Skip to main content

ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆ మధ్య మెదక్ జిల్లాలో మాట్లాడుతూ 'మీరు, మేం' అంటూ ఆంధ్రా, తెలంగాణా లను వేరు చేసి మాట్లాడారు. ఆయన ఇంకా సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి గా ఉన్నారని మరిచిపోయారేమో ననిపించింది .అయితే అతనికి తెలుగు రాదనో, మరోటో అనుకోని సరిపెట్టుకుందా మనుకుంటే ఇటీవల రచ్చబండ సందర్భంగా చేసిన వ్యాఖ్య మరీ వికృతంగా ఉంది.

పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే  బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు.

తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.

Comments

  1. ముస్లింల వోట్ల కోసం అలా మాట్లాడి ఉంటాడు. హిందువులలోని వివిధ కులాల వోట్ బ్యాంక్ వాళ్ల పార్టీకి ఎలాగూ ఉంది కనుక హిందువులు వోట్లు వెయ్యకపోవడం జరగదు అనుకున్నాడు. అంతే.

    ReplyDelete
  2. ఏ కారణం లేకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండమని చెప్పారా? రాహుల్ గాంధీ ఏ కారణం లేకుండానే అతివాదుల వల్లే ముప్పు ఉంది అని హెచ్చరించారా? ఏ కారణం లేకుండానే ఎక్కడో కూర్చుని ముష్రాఫ్ బెదిరిస్తున్నారంటారా? ముస్లిం ల పేరుతో హైదరాబాదు లోకి తీవ్రవాదులు చేరిపోయారని నా అనుమానం. భారతదేశం లో ఏది జరిగినా ముందు అందరి చూపూ హైదరాబాద్ మీదే ఉంటుంది. ఈ విషయం కె సి ఆర్ గారు అర్ధం చేసుకోరు. ఎవరి గోల వారిదే!!

    ReplyDelete
  3. ప్రవీన్ శర్మ గారు

    కాంగ్రేస్ వారికి వొటు బ్యాంకు రాజకీయాలు మామూలే. కానీ ఇంత బాహాటంగా, అదీ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడడం ఆ పార్టీ దిగజారుడు తనానికి పరాకాష్టగా అనిపిస్తుంది.

    నీహారిక గారు

    మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. టపాలో వ్రాసినదానికి, మీరు చెప్పిన దానికి సంబంధం ఏమిటి?

    Anonymous

    ఇంతమంది ఒకే సారి గొంతు కలపడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. కేంద్రం లోనివారు బెంగాల్ ఎలక్షన్లను ద్రుష్టిలో పెట్టుకుని అన్నారనుకున్నా, మన సీయెం గారికి ఏమవసరం. అమ్మ గారితో గొంతు కలిపి మార్కులు కొట్టేద్దమనేమో!

    ReplyDelete
  4. మజ్లీస్ మద్దతుకోసం కావచ్చు.

    ReplyDelete
  5. కావచ్చు నిజమే. కాని వారెప్పుడూ మద్దతు ఇవ్వడానికి రడీగానే ఉంటారుగా!

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...