పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు.
గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు.
రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు.
కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి పరిపాలన సాగిస్తే, గతంలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఆవశ్యకత గురించిన వివరణపై హేతుబద్ధత ఏమిటి? ఇది కోట్ల రూపాయల దుర్వినియోగం కాదా? ఈ డబ్బుని ఇతర కార్య క్రమాల కోసం వాడేవారు కాదా?
ఇప్పుడు ఈయన ప్రతిరోజూ ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సెక్రెటేరియట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు, ఆఫీసు వేరు వేరుగా వాడు తుంటే రోజూ ఈ రెండిటి మధ్య తిరగ డానికి బోలెడంత ట్రాఫిక్ జాము అవుతుంది. ఈ అసౌకర్యాన్ని భారించాల్సింది ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఈ అరవై లక్షలు పెడితే అరవై మంది నిరు పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇప్పించ వచ్చు. ఇరవై మంది పసికూనల గుండెలు ఆగిపోకుండా నివారించ వచ్చు.
అసలు వాస్తు విషయంలో మన రోడ్లు భవనాల శాఖ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఈ శాఖ గృహ నిర్మాణాల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? ఒక వేళ వాస్తు పాటించదు అనుకుందాం. మరి ఏ నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేశారు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు.
గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు.
రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు.
కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి పరిపాలన సాగిస్తే, గతంలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఆవశ్యకత గురించిన వివరణపై హేతుబద్ధత ఏమిటి? ఇది కోట్ల రూపాయల దుర్వినియోగం కాదా? ఈ డబ్బుని ఇతర కార్య క్రమాల కోసం వాడేవారు కాదా?
ఇప్పుడు ఈయన ప్రతిరోజూ ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సెక్రెటేరియట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు, ఆఫీసు వేరు వేరుగా వాడు తుంటే రోజూ ఈ రెండిటి మధ్య తిరగ డానికి బోలెడంత ట్రాఫిక్ జాము అవుతుంది. ఈ అసౌకర్యాన్ని భారించాల్సింది ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఈ అరవై లక్షలు పెడితే అరవై మంది నిరు పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇప్పించ వచ్చు. ఇరవై మంది పసికూనల గుండెలు ఆగిపోకుండా నివారించ వచ్చు.
అసలు వాస్తు విషయంలో మన రోడ్లు భవనాల శాఖ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఈ శాఖ గృహ నిర్మాణాల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? ఒక వేళ వాస్తు పాటించదు అనుకుందాం. మరి ఏ నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేశారు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు.
మంచి పాయింట్ ఫోకస్ చేసారు.
ReplyDeleteఅమ్మ ఒడి గారు, ధన్యవాదాలు.
ReplyDeleteహరి దోర్నాల గారికి
ReplyDeleteచాల మంచి వ్యాసం రాసారు. దీని సారంశాన్ని నా బ్లాగులో కుడా ఉంచుతాను.
కొడాలి గారు, ధన్యవాదాలు
ReplyDeleteబాగా అడిగారు. అసలు ముఖ్యమంత్రికి అధికార నివాసం ఉండగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి, అందుకు గాను ఈ అనవసరమైన ఖర్చులను మన నెత్తిన రుద్దుతున్నారు.
ReplyDeleteచదువరి గారు, ధన్యవాదాలు
ReplyDelete