ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆ మధ్య మెదక్ జిల్లాలో మాట్లాడుతూ 'మీరు, మేం' అంటూ ఆంధ్రా, తెలంగాణా లను వేరు చేసి మాట్లాడారు. ఆయన ఇంకా సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి గా ఉన్నారని మరిచిపోయారేమో ననిపించింది .అయితే అతనికి తెలుగు రాదనో, మరోటో అనుకోని సరిపెట్టుకుందా మనుకుంటే ఇటీవల రచ్చబండ సందర్భంగా చేసిన వ్యాఖ్య మరీ వికృతంగా ఉంది.
పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు.
తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.
పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు.
తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.
ముస్లింల వోట్ల కోసం అలా మాట్లాడి ఉంటాడు. హిందువులలోని వివిధ కులాల వోట్ బ్యాంక్ వాళ్ల పార్టీకి ఎలాగూ ఉంది కనుక హిందువులు వోట్లు వెయ్యకపోవడం జరగదు అనుకున్నాడు. అంతే.
ReplyDeleteఏ కారణం లేకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండమని చెప్పారా? రాహుల్ గాంధీ ఏ కారణం లేకుండానే అతివాదుల వల్లే ముప్పు ఉంది అని హెచ్చరించారా? ఏ కారణం లేకుండానే ఎక్కడో కూర్చుని ముష్రాఫ్ బెదిరిస్తున్నారంటారా? ముస్లిం ల పేరుతో హైదరాబాదు లోకి తీవ్రవాదులు చేరిపోయారని నా అనుమానం. భారతదేశం లో ఏది జరిగినా ముందు అందరి చూపూ హైదరాబాద్ మీదే ఉంటుంది. ఈ విషయం కె సి ఆర్ గారు అర్ధం చేసుకోరు. ఎవరి గోల వారిదే!!
ReplyDeleteప్రవీన్ శర్మ గారు
ReplyDeleteకాంగ్రేస్ వారికి వొటు బ్యాంకు రాజకీయాలు మామూలే. కానీ ఇంత బాహాటంగా, అదీ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడడం ఆ పార్టీ దిగజారుడు తనానికి పరాకాష్టగా అనిపిస్తుంది.
నీహారిక గారు
మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. టపాలో వ్రాసినదానికి, మీరు చెప్పిన దానికి సంబంధం ఏమిటి?
Anonymous
ఇంతమంది ఒకే సారి గొంతు కలపడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. కేంద్రం లోనివారు బెంగాల్ ఎలక్షన్లను ద్రుష్టిలో పెట్టుకుని అన్నారనుకున్నా, మన సీయెం గారికి ఏమవసరం. అమ్మ గారితో గొంతు కలిపి మార్కులు కొట్టేద్దమనేమో!
మజ్లీస్ మద్దతుకోసం కావచ్చు.
ReplyDeleteకావచ్చు నిజమే. కాని వారెప్పుడూ మద్దతు ఇవ్వడానికి రడీగానే ఉంటారుగా!
ReplyDelete