Skip to main content

జయహో అన్నా హజారే

మన దేశానికి అవినీతి ఒక మానని గాయంలా తయారై సలుపుతుంది. యాభై రూపాయలకు ఆశపడి వోటు వేసే సామాన్యుడి నుండి ఐదువేల కోట్లు తీసుకుని సంతకం పెట్టే మంత్రి వరకు ఇది ఒక మహా విషవృక్షంలా తయారైంది. విత్తు ముందా, చెట్టు ముందా అన్నట్టు డబ్బు తీసుకోకుండా మార్పు ఎక్కడ మొదలు కావాలి, సామాన్యుడి లోనా, రాజకీయ నాయకుల లోనా అనేది ఒక తెగని సమస్యగా మారి పోయింది.

ఈ రోజున దాదాపు డెబ్బై అయిదు లక్షల కోట్ల డబ్బు అవినీతి పరుల చేతుల్లో పడి స్విస్స్ బ్యాంకుల్లో మూలుగుతుంది. ఈ డబ్బు గనక వినియోగంలోకి వస్తే దాదాపు ఐదు సంవత్సరాలు దేశ ప్రజలు ఎలాంటి టాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవినీతిని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతో.

ప్రతి ఏడూ లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయ బడుతుంది. ఆపైన ఎన్నో కోట్ల రూపాయల దేశంలోని సహజవనరులకు ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తుంది. ఇంతటి సంపదపై ఆధిపత్యం వహిస్తున్నపుడు, సంబధిత పాలకవర్గం ప్రలోభాలకు గురికావడం సహజమైన విషయం. అందుకనే అవినీతిని రూపు మాపడానికి అత్యంత శక్తి వంతమైన నిఘా, విచారణ సంస్థను ఏర్పాటు చేసి, సంబంధిత వ్యక్తులను శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు.

అలా వచ్చిన ఆలోచనే లోక్ పాల్ వ్యవస్థ. నలభై రెండు సంవత్సరాల క్రితమే 1968 లోనే ఆమోదం పొందినా 1969 లో లోక్ సభ రద్దు కావడంతో మొదటిసారి లోక్ పాల్ బిల్లు మూలకు పడింది. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 మరియు 2008 లలో పార్లమెంటు ముందుకు వచ్చినా బలమైన లాబీలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఎప్పటికప్పుడు మరిన్ని మార్పులు కోరడం, బిల్లు శీతలమాలిగలోకి వెళ్ళడం యధావిధిగా జరిగి పోతుంది.


బయటికి మాత్రం అన్ని పార్టీల రాజకీయ నాయకులు లోక్ పాల్ వ్యవస్థ ఆవశ్యకతను సమర్థించే వారే. కాని లోలోపల మాత్రం రాజకీయ నాయకులెవరికీ ఈ బిల్లు అమలు కావడం ఇష్టం ఉండదన్న విషయం బహిరంగ రహస్యం. ఎవరు మాత్రం తమపై తామే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు? అందుకనే గత నలభై రెండు సంవత్సరాలుగా బిల్లు అమలుకు నోచుకోకుండా ఉండిపోతుంది.

అసలు ఈ బిల్లు అమలు లోకి వస్తే మాత్రం ఎంతమేరకు అవినీతి అరికట్ట బడుతుంది అనేది మరో కోణం. ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న లోకాయుక్త ఎంతమేరకు పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం. అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. 

కాబట్టి ఇప్పటికైనా బిల్లు విషయంలో ప్రజలంతా అప్రమత్తం అయి ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం ముందడుగు వేసిన అన్నాహజారే ఎంతైనా అభినంద నీయులు.  ఆయన నిన్నటినుండి లోక్ పాల్ బిల్లు అమలు కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు.

అన్నాహజారేతో మొదలైన స్ఫూర్తి దేశం మొత్తం పాకి పోయి ఒక దావానలంగా మారిపోయి అవినీతి భూతాన్ని దహించి వేయాలని ఆశించడం ప్రస్తుతానికి అత్యాశే అయినా, దీని వల్ల దేశంలో అవినీతి పై చర్చ జరిగి ప్రజలు కొంత మేరకైనా చైతన్యవంతం కావాలని ఆశిద్దాం.


Comments

  1. very thoughtful post, and need of the hour.
    I hope citizens realizet he importance of this hunger strike and extend their support in what ever way they can.

    Thanks for the thought provoking write-up, Hari!

    ReplyDelete
  2. >>>>>>అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.>>>>

    నూటికి నూరుపాళ్ళు నిజం. చాలా మంచి టపా. ఆయన ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.

    ReplyDelete
  3. శిశిర గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  4. అన్నా హజారే లాంటి యువ శక్తి ఆవశ్యకత మన దేశానికి ఎంతైనా ఉంది .......

    ReplyDelete
  5. ప్రవీణ్ శర్మగారూ మీ బ్లాగులో కొన్ని పోస్ట్ లు చదివాను. ఏవో నాలుగు ఆకతాయి మాటలు, అభిప్రాయాలు రాసి బ్లాగుల్ని కూడా ఫోరమ్స్ లా మార్చేస్తున్నారు కొందరు. బ్లాగ్ సాహిత్యాన్ని నిత్యం చూస్తానే కానీ మరీ డీప్ గా తీసుకునేంత అర్హత ఇంకా వాటికి రాలేదనే అభిప్రాయం నాకుంది. కానీ మీ బ్లాగుల్లాంటివి చూసినప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. మీ శైలి, రాయడానికి మీరు ఎంచుకుంటున్న దృక్కోణం, రాతలో నిజాయతీ ... అన్నీ బాగున్నాయి. అన్ని పోస్టులూ చదవలేదు గానీ... స్థాలీపులాకంగా చదవగానే నాకు అనిపించింది ఇదీ... మీ కృషి అభినందనీయం.
    వక్కలంక కిషోర్

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ