పోలవరం పై మళ్ళీ హడావుడి మొదలైంది. ఒక నాయకుడు పోలవరం అంటూ రక రకాల డ్రామాలాడి, ఇప్పుడు అధికారా పార్టీ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అంటూ ఎదురు చూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకో నాయకుడు ఇన్నాళ్ళూ అధికార పార్టీ అందలం ఎక్కిస్తుందని వేచి చూచి, ఇక ఎదురు దాడి మాత్రమే శరణ్యమని తలచి అదే అదే పోలవరం డ్రామాను మరింతగా రక్తి కట్టించడానికి సిద్ధమౌతున్నాడు.
భారత దేశంలోని ప్రాజెక్టులలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టులలో పోలవరం మొదటిదిగా నిలుస్తుంది. దీన్ని ఒకవైపు గిరిజన జాతులవారు వ్యతిరేకిస్తుంటే, రెండో వైపు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా దీన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్ళింది. CPI, TRS వంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఒక ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రెండువందలకు పైగా గ్రామాలు, రెండు లక్షలకు పైగా జనాభా నిర్వాసితులు అవుతున్నారు. వీరిలో సింహభాగం గిరిజనులు. 1,47,597 ఎకరాల భూమి నీటిలో మునిగి పోతుంది. ఇలా మునిగిపోయే భూమిలో ఎంతో ప్రకృతి సంపద, నల్లమల కొండల అందాలు కప్పబడి పోబోతున్నాయి. ఇక ముంపుకు గురయ్యే ప్రాంతానికి చెందిన వన్య ప్రాణులు లెక్క లేనన్ని. ఒక వన్య ప్రాణి సంరక్షక క్షేత్రం, బొగ్గు గనులు, పురాతత్వ నిర్మాణాలు, వ్యవసాయభూములు ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురికాబోతున్నాయి. ప్రఖ్యాతి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రం కూడా ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోబోతోంది.
అంతేకాదు, గోదావరి వరదల ఉధృతి ఎంతగా ఉంటుందో మనకు ఇప్పటికే అనుభవ పూర్వకంగా తెలుసు. 2009 వ సంవత్సరంలో కృష్ణానది పై వచ్చిన వరదలు కర్నూలును నాలుగు రోజుల పాటు ముంచి వేశాయి. పోలవరం కట్టాక అలాంటి వరదలే పెద్ద పెట్టున వస్తే, ఆ నీటిని క్రిందికి వదలాల్సిన పరిస్థితులు వస్తే రాజమండ్రి లాంటి పట్టణాలకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ భయాలు స్వయానా అక్కడి MP హర్ష కుమార్ వెల్లడించారు.
ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే 2,32,000 ఎకరాలకు నీటిని సరఫరా చేస్తుంది. అంటే కనీసం మునిగి పోతున్న భూమికి కనీసం రెట్టింపు కూడా కాదు.
భారీ ప్రాజెక్టుల వల్ల ప్రాంతీయ అసమతుల్యతలు పెరుగుతాయనే వాదన ఒకవైపు ఉంటే, ఇప్పటికే ప్రాజెక్టులు ఉండి, నీటి లభ్యత ఉన్నచోటే మరిన్ని ప్రాజెక్టులు కట్టడం ఎంతవరకు హేతుబద్ధం అనే వాదన ఉంది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అనుమతులకోసం, నిధులకోసం ప్రయత్నిస్తూనే, అవేమీ రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆఘ మేఘాల మీద వేళ కోట్ల రూపాయలు వెచ్చిచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి నిధులు అన్ని అనుమతులు ఉండి, సాధికారికమైన ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు కలిగి వుండి, ఏళ్ల తరబడి పూర్తికాకుండా వున్న కరువు ప్రాంతాలలోని ప్రాజెక్టులకు కేటాయించ వచ్చు. కానీ దోపిడీ వర్గాలకు కీలు బొమ్మగా ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వంనుండి అలాంటి పనులు ఆశించలేం.
భారత దేశంలోని ప్రాజెక్టులలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టులలో పోలవరం మొదటిదిగా నిలుస్తుంది. దీన్ని ఒకవైపు గిరిజన జాతులవారు వ్యతిరేకిస్తుంటే, రెండో వైపు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా దీన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్ళింది. CPI, TRS వంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఒక ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రెండువందలకు పైగా గ్రామాలు, రెండు లక్షలకు పైగా జనాభా నిర్వాసితులు అవుతున్నారు. వీరిలో సింహభాగం గిరిజనులు. 1,47,597 ఎకరాల భూమి నీటిలో మునిగి పోతుంది. ఇలా మునిగిపోయే భూమిలో ఎంతో ప్రకృతి సంపద, నల్లమల కొండల అందాలు కప్పబడి పోబోతున్నాయి. ఇక ముంపుకు గురయ్యే ప్రాంతానికి చెందిన వన్య ప్రాణులు లెక్క లేనన్ని. ఒక వన్య ప్రాణి సంరక్షక క్షేత్రం, బొగ్గు గనులు, పురాతత్వ నిర్మాణాలు, వ్యవసాయభూములు ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురికాబోతున్నాయి. ప్రఖ్యాతి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రం కూడా ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోబోతోంది.
అంతేకాదు, గోదావరి వరదల ఉధృతి ఎంతగా ఉంటుందో మనకు ఇప్పటికే అనుభవ పూర్వకంగా తెలుసు. 2009 వ సంవత్సరంలో కృష్ణానది పై వచ్చిన వరదలు కర్నూలును నాలుగు రోజుల పాటు ముంచి వేశాయి. పోలవరం కట్టాక అలాంటి వరదలే పెద్ద పెట్టున వస్తే, ఆ నీటిని క్రిందికి వదలాల్సిన పరిస్థితులు వస్తే రాజమండ్రి లాంటి పట్టణాలకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ భయాలు స్వయానా అక్కడి MP హర్ష కుమార్ వెల్లడించారు.
ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే 2,32,000 ఎకరాలకు నీటిని సరఫరా చేస్తుంది. అంటే కనీసం మునిగి పోతున్న భూమికి కనీసం రెట్టింపు కూడా కాదు.
భారీ ప్రాజెక్టుల వల్ల ప్రాంతీయ అసమతుల్యతలు పెరుగుతాయనే వాదన ఒకవైపు ఉంటే, ఇప్పటికే ప్రాజెక్టులు ఉండి, నీటి లభ్యత ఉన్నచోటే మరిన్ని ప్రాజెక్టులు కట్టడం ఎంతవరకు హేతుబద్ధం అనే వాదన ఉంది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అనుమతులకోసం, నిధులకోసం ప్రయత్నిస్తూనే, అవేమీ రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆఘ మేఘాల మీద వేళ కోట్ల రూపాయలు వెచ్చిచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి నిధులు అన్ని అనుమతులు ఉండి, సాధికారికమైన ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు కలిగి వుండి, ఏళ్ల తరబడి పూర్తికాకుండా వున్న కరువు ప్రాంతాలలోని ప్రాజెక్టులకు కేటాయించ వచ్చు. కానీ దోపిడీ వర్గాలకు కీలు బొమ్మగా ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వంనుండి అలాంటి పనులు ఆశించలేం.
nallamala kondalu kadu mastaru...papi kondalu
ReplyDelete