రామాల్లో మండలానికి ఒక్కరు కూడా ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరు కారు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు అసలే ఉండరు.  ఇక మిగిలింది RMP డాక్టర్లే.  గ్రామాల్లో 90% వైద్యావసరాలు వీరివల్లనే తీరుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.  కాని వీరికి సరియైన శిక్షణ లేక పోవడం వల్ల ఎన్నోఇబ్బందులు కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నాయి.

కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పెంచడానికి దీర్ఘ కాలిక ప్రణాళికను రూపొందించు కోవాలి. మెడికల్ కాలేజీల స్థాపన అంత సులభం కాదు, అంతేకాక కేవలం మరికొన్ని మెడికల్ కాలేజీలు అదనంగా స్థాపించినంత మాత్రాన కూడా ఈ సమస్య పరిష్కారం కాదు.

పూర్తిగా MBBS పట్టభద్రుల పైనే ఆధార పడకుండా వైద్యంలో డిప్లొమా పట్టభద్రులను కూడా తయారు చేసుకోగలిగితే ఈ సమస్యకు దీర్ఘ కాలిక పరిష్కారం లభిస్తుందేమో నని అనిపిస్తుంది. అస్సలు శిక్షణ లేని RMP డాక్టరు కన్నా కొంతమేరకు శాస్త్రీయ శిక్షణ పొందిన డిప్లొమా డాక్టరు అన్ని రకాలుగా ఉత్తమ సేవలు అందించ గలడు. డిప్లమా డాక్టరుకు నగరాల్లోని కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు లభించవు కాబట్టి వారు తప్పనిసరిగా ఊళ్లల్లోకి వెళ్లి సేవలు అందించే అవకాశం ఎక్కువ.

 ఈ డిప్లమా డాక్టరు కోర్సులను మూడేళ్ళకు పరిమితం చెయ్యాలి. ప్రతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానించి వీరికి కళాశాలను స్థాపించాలి. రోజులో సగం తరగతి గది శిక్షణ, మిగతా సగం ఆస్పత్రిలో పనితో కూడిన శిక్షణ ఉండాలి. నాకు మెడికల్ విషయాలపై అంత అవగాహన లేదు, కాని మూడు సంవత్సరాల నిష్ణాతుల శిక్షణ, ఆస్పతులలో ప్రత్యక్ష అనుభవం వాళ్ళ ఒకింత మేరకు వారు మంచి వైద్య సహాయం అందించ గలరని అనిపిస్తోంది. ఏది చేయాలో, ఏది చేయగూదదో కూడా వారికి శిక్షణలో భాగంగా అవగాహన కల్పించ బడుతుంది. కాబట్టి వారు దుస్సాహసాలు చేసి ప్రాణాల మీదకు తీసుకు వచ్చే అవకాశం తక్కువ. వీరివల్ల తప్పకుండా డివిజనల్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో MBBS డాక్టర్లకు బదులుగా వీరిని నియమించవచ్చు.  ఇది కేవలం నాకు కలుగుతున్న ఒక ఆలొచన. దీని సాధ్యాసాధ్యాలను గురించి నిష్ణాతులైన వారు ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ