శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణిపై మొదటినుండి తెలంగాణా వాదులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బయట పడిన ఎనిమిదో అధ్యాయం లోని భాగాలు కమిటీ యొక్క దిగజారుడు తనాన్ని నగ్నంగా బయట పెడుతూ, తెలంగాణా వాడు చేస్తున్న ఆరోపణలు నిరాధారం కావని నిరూపించాయి. ఇలాంటి అధ్యాయం పై సంతకం పెట్టడం ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ ఏరకమైన లాభాలు పొందారో తెలియదు కాని, తన ప్రతిష్టకు మాత్రం మాయని మచ్చ తెచ్చుకున్నారని మాత్రం చెప్పవచ్చు.
సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో తమకిష్టం లేని యూనియన్ లీడర్లను శిక్షించడానికి మేనేజిమెంట్లు తమకి మడుగులోత్తే తొత్తులైన ఆఫీసర్లతో ఎంక్వయిరీలు వేయించి తమకు అనుకూలంగా రిపోర్టులు రాయించుకుని పెద్ద పెద్ద శిక్షలు విధిస్తుంటారు. ఇవి ఎలాగూ లేబర్ కోర్టులలో వీగి పోతుంటాయి. కొండొకచో అలాంటి ప్రవర్తనకు దిగిన అధికారులకు చీవాట్లు కూడా పడుతుంటాయి. కాని ఇక్కడ ఎంక్వరీలు చేసే ఆఫీసర్లు కాని, శిక్షలు విధించే మేనేజర్లు కాని న్యాయ కోవిదులు కారన్న విషయం గమనార్హం.
దేశంలో పేరొందిన న్యాయమూర్తిగా వెలుగొందిన జస్టిస్ శ్రీకృష్ణ ఒక సాధారణమైన లాలూచీ అధికారి మాదిరిగా ప్రవర్తించడం చిత్రమైన విషయం. ఆయన ఎనిమిదో అధ్యాయం లో పేర్కొన్న విషయాలు చూస్తే ఉద్యోగభయంతో మేనేజిమెంటుకు కావలసిన దొంగరిపోర్టులు రాసే సూపర్ వైజరు స్థాయికి ఏమాత్రం మించని వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
తెలంగాణా ఏర్పాటు అడ్డుకోవడానికి అవి పొలిటికల్ మేనేజిమెంటు, మీడియా మేనేజిమెంటు చేయాలని సూచించారు. రాజకీయ నాయకులను పదవులతో కొనాలట! అవసరమైతే సీయం, డిప్యూటీ సీయం పదవులు ఇవ్వడానికి కూడా ఇవ్వడానికి వెనుకాడ వద్దట! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యమంలోకి రాకుండా కట్టడి చేసి, ఉద్యమాన్ని అణచి వేయాలట!
ఒకవైపు అణచివేత సాగిస్తూనే ఇంకోవైపు తెలంగాణా ఏర్పాటు కోసం విస్తృతమైన చర్చలు జరుపుతున్నట్టు నటించాలట! రాజకీయ నాయకులకే పాఠాలు నేర్పుతున్న జస్టిస్ శ్రీకృష్ణ ప్రత్యక్షరాజకీయాల్లో లేనందుకు మనం సంతోషించాలేమో!
ఇక పోతే ఆయనగారు ఉద్భోధించిన మీడియా మేనేజిమెంటు అత్యంత హేయమైన విషయం. ప్రజాస్వామ్యం పై ఏమాత్రం గౌరవం ఉన్నవాడైనా తుపుక్కున ఉమ్మేసే విధంగా ఉన్నాయి కమిటీ సూచనలు! మీడియాలో దాదాపు అందరూ సీమాంధ్ర వారే ఆధిపత్యం చేలాయిస్తున్నారు కాబట్టి, వారందరి సంయుక్త కార్యాచరణ ద్వారా సామాన్యమానవుడి విచక్షణాశక్తిని మసిపూసి మారేడుకాయ చేయాలట! ఇంతటి దారుణమైన ఆలోచనలు మువామ్మార్ ఖడ్డాఫీకి, హోశ్ని ముబారక్ కి కూడా వచ్చి వుండవు.
గతంలో శ్రీకృష్ణ గారు ఇచ్చిన నివేదికలతో తాజా నివేదికను పోలిస్తే పనిచిన పని చేసినట్టుంది కాని, స్వీయ విచక్షణ చూపినట్టు ఏమాత్రం లేదు. మరి పనిచినవాడు చిదంబరుడా మరొకరా అన్నదే ఇప్పుడు తేలాల్సిన సమస్య.
ఇదంతా చూస్తుంటే ఎనభైలలో వచ్చిన తెలుగు మూస సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో రావుగోపాలరావు, అల్లురామలింగయ్య విలన్లుగా ఉండే వారు. హీరోని అడ్డగించ డానికి రకరకాల తెలివి తక్కువ కుట్రలు పన్నుతూ, అవి బయట పడి శృంగభంగం చెందుతూ ఉండే వారు. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నడ్డగిస్తున్న వారు తమ లేకితనాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూ ఒక విధంగా తెలంగాణా ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదం చేస్తున్నారు.
The Judgement given by Hon'ble Mr Justice L. Narsimha Reddy can be viewed here.
http://hc.ap.nic.in/orders/wp_1569_2011.html
Veeraadhi veera andhra blaagarulara....
ReplyDeleteRozu vandaladiga comments rastaarugaa, ee post chadavikooda ekkada daakkunaaru chepmaa?
Sasemira antunnaara...
Deenitho prove ayiindendante, mounanga unde medhavi blaagarlaku, LSP neta JP ki teda ledu!!
Anno eda okka comment raale inka. Andharu padukunnara endhi ? Ayina raseki emunnadhile antha kulla kulla kanapaduthandhi kadha.
ReplyDeleteజస్టిస్ శ్రీకృష్ణ కాదు ఛీకృష్ణ:)
ReplyDelete