Skip to main content

తిరుపతి లడ్డూలో బోల్టు వస్తే...


తిరుపతి లడ్డూలో బోల్టు రావడం ఈ నెలలో అప్పుడే రెండోసారి. యధాప్రకారం టీవీలో పదేపదే అదేపనిగా చూపిస్తూ చర్చలు, అభిప్రాయాలు. TTD వారిమీద భక్తుల ఆరోపణలు.

తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు సరిపడా లడ్డూలు తయారు చేయడం యంత్రాల సహాయం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. ఇలా వాడుతున్న యంత్రాలు ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నప్పుడు చిన్నచిన్న విడిభాగాలు ఊడిపడడం కూడా అంతే సహజం. బహుళజాతి కంపెనీలు వ్యాపారం కోసం నడిపే కూల్ డ్రింకుల లోనే బొద్దింకలు వస్తున్నాయి. TTD వారి లడ్డూ తయారీ వ్యాపార దక్షతతో నడుప బడుతున్న కంపెనీ కాదు. పైగా దీనిపై వారు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అలాగని ఇలాంటి పొరపాట్లు లేకుండా చేయడం అసాధ్యమనీ కాదు. కానీ దానికి అత్యాధునికమైన యంత్రాల వాడకం, వాటికి నియమిత కాల పరిశీలన, దిద్దుబాట్లు చేయాలి. ప్రతి లడ్డూను తయారీ అనంతర పర్యవేక్షణకు గురిచేయాలి. తయారయిన లడ్డూలను సంచీలలో కట్టి బ్యాచునంబర్లను ముద్రించాలి. ఇంత చేసినా కూడా ఏమైనా పొరపాట్లు దొర్లితే బ్యాచునంబరు ఆధారంగా సంబంధిత తయారీదార్లను శిక్షించాలి. ఇంత పద్ధతిగా చేయాలంటే పెట్టుబడి, అధిక సిబ్బంది అవసరమౌతుంది. ఇవన్నీ చేసినప్పుడు లడ్డూరేటు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా భక్తుల మనోభావాలు, TTD చిత్తశుద్ధి, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.

ఇక పోతే లడ్డూలో బోల్టువచ్చిన భక్తుడి సంగతి. అలా వచ్చినప్పుడు భక్తుడిగా అతడి విద్యుక్తధర్మం ఏమిటి?

  1. ఏదోలే అనుకుంటూ బోల్టు పక్కకు పడేసి లడ్డూ తినెయ్యడం. ఇంకా కోపం తగ్గక పోతే TTD వారిని నాలుగు తిట్టుకోవడం.   
  2. లడ్డూలో వచ్చిన బోల్టు కూడా మహాప్రసాదంగా తలచి, దాన్ని ఇంటికి తెచ్చి దేవుడిగదిలో భద్రపరచుకోవడం.
  3. నానా యాగీ చేసి, టీవీల వాళ్లకి చూపించి TTD పై రకరకాల స్టేట్ మెంట్లు గుప్పించడం. 

పై మూడింటిలో భక్తులు ఏవిధంగా వ్యవహరిస్తే బాగుంటుందో వ్యాఖ్యల రూపంలో వ్రాయగలరా? పైమూడే కాకుండా మరిన్ని ఆప్షన్లు ఇచ్చినా ఫరవాలేదు.

Comments

  1. వాళ్ళు xray స్కాన్ చేస్తే సరి.

    ReplyDelete
  2. శేషు,
    xray scan అంటే మళ్ళీ ఎవరైనా గమనిస్తూ వుండాలి. ఆ గమనించేవాడు పక్కనోడితో హస్కు కొట్టడం మొదలట్టాడనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లెమ్.
    తయారుకాబడిన లడ్డూల్ని మొదట ప్లాస్టిక్ ట్రేల్లో పెట్టి, Industrial strength metal detectors గుండా నడిపితే సరిపోతుంది. USA లో అన్ని mega food manufacturing companies పాటించే పద్ధతే యిది.

    ReplyDelete
  3. శేషు & పండు
    ఈ ఎక్సరే పధ్ధతి బాగానే ఉంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...