"దుండగులు ఎంతటి వారైనా వదిలిపెట్ట వద్దని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం"
ఇవి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడల్లా మన ముఖ్య మంత్రి గారు, లేక హోం మంత్రి గారు చెప్పే పడికట్టు పదాలు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? మామూలు పరిస్థితులలో ఎంతో కొంతటి వారైతే వదిలి పెడతారా? ఇప్పుడు మాత్రమే 'ఎంతటి వారైనా' వదిలి పెట్టకుండా శిక్షిస్తారా?
అసలు ఎవరిని విడిచి పెట్టాలి, ఎవరిని విడిచి పెట్టొద్దు అని డీజీపీకి వీరు చెప్పే అవసరం ఏమిటి? వీరు చెపితే కాని డీజీపీకి ఈవిషయాలు తెలియవా? ఈ ఒక్క వాక్యం చాలదూ ప్రతి విషయంలో రాజకీయులు పోలీసుల వ్యవహారాలలో ఎంత జోక్యం కలిగించు కుంటున్నారో తెలుసుకోవా డానికి!
"తప్పుచేసిన వారందరికీ కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలా చూస్తాం"
ఇది నాయకులు ఎప్పుడూ ఉపయోగించే మరొక వాక్యం. అసలు పోలీసు శాఖ విధి ఏమిటి? తప్పు చేసిన వారిని పట్టుకొని కోర్టులకు నివేదించడం. కోర్టులో వారి తప్పులను నివేదించడం. కొందరికి కఠినాతి కఠినమైన శిక్షలు, కొందరికి మామూలు మామూలు శిక్షలు విధించ డానికి వెసులుబాటు ఏమైనా ఉందా? లేక తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయా? వీరు మాట్లాడే మాటలతో ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి.
నిజానికి వీరు మాట్లాడే దాంట్లో తప్పేమీ లేదు. వీరు ఏం చేస్తారో అవే మాట్లాడుతున్నారు. రాజ శేఖర్ రెడ్డి రెండో సారి అధికారం లోకి రాగానే మొహంతిని డీజీపీ పదవినుండి ఊడ బీకేసి యాదవ్ ని నియమించడం, రోశయ్య రాగానే ఆయనను పీకేసి ప్రస్తుత డీజీపీని నియమించడం అనే సంఘటనలు చాలు, పోలీసు విభాగంలో ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయనే విషయం తెలుసుకోవడానికి.
ఇక పోలీసులు కూడా తమ విధి నిర్వహణలో కాకుండా రాజకీయ నాయకుల మెప్పు ఎలా పొందాలా అనే విషయం లో ఎక్కువ చురుకుదనం చూపిస్తున్నారని అనిపిస్తుంది. పాత బస్తీలో రెండు వర్గాల వారు రాళ్ళు రువ్వుకున్న సంఘటన జరిగినా కూడా రెండు రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించారు. ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఉస్మానియాలో రెండు వేల మంది పోలీసులను మొహరించి అత్యుత్సాహం చూపించిన డీజీపీ, కమీషనర్లు, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేసారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. మొహంతి ఉండ వలసిన హోదాలో వీరు ఎందుకు ఉన్నారో అర్థమైతే చాలు, ఇది అర్థం చేసుకోవడానికి.
ఖాకీల పై ఖద్దరు చొక్కాల పెత్తనం కొనసాగినంత కాలం ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు అనే మాటలో అతిశయోక్తి లేదు.
ఇవి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడల్లా మన ముఖ్య మంత్రి గారు, లేక హోం మంత్రి గారు చెప్పే పడికట్టు పదాలు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? మామూలు పరిస్థితులలో ఎంతో కొంతటి వారైతే వదిలి పెడతారా? ఇప్పుడు మాత్రమే 'ఎంతటి వారైనా' వదిలి పెట్టకుండా శిక్షిస్తారా?
అసలు ఎవరిని విడిచి పెట్టాలి, ఎవరిని విడిచి పెట్టొద్దు అని డీజీపీకి వీరు చెప్పే అవసరం ఏమిటి? వీరు చెపితే కాని డీజీపీకి ఈవిషయాలు తెలియవా? ఈ ఒక్క వాక్యం చాలదూ ప్రతి విషయంలో రాజకీయులు పోలీసుల వ్యవహారాలలో ఎంత జోక్యం కలిగించు కుంటున్నారో తెలుసుకోవా డానికి!
"తప్పుచేసిన వారందరికీ కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలా చూస్తాం"
ఇది నాయకులు ఎప్పుడూ ఉపయోగించే మరొక వాక్యం. అసలు పోలీసు శాఖ విధి ఏమిటి? తప్పు చేసిన వారిని పట్టుకొని కోర్టులకు నివేదించడం. కోర్టులో వారి తప్పులను నివేదించడం. కొందరికి కఠినాతి కఠినమైన శిక్షలు, కొందరికి మామూలు మామూలు శిక్షలు విధించ డానికి వెసులుబాటు ఏమైనా ఉందా? లేక తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయా? వీరు మాట్లాడే మాటలతో ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి.
నిజానికి వీరు మాట్లాడే దాంట్లో తప్పేమీ లేదు. వీరు ఏం చేస్తారో అవే మాట్లాడుతున్నారు. రాజ శేఖర్ రెడ్డి రెండో సారి అధికారం లోకి రాగానే మొహంతిని డీజీపీ పదవినుండి ఊడ బీకేసి యాదవ్ ని నియమించడం, రోశయ్య రాగానే ఆయనను పీకేసి ప్రస్తుత డీజీపీని నియమించడం అనే సంఘటనలు చాలు, పోలీసు విభాగంలో ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయనే విషయం తెలుసుకోవడానికి.
ఇక పోలీసులు కూడా తమ విధి నిర్వహణలో కాకుండా రాజకీయ నాయకుల మెప్పు ఎలా పొందాలా అనే విషయం లో ఎక్కువ చురుకుదనం చూపిస్తున్నారని అనిపిస్తుంది. పాత బస్తీలో రెండు వర్గాల వారు రాళ్ళు రువ్వుకున్న సంఘటన జరిగినా కూడా రెండు రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించారు. ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఉస్మానియాలో రెండు వేల మంది పోలీసులను మొహరించి అత్యుత్సాహం చూపించిన డీజీపీ, కమీషనర్లు, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేసారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. మొహంతి ఉండ వలసిన హోదాలో వీరు ఎందుకు ఉన్నారో అర్థమైతే చాలు, ఇది అర్థం చేసుకోవడానికి.
ఖాకీల పై ఖద్దరు చొక్కాల పెత్తనం కొనసాగినంత కాలం ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు అనే మాటలో అతిశయోక్తి లేదు.
http://hittingontheface.blogspot.com/2010/03/blog-post_29.html
ReplyDelete