Skip to main content

గూగుల్ నిర్వాకం


గూగుల్ వాడు తన అనలిటిక్స్ సైటులో భారత దేశ పటం ఇలా చూపుతున్నాడు. దీనిలో జమ్మూ&కాశ్మీర్, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు భారత్ నుండి వేరు చేసి చూపబడ్డాయి. దీన్ని మనమంతా ఖండించ వలసిన అవసరం ఉంది. దీనిపై కంప్లైంటు ఏ మెయిల్ ఐడికి పంపాలో ఎవరైనా తెలియ జేయ గలరు.

Comments

  1. దీనిగురించి ఎలా అర్థం చేసుకోవాలో, నిజమయితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో నాకు తెలియదు కానీ...ఒక సందేహం...ఒకవేళ గూగుల్ వాళ్ళ నెట్ వర్క్ ఈ రాష్ట్రాల్లో లేదేమో...అందుకని వాటిని కలర్ లేకుండా ఉంచారేమో...కనుక్కోండి.

    ReplyDelete
  2. బ్రిటిష్ వాళ్ళ టైమ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా, చైనాల మధ్య వివాదం ఉంది. కాశ్మీర్ ఇండియాలో లేనట్టు చూపించడమే బాలేదు. కాశ్మీరీ ముస్లిం నాయకులు ఒప్పుకుంటేనే జవహార్ లాల్ నెహ్రూ కాశ్మీర్‌ని ఇండియాలో ఉంచారు. అంతే కానీ కాశ్మీర్‌ని ఇండియా ఆక్రమించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్‌ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో హిందూ మతాన్ని నమ్మే గిరిజన జాతులు రెండే ఉన్నాయి. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు అనే భావన బలపడుతోంది.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    మీరు పొరబడ్డట్టున్నారు. అరుణాచల్‌ను ఎవరూ ఆక్రమించలేదు. అది భారత దేశంలో ఒక రాష్ట్రం. ఇక్కడ చూడండి. అయితే చైనా మాత్రం అరుణాచల్ మన దేశంలో భాగంగా ఒప్పుకోవడం లేదు. అందుకే అరుణాచల్ వారికి, కాశ్మీర్ వారికి ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తుంది.

    ReplyDelete
  4. వికీపీడియాలో సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చెయ్యొచ్చు. బ్రిటిష్ వాళ్లు ఇండియాని ఆక్రమించుకోవడానికి ముందు ఇండియా ముఘల్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉండేది. అప్పట్లో ముఘల్ సామ్రాజ్యం ఉత్తరాన కాబూల్ నుంచి దక్షిణాన తిరుచ్చిరాపల్లి వరకు, తూర్పున బంగ్లాదేశ్ నుంచి పశ్చిమాన ఇరానీ బెలూచిస్తాన్ వరకు విస్తరించి ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ ముఘల్ సామ్రాజ్యంలో భాగంగా లేదు. అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జాతుల సంస్కృతి బర్మా సంస్కృతికి దగ్గరగా ఉంది. అక్కడ 80% మంది గిరిజన జాతులవారే కానీ ఆ జాతులలో రెండు జాతులవారు మాత్రమే హిందూ మతాన్ని నమ్ముతారు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఒకప్పుడు ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తుంది. నేపాల్‌లో 90% మంది హిందువులు. ఎందుకంటే నేపాల్ ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నేపాల్‌లో నేముని అనే హిందూ సన్యాసి కూడా ఉండేవాడు. అతని పేరు మీదే దేశం ఏర్పడింది. భూటాన్‌లో 25% మంది హిందువులు, ఆ దేశం కొన్ని వందల సంవత్సరాల నుంచి బౌద్ధుల పాలనలో ఉన్నప్పటికీ. కానీ అరుణాచల్ ప్రదేశ్‌లో హిందువుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? సాంస్కృతిక తేడాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తోంది.

    ReplyDelete
  5. ప్రవీణ్ గారు,

    బ్రిటిష్ వారు ఆక్రమించక ముందు దేశం ఎప్పుడూ ఒకటిగా లేదు. వందల కొద్దీ దేశాలు ఉండేవి. కాబట్టి బ్రిటిషర్ల కంటే ముందు India అనే దేశాన్ని ఊహించలేం.

    అలాగే హిందూ జనభా ఉంది కాబట్టి నేపాల్ మనదనీ చెప్పలేం.

    పైగా కాశ్మీర్‌లో అలజడులు జరుగుతున్నాయి కానీ, అరుణాచల్‌లో ఎవ్వరూ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం లేదు. అక్కడ ప్రజాస్వామ్య యుతమైన పాలన, ముఖ్యమంత్రి ఉన్నారు.

    ఏదేమైనా, కాశ్మీర్, అరుణాచల్ లను అధికారికంగా ఐక్యరాజ్యసమితి భారత భూభాగాలుగా గుర్తిస్తున్నప్పుడు (వాస్తవాధీన రేఖకు లోబడి), గూగుల్ వాడు ఆ ప్రాంతాలు మన దేశానికి చెందనివిగా చూపడం తగని పని.

    ReplyDelete
  6. Google has adapted country based policy. www.google.com shows all disputed lands in all places separately, but country specific urls like google.co.in, google.co.cn, google.co.pk show maps as per their country standard.

    Even bbc does not show kashmir as prt of India but shows it with separate marking.

    ReplyDelete
  7. హరి దోర్నాల గారు,
    నేను మీబ్లాగుని చదువుతూ ఉంటాను. మీరు రాసిన దానిని చదివితే ఒక సగటు మనిషి ఆవేదనా, మధ్యతరగతి వారి దేశభక్తి కనిపిచ్చింది. మీరు ప్రపంచం లో ప్రస్తుత జరిగే పరిణామాలనిటిని పై పై చూస్తున్నారని పిస్తున్నాది. పశ్చిమ దేశాల స్ట్రేటజి మీకు బాగా అర్థమౌతుంది. ఇతను కొన్ని సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడి ఎంతో రీసర్చ్ చేసి పుస్తకం రాశాడు. ఈ పుస్తకం లో ప్రతి లైన్ కి ఇచ్చినన్ని రిఫరేన్స్లు నేను ఇప్పటివరకు చదివిన ఏ పుస్తకంలో లేవు. సుమారు 200 పేజిలు రిఫరెన్స్లు ఇచ్చి ఎంతో అథేంటిక్ గా రాశారు. ఇప్పుడు యు యస్ లోని ప్రిన్స్ టన్ యునివర్సిటి లో ఈపుస్తకం మీద అకేడేమిక్ చర్చ జరిపారు. దేశంలో జరిగే సంఘటనలు వాటి సమాధానల కోసం చీకట్లొ వెతుకునే మనకు ఇది మంచి దీపం లాంటిది. ఈ పుస్తకం 430 పేజీలు ఉంట్టుంది.

    http://breakingindia.com/?page=videos&playlist=84946D0C3A116B00
    Rs550/- if you place order in Flipkart

    ఈ పుస్తకం చదివి నాకు నచ్చ లేదు అని చెపితే. నేను మీకు డబ్బులు చెల్లిస్తాను.

    శ్రీనాథ్

    ReplyDelete
  8. శ్రీనాథ్ గారు,

    మీరు చెప్పిన పుస్తకం తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...