Skip to main content

పోలవరం ప్రాజెక్టు

పోలవరం పై మళ్ళీ హడావుడి మొదలైంది. ఒక నాయకుడు పోలవరం అంటూ రక రకాల డ్రామాలాడి, ఇప్పుడు అధికారా పార్టీ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అంటూ ఎదురు చూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకో నాయకుడు ఇన్నాళ్ళూ అధికార పార్టీ అందలం ఎక్కిస్తుందని వేచి చూచి, ఇక ఎదురు దాడి మాత్రమే శరణ్యమని తలచి అదే అదే పోలవరం డ్రామాను మరింతగా రక్తి కట్టించడానికి సిద్ధమౌతున్నాడు.

భారత దేశంలోని ప్రాజెక్టులలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టులలో పోలవరం మొదటిదిగా నిలుస్తుంది. దీన్ని ఒకవైపు గిరిజన జాతులవారు వ్యతిరేకిస్తుంటే, రెండో వైపు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా దీన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్ళింది. CPI, TRS వంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.



ఒక ప్రాజెక్టును ఇంతమంది వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రెండువందలకు పైగా గ్రామాలు, రెండు లక్షలకు పైగా జనాభా నిర్వాసితులు అవుతున్నారు. వీరిలో సింహభాగం గిరిజనులు. 1,47,597 ఎకరాల భూమి నీటిలో మునిగి పోతుంది. ఇలా మునిగిపోయే భూమిలో ఎంతో ప్రకృతి సంపద, నల్లమల కొండల అందాలు కప్పబడి పోబోతున్నాయి. ఇక ముంపుకు గురయ్యే ప్రాంతానికి చెందిన వన్య ప్రాణులు లెక్క లేనన్ని. ఒక వన్య ప్రాణి సంరక్షక క్షేత్రం, బొగ్గు గనులు, పురాతత్వ నిర్మాణాలు, వ్యవసాయభూములు ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురికాబోతున్నాయి. ప్రఖ్యాతి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రం కూడా ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోబోతోంది.

అంతేకాదు, గోదావరి వరదల ఉధృతి ఎంతగా ఉంటుందో మనకు ఇప్పటికే అనుభవ పూర్వకంగా తెలుసు. 2009 వ సంవత్సరంలో కృష్ణానది పై వచ్చిన వరదలు కర్నూలును నాలుగు రోజుల పాటు ముంచి వేశాయి. పోలవరం కట్టాక అలాంటి వరదలే పెద్ద పెట్టున వస్తే, ఆ నీటిని క్రిందికి వదలాల్సిన పరిస్థితులు వస్తే రాజమండ్రి లాంటి పట్టణాలకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ భయాలు స్వయానా అక్కడి MP హర్ష కుమార్ వెల్లడించారు.

ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే 2,32,000 ఎకరాలకు నీటిని సరఫరా చేస్తుంది. అంటే కనీసం మునిగి పోతున్న భూమికి కనీసం రెట్టింపు కూడా కాదు.

భారీ ప్రాజెక్టుల వల్ల ప్రాంతీయ అసమతుల్యతలు పెరుగుతాయనే వాదన ఒకవైపు ఉంటే, ఇప్పటికే ప్రాజెక్టులు ఉండి, నీటి లభ్యత ఉన్నచోటే మరిన్ని ప్రాజెక్టులు కట్టడం ఎంతవరకు హేతుబద్ధం అనే వాదన ఉంది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అనుమతులకోసం, నిధులకోసం ప్రయత్నిస్తూనే, అవేమీ రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆఘ మేఘాల మీద వేళ కోట్ల రూపాయలు వెచ్చిచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి నిధులు అన్ని అనుమతులు ఉండి, సాధికారికమైన ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు కలిగి వుండి, ఏళ్ల తరబడి పూర్తికాకుండా వున్న కరువు ప్రాంతాలలోని ప్రాజెక్టులకు కేటాయించ వచ్చు. కానీ దోపిడీ వర్గాలకు కీలు బొమ్మగా ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వంనుండి అలాంటి పనులు ఆశించలేం.

Comments

  1. nallamala kondalu kadu mastaru...papi kondalu

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...