Skip to main content

బయటపడ్డ శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణి

శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణిపై మొదటినుండి తెలంగాణా వాదులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బయట పడిన ఎనిమిదో అధ్యాయం లోని భాగాలు కమిటీ యొక్క దిగజారుడు తనాన్ని నగ్నంగా బయట పెడుతూ, తెలంగాణా వాడు చేస్తున్న ఆరోపణలు నిరాధారం కావని నిరూపించాయి. ఇలాంటి అధ్యాయం పై సంతకం పెట్టడం ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ ఏరకమైన లాభాలు పొందారో తెలియదు కాని, తన ప్రతిష్టకు మాత్రం మాయని మచ్చ తెచ్చుకున్నారని మాత్రం చెప్పవచ్చు.

సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో తమకిష్టం లేని యూనియన్ లీడర్లను శిక్షించడానికి మేనేజిమెంట్లు తమకి మడుగులోత్తే తొత్తులైన ఆఫీసర్లతో ఎంక్వయిరీలు వేయించి తమకు అనుకూలంగా రిపోర్టులు రాయించుకుని పెద్ద పెద్ద శిక్షలు విధిస్తుంటారు. ఇవి ఎలాగూ లేబర్ కోర్టులలో వీగి పోతుంటాయి. కొండొకచో అలాంటి ప్రవర్తనకు దిగిన అధికారులకు చీవాట్లు కూడా పడుతుంటాయి. కాని ఇక్కడ ఎంక్వరీలు చేసే ఆఫీసర్లు కాని, శిక్షలు విధించే మేనేజర్లు కాని న్యాయ కోవిదులు కారన్న విషయం గమనార్హం.

దేశంలో పేరొందిన న్యాయమూర్తిగా వెలుగొందిన జస్టిస్ శ్రీకృష్ణ ఒక సాధారణమైన లాలూచీ అధికారి మాదిరిగా ప్రవర్తించడం చిత్రమైన విషయం. ఆయన ఎనిమిదో అధ్యాయం లో పేర్కొన్న విషయాలు చూస్తే ఉద్యోగభయంతో మేనేజిమెంటుకు కావలసిన దొంగరిపోర్టులు రాసే సూపర్ వైజరు స్థాయికి ఏమాత్రం మించని వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.   

తెలంగాణా ఏర్పాటు అడ్డుకోవడానికి అవి పొలిటికల్ మేనేజిమెంటు, మీడియా మేనేజిమెంటు చేయాలని సూచించారు. రాజకీయ నాయకులను పదవులతో కొనాలట! అవసరమైతే సీయం, డిప్యూటీ సీయం పదవులు ఇవ్వడానికి కూడా ఇవ్వడానికి వెనుకాడ వద్దట! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యమంలోకి రాకుండా కట్టడి చేసి, ఉద్యమాన్ని అణచి వేయాలట!

ఒకవైపు అణచివేత సాగిస్తూనే ఇంకోవైపు తెలంగాణా ఏర్పాటు కోసం విస్తృతమైన చర్చలు జరుపుతున్నట్టు నటించాలట! రాజకీయ నాయకులకే పాఠాలు నేర్పుతున్న జస్టిస్ శ్రీకృష్ణ ప్రత్యక్షరాజకీయాల్లో లేనందుకు మనం సంతోషించాలేమో! 

ఇక పోతే ఆయనగారు ఉద్భోధించిన మీడియా మేనేజిమెంటు అత్యంత హేయమైన విషయం. ప్రజాస్వామ్యం పై ఏమాత్రం గౌరవం ఉన్నవాడైనా తుపుక్కున ఉమ్మేసే విధంగా ఉన్నాయి కమిటీ సూచనలు! మీడియాలో దాదాపు అందరూ సీమాంధ్ర వారే ఆధిపత్యం చేలాయిస్తున్నారు కాబట్టి, వారందరి సంయుక్త కార్యాచరణ ద్వారా సామాన్యమానవుడి విచక్షణాశక్తిని మసిపూసి మారేడుకాయ చేయాలట! ఇంతటి దారుణమైన ఆలోచనలు మువామ్మార్ ఖడ్డాఫీకి, హోశ్ని ముబారక్ కి కూడా వచ్చి వుండవు.

గతంలో శ్రీకృష్ణ గారు ఇచ్చిన నివేదికలతో తాజా నివేదికను పోలిస్తే పనిచిన పని చేసినట్టుంది కాని, స్వీయ విచక్షణ చూపినట్టు ఏమాత్రం లేదు. మరి పనిచినవాడు చిదంబరుడా మరొకరా అన్నదే ఇప్పుడు తేలాల్సిన సమస్య.

ఇదంతా చూస్తుంటే ఎనభైలలో వచ్చిన తెలుగు మూస సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో రావుగోపాలరావు, అల్లురామలింగయ్య విలన్లుగా ఉండే వారు. హీరోని అడ్డగించ డానికి రకరకాల తెలివి తక్కువ కుట్రలు పన్నుతూ, అవి బయట పడి శృంగభంగం చెందుతూ ఉండే వారు. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నడ్డగిస్తున్న వారు తమ లేకితనాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూ ఒక విధంగా తెలంగాణా ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదం చేస్తున్నారు. 

The Judgement given by Hon'ble Mr Justice L. Narsimha Reddy can be viewed here.
http://hc.ap.nic.in/orders/wp_1569_2011.html

Comments

  1. Veeraadhi veera andhra blaagarulara....

    Rozu vandaladiga comments rastaarugaa, ee post chadavikooda ekkada daakkunaaru chepmaa?
    Sasemira antunnaara...

    Deenitho prove ayiindendante, mounanga unde medhavi blaagarlaku, LSP neta JP ki teda ledu!!

    ReplyDelete
  2. Anno eda okka comment raale inka. Andharu padukunnara endhi ? Ayina raseki emunnadhile antha kulla kulla kanapaduthandhi kadha.

    ReplyDelete
  3. జస్టిస్ శ్రీకృష్ణ కాదు ఛీకృష్ణ:)

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ