Skip to main content

అధికారం

దివంగత ముఖ్య మంత్రి చని పోయి రెండు రోజులు కూడా కాలేదు. సంతాప దినాలు పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజులున్నాయి. ఈ లోపలే కాంగ్రెస్ వారు కామెడీ మొదలు పెట్టారు. వీరి కామెడీకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

ముఖ్య మంత్రి పార్థివ శరీరాన్ని ఇంకా తీసుకు రాక ముందే కేబినేట్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఒక సంతాప తీర్మానం, కడప జిల్లాని YSR జిల్లాగా మార్చాలని ఒకటి, జగన్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని ఒకటి మొత్తం మూడు తీర్మానాలు చేసారు. మొదటి రెండు వరకు ఫరవా లేదు. ఒక కేబినేట్ మంత్రి వర్గం ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కొరకై సిఫారసు చేయడం... కామెడీగా లేదూ? ఇందులో అసలు కామెడీ ఏమిటంటే ముఖ్యమంత్రి చనిపోయాక, ఆయన నియమించుకున్న ఈ మంత్రివర్గం రద్దయినట్లే నని రాజ్యాంగ నిపుణులు సెలవిచ్చారు. మరి వీరి తీర్మానాలకు చట్ట బద్ధత ఏది?

ఇక రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం. వీరంతా సమావేశమై జగన్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేశారట. వీరి తీర్మానం నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాదు. వీరెందుకు హడావిడిగా ఇప్పుడు తీర్మానం చేయడం? ఒక వైపు అధిష్టానం ఈ విషయం పై ఏమీ మాట్లాడకండి అని చెపుతుంటే?

మూడోది ఎమ్మెల్యేలు కూడా తీర్మానం చేయడానికి ప్రయత్నించడం. కాని కేంద్రం మొట్టికాయలు వేసేసరికి సంతాప సభతో సరిపెట్టారు.

అసలు వీరు ఇంత హడావిడి చేయడం ఎందుకో అర్థం కాదు. జగన్ కి ప్రజాభిమానం, ఎమ్మెల్యేల బలం ఉన్నట్టయితే ఆయనే అవుతారు ముఖ్యమంత్రి. దీనికోసం ఇంతగా తొందర పాటు చర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగించడమే కాదు, అసహజంగా కూడా వుంది.

పదే పదే రఘువీరా రెడ్డి ప్రకటనలు ఇవ్వడం, బొత్స సత్యనారాయణ వెళ్లి DS పై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం తొందరపాటు చర్యలుగా అనిపించడం లేదూ?

Comments

  1. జగన్ CM ఐతే అదే కోటరీ లో ఉండి తమ పదవులు కాపాడుకోవచ్చని మంత్రుల ఆరాటం , జగనన్న CM కావలి అని అరిసి మీడియా లో ప్రముఖం గా కనపడితే ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని మిగిలిన వారి ఆరాటం. స్వార్ధం ఒక స్థాయి వరకు భరించవచ్చోమో గాని వీళ్ళని వీళ్ళ ఆరాటాన్ని చూస్తుంటే ఛీ వద్దులేండి వేరే జీవాలతో పోలిస్తే మన బ్లాగర్లు చాలా మంది బాధ పడతారు.
    ఎక్కడ పడితే అక్కడ అలా అరుస్తా ఉంటే ప్రస్తుతం ఆ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి కి ఎలా ఉంటుంది అన్న కనీస జ్ఞానం కూడా లేదు ఛీ ఛీ !

    ReplyDelete
  2. >> "వీళ్ళని వీళ్ళ ఆరాటాన్ని చూస్తుంటే ఛీ వద్దులేండి వేరే జీవాలతో పోలిస్తే మన బ్లాగర్లు చాలా మంది బాధ పడతారు"

    ;-)

    ఎవరో రాశారు, బ్లాగుల్లోనే. వైఎస్ అపర గాంధీ అట! అభిమానానికీ ఓ హద్దుండాలి.

    ReplyDelete
  3. పదవి కోసం, డబ్బుల కోసం ఎన్నెన్ని డ్యాన్సులు కడతన్నారో చూడండి. అకశేరుకాలు సార్, వీళ్ళు!

    ReplyDelete
  4. శ్రావ్య, అబ్రకదబ్ర, చదువరి గార్లకు ధన్యవాదాలు.

    ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన సంతాప సభలో కూడా అదే కనపడింది. హాజరైన కార్యకర్తల్లో ఏ ఒక్కరి ముఖంలోనూ సంతాపం కనపడ లేదు, ఎంత గట్టిగా అరవాలన్న తపనే తప్ప.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...