మన దేశానికి అవినీతి ఒక మానని గాయంలా తయారై సలుపుతుంది. యాభై రూపాయలకు ఆశపడి వోటు వేసే సామాన్యుడి నుండి ఐదువేల కోట్లు తీసుకుని సంతకం పెట్టే మంత్రి వరకు ఇది ఒక మహా విషవృక్షంలా తయారైంది. విత్తు ముందా, చెట్టు ముందా అన్నట్టు డబ్బు తీసుకోకుండా మార్పు ఎక్కడ మొదలు కావాలి, సామాన్యుడి లోనా, రాజకీయ నాయకుల లోనా అనేది ఒక తెగని సమస్యగా మారి పోయింది.
ప్రతి ఏడూ లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయ బడుతుంది. ఆపైన ఎన్నో కోట్ల రూపాయల దేశంలోని సహజవనరులకు ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తుంది. ఇంతటి సంపదపై ఆధిపత్యం వహిస్తున్నపుడు, సంబధిత పాలకవర్గం ప్రలోభాలకు గురికావడం సహజమైన విషయం. అందుకనే అవినీతిని రూపు మాపడానికి అత్యంత శక్తి వంతమైన నిఘా, విచారణ సంస్థను ఏర్పాటు చేసి, సంబంధిత వ్యక్తులను శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు.
అలా వచ్చిన ఆలోచనే లోక్ పాల్ వ్యవస్థ. నలభై రెండు సంవత్సరాల క్రితమే 1968 లోనే ఆమోదం పొందినా 1969 లో లోక్ సభ రద్దు కావడంతో మొదటిసారి లోక్ పాల్ బిల్లు మూలకు పడింది. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 మరియు 2008 లలో పార్లమెంటు ముందుకు వచ్చినా బలమైన లాబీలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఎప్పటికప్పుడు మరిన్ని మార్పులు కోరడం, బిల్లు శీతలమాలిగలోకి వెళ్ళడం యధావిధిగా జరిగి పోతుంది.
ఈ రోజున దాదాపు డెబ్బై అయిదు లక్షల కోట్ల డబ్బు అవినీతి పరుల చేతుల్లో పడి స్విస్స్ బ్యాంకుల్లో మూలుగుతుంది. ఈ డబ్బు గనక వినియోగంలోకి వస్తే దాదాపు ఐదు సంవత్సరాలు దేశ ప్రజలు ఎలాంటి టాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవినీతిని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతో.
ప్రతి ఏడూ లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయ బడుతుంది. ఆపైన ఎన్నో కోట్ల రూపాయల దేశంలోని సహజవనరులకు ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తుంది. ఇంతటి సంపదపై ఆధిపత్యం వహిస్తున్నపుడు, సంబధిత పాలకవర్గం ప్రలోభాలకు గురికావడం సహజమైన విషయం. అందుకనే అవినీతిని రూపు మాపడానికి అత్యంత శక్తి వంతమైన నిఘా, విచారణ సంస్థను ఏర్పాటు చేసి, సంబంధిత వ్యక్తులను శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు.
అలా వచ్చిన ఆలోచనే లోక్ పాల్ వ్యవస్థ. నలభై రెండు సంవత్సరాల క్రితమే 1968 లోనే ఆమోదం పొందినా 1969 లో లోక్ సభ రద్దు కావడంతో మొదటిసారి లోక్ పాల్ బిల్లు మూలకు పడింది. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 మరియు 2008 లలో పార్లమెంటు ముందుకు వచ్చినా బలమైన లాబీలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఎప్పటికప్పుడు మరిన్ని మార్పులు కోరడం, బిల్లు శీతలమాలిగలోకి వెళ్ళడం యధావిధిగా జరిగి పోతుంది.
బయటికి మాత్రం అన్ని పార్టీల రాజకీయ నాయకులు లోక్ పాల్ వ్యవస్థ ఆవశ్యకతను సమర్థించే వారే. కాని లోలోపల మాత్రం రాజకీయ నాయకులెవరికీ ఈ బిల్లు అమలు కావడం ఇష్టం ఉండదన్న విషయం బహిరంగ రహస్యం. ఎవరు మాత్రం తమపై తామే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు? అందుకనే గత నలభై రెండు సంవత్సరాలుగా బిల్లు అమలుకు నోచుకోకుండా ఉండిపోతుంది.
అసలు ఈ బిల్లు అమలు లోకి వస్తే మాత్రం ఎంతమేరకు అవినీతి అరికట్ట బడుతుంది అనేది మరో కోణం. ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న లోకాయుక్త ఎంతమేరకు పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం. అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.
అసలు ఈ బిల్లు అమలు లోకి వస్తే మాత్రం ఎంతమేరకు అవినీతి అరికట్ట బడుతుంది అనేది మరో కోణం. ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న లోకాయుక్త ఎంతమేరకు పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం. అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.
కాబట్టి ఇప్పటికైనా బిల్లు విషయంలో ప్రజలంతా అప్రమత్తం అయి ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం ముందడుగు వేసిన అన్నాహజారే ఎంతైనా అభినంద నీయులు. ఆయన నిన్నటినుండి లోక్ పాల్ బిల్లు అమలు కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు.
అన్నాహజారేతో మొదలైన స్ఫూర్తి దేశం మొత్తం పాకి పోయి ఒక దావానలంగా మారిపోయి అవినీతి భూతాన్ని దహించి వేయాలని ఆశించడం ప్రస్తుతానికి అత్యాశే అయినా, దీని వల్ల దేశంలో అవినీతి పై చర్చ జరిగి ప్రజలు కొంత మేరకైనా చైతన్యవంతం కావాలని ఆశిద్దాం.
అన్నాహజారేతో మొదలైన స్ఫూర్తి దేశం మొత్తం పాకి పోయి ఒక దావానలంగా మారిపోయి అవినీతి భూతాన్ని దహించి వేయాలని ఆశించడం ప్రస్తుతానికి అత్యాశే అయినా, దీని వల్ల దేశంలో అవినీతి పై చర్చ జరిగి ప్రజలు కొంత మేరకైనా చైతన్యవంతం కావాలని ఆశిద్దాం.
very thoughtful post, and need of the hour.
ReplyDeleteI hope citizens realizet he importance of this hunger strike and extend their support in what ever way they can.
Thanks for the thought provoking write-up, Hari!
Thanks Manasa Garu
ReplyDelete>>>>>>అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.>>>>
ReplyDeleteనూటికి నూరుపాళ్ళు నిజం. చాలా మంచి టపా. ఆయన ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.
శిశిర గారు, ధన్యవాదాలు.
ReplyDeleteఅన్నా హజారే లాంటి యువ శక్తి ఆవశ్యకత మన దేశానికి ఎంతైనా ఉంది .......
ReplyDeleteప్రవీణ్ శర్మగారూ మీ బ్లాగులో కొన్ని పోస్ట్ లు చదివాను. ఏవో నాలుగు ఆకతాయి మాటలు, అభిప్రాయాలు రాసి బ్లాగుల్ని కూడా ఫోరమ్స్ లా మార్చేస్తున్నారు కొందరు. బ్లాగ్ సాహిత్యాన్ని నిత్యం చూస్తానే కానీ మరీ డీప్ గా తీసుకునేంత అర్హత ఇంకా వాటికి రాలేదనే అభిప్రాయం నాకుంది. కానీ మీ బ్లాగుల్లాంటివి చూసినప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. మీ శైలి, రాయడానికి మీరు ఎంచుకుంటున్న దృక్కోణం, రాతలో నిజాయతీ ... అన్నీ బాగున్నాయి. అన్ని పోస్టులూ చదవలేదు గానీ... స్థాలీపులాకంగా చదవగానే నాకు అనిపించింది ఇదీ... మీ కృషి అభినందనీయం.
ReplyDeleteవక్కలంక కిషోర్