హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు.
అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది?
సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు. తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు.
2G, కామన్వెల్త్ మొదలైన కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట 'నానాటికి తీసికట్టు, నాగంభొట్లు' అన్నట్టుగా తయారయ్యింది. 2G పై, CVC ఎంపికపై ప్రధాన మంత్రిపైనే సుప్రీం అక్షింతలు పడ్డాయి. పులిమీద పుట్ర లాగా ఇప్పుడే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చి పడ్డాయి.
ఎటూ దిక్కు తోచకుండా ఉన్న కాంగ్రెస్ కు అన్నా దీక్ష అనుకోని వరంలా వచ్చి పడింది. అన్నాతో సంధి కుదుర్చుకోవడం ద్వారా తాము అవినీతి నిరోధకులమని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఇక బిల్లు సంగతా, అది పార్లమెంటుకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఈ బిల్లు అమలు లోకి రావడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి నానా కొర్రీలు పెట్టి ఎలాగూ అటకెక్కిస్తాయి. ఈలోపల క్రెడిట్ మనం కొట్టేయొచ్చు. ఇదే కాంగ్రెస్ ఆలోచనగా కనపడుతుంది.
కాంగ్రేస్ తెలివితేటలు లేటుగా తెలుసుకున్న బీజేపీ, వామపక్షాలు డ్రాఫ్టు కమిటీలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం పై ఇప్పుడు గుర్రుమంటున్నాయి. అయితే అవినీతిపై ఏనాడూ నిజాయితీగా ఉద్యమించని ఆ పార్టీలు గట్టిగా అడిగే నైతిక హక్కును కోల్పోయాయని చెప్పొచ్చు.
జన్ లోక్డ్ పాల్ బిల్లు డ్రాఫ్టు కమిటీ మెంబర్లు |
ప్రణభ్ ముఖర్జీ అధ్యక్షతలో ఈ కమిటీ మరో తెలంగాణా కమిటీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అలా జరిగినట్టయితే ఈ కళంకిత మీడియా ఇప్పుడు చేసినంత హడావుడి అప్పుడు కూడా చేస్తుందా అనేది అనుమానమే. ఏమైనప్పటికీ ఈ బిల్లు అమలులోకి వచ్చేదాకా దేశ ప్రజలు నిరంతర అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు.
శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి హొటెల్స్లో చాలా లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. అందుకే శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. లోక్పాల్ పెట్టడం కంటే CBIకి ఉన్న అధికారాలు పెంచడం మేలు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెయ్యలేక ట్రాన్స్ఫర్ చేసిన కేసులని మాత్రమే CBI దర్యాప్తు చేస్తుంది కానీ స్వతంత్రంగా కేసు నమోదు చేసే అధికారం CBIకి లేదు. CBIకి ఉన్న అధికారాలు పెంచితే కొత్త కమిటీలు వెయ్యాల్సిన ఖర్చు ఉండదు.
ReplyDeleteలోక్పాల్ బిల్కి మద్దతు ఇస్తున్నామంటూ బ్లాగుల్లో హడావుడి చేసినవాళ్ళు నిజంగా ఆ బిల్లో ఏముందో చదవలేదేమోనని నాకు అనుమానం. CBI అధికారులైనా నిజాయితీగా పని చేస్తారంటే నమ్మొచ్చు కానీ అధికార పార్టీ నియమించిన లోక్పాల్ కమిటీ నిజాయితీగా పని చేస్తుందంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలి.
ReplyDeleteప్రవీణ్ గారు,
ReplyDeleteతెలంగాణా కమిటీ అంటే నేనన్నది ప్రణభ్ కమిటీ గురించి. ప్రణభ్ కమిటీ అంటే ఎడతెగని కమిటీ అని పేరుకదా! దీనికి కూడా ప్రణభ్ ముఖర్జీ చైర్మన్ గా ఉన్నారు. అందుకని అనుమానం వస్తుంది.
ఒకవేళ లోక్పాల్ ఏర్పడితే CBI లోని అవినీతి వ్యతిరేక విభాగాన్ని లోక్పాల్లో విలీనం చేయవచ్చు. దానికి ఏయే అధికారాలు ఉండాలో నిర్ణయించేందుకే ఈ కమిటీ వేసారు. అది బిల్లుగా వస్తే ఆ అధికారాలు వస్తాయి. కాని ఇదంతా జరిగేదాకా నమ్మలేం, గత అనుభవాల దృష్ట్యా.