కాకతీయుల కాలంలో సుభిక్షమైన పరిపాలనకు నోచుకున్న తెలంగాణా తరువాత నవాబుల పాలనలోకి వచ్చింది. నాలుగు వందల సంవత్సరాల పాటు నిజాం కర్కశ పాలనకు కాకా వికలమైంది తెలంగాణా. నిజాం, అతని తాబేదార్లైన దేశ్ ముఖ్ లు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు తెలంగాణా ప్రజల ధన మాన ప్రాణాలను, కష్టాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. తెలంగాణా లో వీరు అమలు జరిపిన 'వెట్టి చాకిరీ', రోమన్ ల కాలం లోని బానిసత్వం కన్నా క్రూర మైనది. బానిసలకు కూడు పెట్టి పని చేయిస్తారు. కాని ఇక్కడ పని మాత్రమె చేయించుకునే వారు, కూడు ఎవరికీ వారే చూసుకోవాలి. ఎలాంటి ప్రతిఫలం లేకుండా ప్రతి ఇంటి నుండి దొరల పొలాల్లో, ఇళ్ళల్లో పనులు చేయించు కునే వారు.
భారత దేశంలో నున్న ఇతర ప్రాంతాలు స్వతంత్ర వాయువులు పీల్చు కుంటున్నా తెలంగాణా బానిస బ్రతుకుల్లో మార్పు రాలేదు. కాశ్మీరు కోసం, జునాగడ్ కోసం తీరిక లేకుండా ప్రయత్నాలు చేసిన నెహ్రు, పటేల్ ద్వయం తెలంగాణా గురించి పట్టించుకోలేదు. చివరి ప్రయత్నంగా ప్రజలు సాయుధ పోరాటానికి దిగారు. మూడు వేల గ్రామాలను విముక్తం చేయగా దొరలంతా హైదరాబాదులో తల దాచుకొన్నారు. చివరికి హైదరాబాదును ముట్టడించిన తరుణంలో నెహ్రు, పటేల్ లకు హటాత్తుగా తెలంగాణా పై ప్రేమ పెరిగి పోయి మిలిటరీ ఆక్షన్ తో తెలంగాణాని భారత దేశంలో కలిపారు. తెలంగాణా ప్రజలను కష్టాలకు కారణమైన నిజాం నవాబును “His Exalted Highness” (H.E.H.) బిరుదుతో సత్కరించి ప్రజలు దోచుకుని సంపాదించిన అతని ఆస్తులని అతనికే అప్పగించారు. తద్వారా తెలంగాణా ప్రజల ఆగ్రహానికి కత్తికి కండగా కావలసిన మనిషి ప్రపంచంలో ఐదవ పెద్ద ధనవంతుడు గా మారిపోయాడు.బ్రతుకు జీవుడా అని హైదరాబాదుకి పారిపోయిన దొరలంతా రాజకీయాల్లోకి దూకి 'ప్రజాసేవకులు' గా మారిపోయి ఇప్పటికీ తెలంగాణా వారి భుజాలమీద స్వారీ చేస్తున్నారు.
1956 వరకు హైదరాబాదు రాష్ట్రం గా వున్నా తెలంగాణా మరోసారి పాలక వర్గాల కుట్రలకు బలి పశువుగా మారింది. భాషా ప్రయుక్త రాష్ట్రం ముసుగు కప్పి తెలంగాణాని మరోసారి ఉరికంబం ఎక్కించారు. పెద్దమనుషుల ఒప్పందం, ముల్కి నిబంధనలు మొదలైన వన్నీ తుంగలో తొక్క బడ్డాయి. ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగాయి కాని తగ్గలేదు. డెబ్బై శాతానికి పైగా తమ పరీవాహకంలో ఉన్న నదులు పది శాతం నీరు కూడా ఇవ్వడం లేదన్న సత్యం దృగ్గోచరమైన తర్వాత తెలంగాణా మరోసారి ఉద్యమానికి దిగింది. ఈసారి ఫలితం ఎలా వుంటుందో చూడాలి.
ఇది వ్రాసే సమయానికి చిదంబరం ప్రత్యేక తెలంగాణా ప్రక్రియ మొదలు పెట్టడానికి అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది అసంపూర్తి ప్రకటనే అయినా ఒక సానుకూల ప్రకటన గా భావించ వచ్చు.
జై తెలంగాణ జై జై తెలంగాణ
ReplyDeleteచాలా చక్కని విశ్లేషణ.
ఇప్పుడే సంబరపడవద్దు - ఎన్ని తిరకాసులు పెట్టాలో అన్నీ పెడతారు. వాటన్నిటిని అడ్డుకుని నిలిచే ధైర్యం, శక్తి, ఓర్పు ప్రసాదించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుకుంటున్నాను. ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన కెసిఆర్ కు మరియు అర్థవంతంగా మలచిన విధ్యార్థులకు, మేధావులకు నా విజ్ఞప్తి ఇదే.
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ
ReplyDeleteజై తెలంగాణ జై జై తెలంగాణ
jai telangana jai jai telangana
ReplyDeleteశ్రీధర్ రాజు, రాకేశ్, తమిళన్ గార్లకు కృతజ్ఞతలు
ReplyDeleteJai Telengana.Jai Jai Telengana
ReplyDeleteAli
చాలా చక్కని విశ్లేషణ.
ReplyDeleteచిరాగ్ అలీ, నాగన్న గార్లకు ధన్య వాదాలు
ReplyDelete