Skip to main content

అవినీతి భాగోతం

రాజశేఖర్ రెడ్డి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఈ రోజు పెద్ద గొడవ జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలలో ఎంతో కొంత నిజం తప్పకుండా వుండే అవకాశం ఉంది. అయినా ఎంతో పరిశోధించాల్సిన అవసరం లేదు. కళ్ళముందే వట వృక్శాల్లా పెరిగి పోతున్న ఆయన బంధువుల కంపెనీలే చెపుతున్నాయి. అయితే రాజశేఖర రెడ్డి ఎదురు దాడిగా చంద్రబాబు పై చేసే ప్రతి ఆరోపణలకు కొంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్ర బాబు కూడా అవినీతి పరుడే అయినప్పటికీ అది ఇప్పుడు అంత ప్రస్తుతం కాదు. ఎందుకంటే అధికారం లోకి వచ్చే వరకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు పై ఎన్నో ఆరోపణలు చేసాడు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో ఏ లాంటి చర్యలూ తీసుకోలేక పోయాడు. పైగా తనపై వచ్చిన ఆరోపణలకు ప్రత్యారోపణలతో జవాబివ్వడం నిజంగా సిగ్గు చేటయిన విషయం.

అయితే వీరిదరు సృష్టిస్తున్న గందరగోలాన్ని మనం తప్పక గమనించాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతటి ఆరోపణలు చేస్తున్న చంద్ర బాబు కుడా రేపు అధికారం లోకి వస్తే రాజ శేఖర రెడ్డి పై చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హామీ యివ్వటం లేదు.

ఇక చిరంజీవి అంటారా, ఎంత సేపూ ఇతరుల అవినీతి గురించి మాట్లాడుతాడే కాని తాను నీతివంతంగా ఎలా పరిపాలించ గలడో వివరించ బోవడం లేదు. తాను ఎలక్షన్లో డబ్బు, మద్యం వాడను అని ఇంతవరకు స్పష్టమైన హామీ యివ్వ లేదు. పైగా అవినీతి రికార్డు ఉన్న ఇతర పార్టీల నాయకులను తన పార్టీలో చేర్చు కుంటున్నాడు. కుటుంబ రాజకీయాలకు పురిటి లోనే పెద్ద పీట వేశాడు. ఇతడు అధికారం లోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా వుంటుందో ఇప్పుడే కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

వీరందరూ ప్రజలను తామే మభ్య పెట్ట గలమని అనుకుంటున్నారు. సామాన్య జనం అమాయకత్వం పై వీరికి అపారమైన నమ్మకం, తాము ఏది చెప్పినా నమ్మేస్తారని. అయితే దురదృష్ట వశాత్తు అది అసత్యం కాదు. ఇప్పుడు ఆలోచించ గలిగే ప్రతి ఒక్కరి కర్తవ్యం... రాజకీయ నిరాశ వాదం, అచైతన్యం నుంచి బయట పడి కనీసం తమ చుట్టూ ఉన్న జనాన్ని చైతన్య వంతం చేయడం.

Comments

  1. Completely agreed.
    Even God cannot help with Indian corrupted politics.

    The corruption system is sooo deeply established, its next to impossible.

    ReplyDelete
  2. Nijame. Andaroo em chesinaa vaalla adhikaram kosame adhikaram loki raavatam kosamo pani chesevare. Nijamgaa prajala kosamo desam kosamo pani chese vaallu chaala takkuvayyaaru. Mana desamlo raajakeeyaalu oka laabhasati vyaapram ga maaripoyayi. oka sari oka padavi vasthe inka akkadi nunchi chanipoyevarakoo aa padavo antha kante pedda padavo untene nidra paduthundi mana vaallaki. Asalu mana desam lo kooda o 2 saarlu maatrame M.L.A. gaano M.P. gaano unde chance maatrame unte machidemo. Kanee alaa kaavalanna malle mana raajakeeya naayakule chettam cheyali. Naa athyaasa kaakapotheno...!! veellaki veellu alaanti nashtam kaliginche charyalenduku teesukuntaaru lendi.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...