Skip to main content

తెలంగాణా

కాకతీయుల కాలంలో సుభిక్షమైన పరిపాలనకు నోచుకున్న తెలంగాణా తరువాత నవాబుల పాలనలోకి వచ్చింది. నాలుగు వందల సంవత్సరాల పాటు నిజాం కర్కశ పాలనకు కాకా వికలమైంది తెలంగాణా. నిజాం, అతని తాబేదార్లైన దేశ్ ముఖ్ లు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు తెలంగాణా ప్రజల ధన మాన ప్రాణాలను, కష్టాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. తెలంగాణా లో వీరు అమలు జరిపిన 'వెట్టి చాకిరీ', రోమన్ ల కాలం లోని బానిసత్వం కన్నా క్రూర మైనది. బానిసలకు కూడు పెట్టి పని చేయిస్తారు. కాని ఇక్కడ పని మాత్రమె చేయించుకునే వారు, కూడు ఎవరికీ వారే చూసుకోవాలి. ఎలాంటి ప్రతిఫలం లేకుండా ప్రతి ఇంటి నుండి దొరల పొలాల్లో, ఇళ్ళల్లో పనులు చేయించు కునే వారు.

భారత దేశంలో నున్న ఇతర ప్రాంతాలు స్వతంత్ర వాయువులు పీల్చు కుంటున్నా తెలంగాణా బానిస బ్రతుకుల్లో మార్పు రాలేదు. కాశ్మీరు కోసం, జునాగడ్ కోసం తీరిక లేకుండా ప్రయత్నాలు చేసిన నెహ్రు, పటేల్ ద్వయం తెలంగాణా గురించి పట్టించుకోలేదు. చివరి ప్రయత్నంగా ప్రజలు సాయుధ పోరాటానికి దిగారు. మూడు వేల గ్రామాలను విముక్తం చేయగా దొరలంతా హైదరాబాదులో తల దాచుకొన్నారు. చివరికి హైదరాబాదును ముట్టడించిన తరుణంలో నెహ్రు, పటేల్ లకు హటాత్తుగా తెలంగాణా పై ప్రేమ పెరిగి పోయి మిలిటరీ ఆక్షన్ తో తెలంగాణాని భారత దేశంలో కలిపారు. తెలంగాణా ప్రజలను కష్టాలకు కారణమైన నిజాం నవాబును “His Exalted Highness” (H.E.H.) బిరుదుతో సత్కరించి ప్రజలు దోచుకుని సంపాదించిన అతని ఆస్తులని అతనికే అప్పగించారు. తద్వారా తెలంగాణా ప్రజల ఆగ్రహానికి కత్తికి కండగా కావలసిన మనిషి ప్రపంచంలో ఐదవ పెద్ద ధనవంతుడు గా మారిపోయాడు.బ్రతుకు జీవుడా అని హైదరాబాదుకి పారిపోయిన దొరలంతా రాజకీయాల్లోకి దూకి 'ప్రజాసేవకులు' గా మారిపోయి ఇప్పటికీ తెలంగాణా వారి భుజాలమీద స్వారీ చేస్తున్నారు.

1956 వరకు హైదరాబాదు రాష్ట్రం గా వున్నా తెలంగాణా మరోసారి పాలక వర్గాల కుట్రలకు బలి పశువుగా మారింది. భాషా ప్రయుక్త రాష్ట్రం ముసుగు కప్పి తెలంగాణాని మరోసారి ఉరికంబం ఎక్కించారు. పెద్దమనుషుల ఒప్పందం, ముల్కి నిబంధనలు మొదలైన వన్నీ తుంగలో తొక్క బడ్డాయి. ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగాయి కాని తగ్గలేదు. డెబ్బై శాతానికి పైగా తమ పరీవాహకంలో ఉన్న నదులు పది శాతం నీరు కూడా ఇవ్వడం లేదన్న సత్యం దృగ్గోచరమైన తర్వాత తెలంగాణా మరోసారి ఉద్యమానికి దిగింది. ఈసారి ఫలితం ఎలా వుంటుందో చూడాలి.

ఇది వ్రాసే సమయానికి చిదంబరం ప్రత్యేక తెలంగాణా ప్రక్రియ మొదలు పెట్టడానికి అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది అసంపూర్తి ప్రకటనే అయినా ఒక సానుకూల ప్రకటన గా భావించ వచ్చు.

Comments

  1. జై తెలంగాణ జై జై తెలంగాణ

    చాలా చక్కని విశ్లేషణ.

    ఇప్పుడే సంబరపడవద్దు - ఎన్ని తిరకాసులు పెట్టాలో అన్నీ పెడతారు. వాటన్నిటిని అడ్డుకుని నిలిచే ధైర్యం, శక్తి, ఓర్పు ప్రసాదించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుకుంటున్నాను. ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన కెసిఆర్ కు మరియు అర్థవంతంగా మలచిన విధ్యార్థులకు, మేధావులకు నా విజ్ఞప్తి ఇదే.

    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ

    ReplyDelete
  2. జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ

    ReplyDelete
  3. శ్రీధర్ రాజు, రాకేశ్, తమిళన్ గార్లకు కృతజ్ఞతలు

    ReplyDelete
  4. Jai Telengana.Jai Jai Telengana

    Ali

    ReplyDelete
  5. చాలా చక్కని విశ్లేషణ.

    ReplyDelete
  6. చిరాగ్ అలీ, నాగన్న గార్లకు ధన్య వాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ