Skip to main content

రాష్ట్ర విభజన తప్పదా?

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది.

మొదటి సూచనగా రాష్ట్రం యధాతథంగా కొనసాగడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టింది. ఈవిషయం ఇప్పటికైనా సమైక్యవాదులు గుర్తిస్తే మంచిది.

శ్రీక్రిష్ణ కమిటీ ఆరు సూచనలు చేసింది. అందులో నాలుగు ఆచరణసాధ్యం కాదని చెప్పింది. అది ఈ ఆరు సూచనలే ఎందుకు చేసిందనేది అంతు పట్టని తర్కం. ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుందనుకుందామంటే,  ప్రజల్లోంచి ఇంకా చాలా సూచనలు వచ్చాయి. ఉదాహరణకు ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, వన్యసీమ మొదలైనవి. వాటిని కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానించాలి కదా! అందులో కూడా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యెక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర (సీమ లేకుండా) అనేవి బలంగా వినిపించాయి. మరి వీటిని కనీసం చర్చించనైనా లేదెందుకు? వాటిని కూడా చర్చించి సాధ్యం కాదని నిర్ణయం చేసి ఉండవచ్చు కదా?

పోనీ, ఈ ఆరు సూచనలు చేసిందా అంటే, ఆరింట్లో నాలుగు పనికిరానివని తానే చెప్పింది. మరి పనికి రాని సూచనలు కమిటీ ఎందుకు చేస్తుంది? ఎవరిని గందరగోళంలో పడేద్దామని? నివేదిక ఈవిధంగా రావడం అంతుబట్టని చిదంబర రహస్యంగానే మిగిలి పోయింది.

తానే సూచనలు చేసి, వాటిని కొట్టివేసి, చివరకు రెండు సూచనలు మాత్రం మిగిల్చింది. అందులో ఒకటి (ఐదో సూచన) హైదరాబాదు రాజధానిగా తెలంగాణా విభజన. ఇక ఆరోది 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికగా తెలంగాణాకి ఒక  ప్రాంతీయ అబివృద్ధి కౌన్సిల్ ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ బద్ధత కల్పించి తెలంగాణాకి ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ సమైక్యాంధ్రని కొనసాగించడం.

ఆరో సూచనకు కమిటీ ప్రాధాన్యత నిచ్చినప్పటికీ, దానిలో పెద్దగా పస లేదనే విషయం చిన్న పిల్లవాడు కూడా చెపుతాడు. ఎందుకంటే ఈ సూచనలు కొత్తవి కావు. 1956 లో పెద్దమనుషుల ఒప్పందం వ్రాసుకున్నప్పుడు అమలు చేయాలని నిర్ణయించు కున్నవే. కానీ గడిచిన యాభై సంవత్సరాల కాలంలో అవి అమలు కావడం అసాధ్యం అని తేలిపోయింది.

మరి అమలు కాని సూచనలు ఎందుకు చేసినట్టు? రాష్ట్రం సమైక్యంగా ఉండి, తెలంగాణా ప్రయోజనాలు వీగిపోకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే ఆలోచన కమిటీ వారికి ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇలాంటి ఆలోచనతోటే కదా 1956 లో ఆంధ్రా, తెలంగాణాల మధ్యన ఒప్పందాలతో కూడిన విలీనం జరిగింది? ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ ఎంతకీ అమలు కాని ఎండమావులుగా మిగిలి పోయాయనే కదా మళ్ళీ విభజన కోరుతున్నది? మరి అటువంటప్పుడు పాతచింతకాయ పచ్చడినే మళ్ళీ వడ్డించడంలో ఔచిత్యం ఏమిటి?

శ్రీకృష్ణ కమిటీ వారు బంతిని మళ్ళీ కేంద్రం కోర్టులోకి తోసారని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణా ప్రజలకు నమ్మకం కలిగించ గలిగిన రక్షణ వ్యవస్థ నెలకొల్ప గలిగినట్టైతే సమైఖ్యాంధ్ర కొనసాగించమని వారు సూచించారు. లేకపోతే వారు చెప్పిన రెండో ఆప్షను, విడిపోవడం ఎలాగూ ఉంది. అయితే ఇలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడాన్ని కూడా కొన్ని సీమాధ్ర శక్తులు వ్యతిరేకిస్తున్న విషయం గమనార్హం. అలాంటిది ఏర్పాటు చేస్తే, గతంలో అన్యాయాలు జరిగాయని ఒప్పుకున్నట్టు అవుతుందని వారు భావిస్తున్నారు.

యాభై ఏళ్ళుగా ఇలాంటి వ్యవస్థలు ఎలా పని చేస్తాయో స్పష్టంగా చూసిన తెలంగాణా వారు ఇలాంటి రక్షణ ఏర్పాట్లకు ఒప్పుకునే పరిస్థితిలో ఎలాగూ లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలుగా విభజించడం తప్ప వేరే మార్గం లేదు. కాకపోతే కొత్త రాజధాని ఏర్పరచుకొనే వరకు కొన్ని సంవత్సరాలు హైదరాబాదుని ఆంధ్రా రాజధానిగా కూడా వాడుకునే వెసులుబాటు కల్పించ వచ్చు.

అలాగని ఏ చర్యా తీసుకోకుండా మిగతా మూడేళ్ళు గట్టెక్కే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇంకా ఎక్కువగా నాన్చుడు ధోరణి అవలంబిస్తే తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలకు దిగే అవకాశం ఉంది. ఆ పనే జరిగితే కేంద్ర ప్రభుత్వం సంగతెలా  ఉన్నా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే, తెలంగాణలో kcr, ఆంధ్రాలో జగన్ clean sweep చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంత సులభంగా తనగొయ్యి తానే తొవ్వుకుంటుందని ఊహించడం కష్టం.

అయితే ఇప్పటిదాకా గోడమీదిపిల్లి ఆట రక్తి కట్టించిన కాంగ్రెస్ కి ఇక ముందు అంత సులభంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణా పై బిల్లు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరువాత విభజన ప్రక్రియ ఎలాగూ రెండు మూడేళ్ళు పడుతుంది. తర్వాత ఎలక్షన్లు ఆధ్రాలో, తెలంగాణలో వేరువేరుగా జరిగేలా జాగ్రత్త పడితే సరి. తెలంగాణలో ఎలాగూ kcr తో జతగట్టి, తెలంగాణా ఇచ్చామని చెప్పుకొని కొన్ని సీట్లు గెలుస్తారు. ఇక చిరంజీవి సమైక్యవాదిగా ఆంధ్రాలో ఒక వెలుగు వెలిగేలా చేస్తారు. ఎలక్షన్లు దగ్గర పడ్డ తరువాత ప్రజారాజ్యాన్ని కాంగ్రేసులో విలీనం చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది. చిరంజీవి సరిపోడేమో అనుకుంటే జగన్ ని సొంత గూటిలోకి ఆహ్వానించే అవకాశం కూడా కాదనలేం. విడిపోయిన రాష్ట్రంలో అధిష్టానాన్ని సవాలు చేసేంత శక్తి జగన్ కి ఉండదు.

ఒక వేళ సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే? అప్పుడు జగన్ ని అర్జంటుగా రంగంలోకి దింపాల్సి ఉంటుంది. జగన్ తెలంగాణా సమస్యపై ఇప్పటికీ తేల్చి చెప్పక పోవడం గమనించాల్సిన విషయం.

ఎలా చూసినా కూడా రాష్ట్రం విడిపోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

  1. మంచి విశ్లేషణ. ఎప్పుడయితే చిరును తిరుమల లో కలసి గంటల కొద్ది చర్చించి తనతో కాశయ్య, డిల్లీ పెద్దలు సమైక్యం అనిపించారో, అప్పుడే కాంగీ భవిష్యత్తు ఎత్తుగడలు బయట పడ్డాయి. కోస్తా, సీమల గొఱ్ఱెల కోసం మెగా జీరో గారు జెండా పీకి అయినా, పీకకుండానయినా కాంగీ కి మద్దతు కు రెడీ.

    ఇక తెలంగాణా వానిని కాక, కిరణ్ ను ముఖ్యమంత్రి ని చేసారో, అది ఇంకోసారి నిర్ధారణ అయ్యింది. ఇక దొర గారితో కె. శవరావు గారి మంతనాలు, దొరగారు కాంగీ ని బలపరుద్దాము అనే డవిలాగులు అన్నీ ఆ స్క్రిప్టు లో భాగమే అనిపిస్తుంది. తెలంగాణా గొఱ్ఱెలకోసం దొరగారు కాంగీ జత కట్టటం రెడీ.

    యువరాజా గారిదేముంది, అక్కడక్కడా ఇంకా కాస్త మిగిలి ఉన్న భూములన్నీ అమ్ముకోమని, బయ్యారం, సరస్వతి, ఓబులాపురాలకు అనుమతులు ఇస్తే చాలు. మరో లక్ష కోట్లు పైనే సంపాదించుకొని, వాటా మూటలు హాయిగా డిల్లీ పంపటానికి రెడీ.

    ఇక మిగిలింది డిల్లీ రాణి గారి execution మాత్రమే. వాటికన్ ను సంప్రదిస్తా ఉండి ఉంటారు, మంచి మహూర్తం కోసం :)

    ReplyDelete
  2. ధన్యవాదాలు కృష్ణ గారు,

    జగన్ స్పీడు చూస్తుంటే, రాష్ట్రంలో అతితొందరలో పెను మార్పులు సంభవిస్తాయనిపిస్తుంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ