Skip to main content

ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆ మధ్య మెదక్ జిల్లాలో మాట్లాడుతూ 'మీరు, మేం' అంటూ ఆంధ్రా, తెలంగాణా లను వేరు చేసి మాట్లాడారు. ఆయన ఇంకా సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి గా ఉన్నారని మరిచిపోయారేమో ననిపించింది .అయితే అతనికి తెలుగు రాదనో, మరోటో అనుకోని సరిపెట్టుకుందా మనుకుంటే ఇటీవల రచ్చబండ సందర్భంగా చేసిన వ్యాఖ్య మరీ వికృతంగా ఉంది.

పాతబస్తీలో ఆయన రచ్చబండ సందర్భంగా మాట్లాడుతూ మక్కా మసీదులో హిందూ తీవ్రావాదులే  బాంబు పెట్టారని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా ఇవి ఆయన మాట్లాడ వలసిన మాటలు కావు.

తీవ్రవాది ఎవరైనా తీవ్రవాదే. హిందూ అయితే ఒకటి, ముస్లిము అయితే ఒకటి కాదు. తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలి తప్ప హిందువుగా, ముస్లిముగా కాదు. అంతేకాక ఎవరు బాధ్యులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టులు, ముఖ్యమంత్రి కాదు. అందునా ప్రభుత్వ పరంగా నిర్వహించబడే కార్యక్రమాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు బాగాలేదు.

Comments

  1. ముస్లింల వోట్ల కోసం అలా మాట్లాడి ఉంటాడు. హిందువులలోని వివిధ కులాల వోట్ బ్యాంక్ వాళ్ల పార్టీకి ఎలాగూ ఉంది కనుక హిందువులు వోట్లు వెయ్యకపోవడం జరగదు అనుకున్నాడు. అంతే.

    ReplyDelete
  2. ఏ కారణం లేకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండమని చెప్పారా? రాహుల్ గాంధీ ఏ కారణం లేకుండానే అతివాదుల వల్లే ముప్పు ఉంది అని హెచ్చరించారా? ఏ కారణం లేకుండానే ఎక్కడో కూర్చుని ముష్రాఫ్ బెదిరిస్తున్నారంటారా? ముస్లిం ల పేరుతో హైదరాబాదు లోకి తీవ్రవాదులు చేరిపోయారని నా అనుమానం. భారతదేశం లో ఏది జరిగినా ముందు అందరి చూపూ హైదరాబాద్ మీదే ఉంటుంది. ఈ విషయం కె సి ఆర్ గారు అర్ధం చేసుకోరు. ఎవరి గోల వారిదే!!

    ReplyDelete
  3. ప్రవీన్ శర్మ గారు

    కాంగ్రేస్ వారికి వొటు బ్యాంకు రాజకీయాలు మామూలే. కానీ ఇంత బాహాటంగా, అదీ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడడం ఆ పార్టీ దిగజారుడు తనానికి పరాకాష్టగా అనిపిస్తుంది.

    నీహారిక గారు

    మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. టపాలో వ్రాసినదానికి, మీరు చెప్పిన దానికి సంబంధం ఏమిటి?

    Anonymous

    ఇంతమంది ఒకే సారి గొంతు కలపడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. కేంద్రం లోనివారు బెంగాల్ ఎలక్షన్లను ద్రుష్టిలో పెట్టుకుని అన్నారనుకున్నా, మన సీయెం గారికి ఏమవసరం. అమ్మ గారితో గొంతు కలిపి మార్కులు కొట్టేద్దమనేమో!

    ReplyDelete
  4. మజ్లీస్ మద్దతుకోసం కావచ్చు.

    ReplyDelete
  5. కావచ్చు నిజమే. కాని వారెప్పుడూ మద్దతు ఇవ్వడానికి రడీగానే ఉంటారుగా!

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...