Skip to main content

గూగుల్ నిర్వాకం


గూగుల్ వాడు తన అనలిటిక్స్ సైటులో భారత దేశ పటం ఇలా చూపుతున్నాడు. దీనిలో జమ్మూ&కాశ్మీర్, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు భారత్ నుండి వేరు చేసి చూపబడ్డాయి. దీన్ని మనమంతా ఖండించ వలసిన అవసరం ఉంది. దీనిపై కంప్లైంటు ఏ మెయిల్ ఐడికి పంపాలో ఎవరైనా తెలియ జేయ గలరు.

Comments

  1. దీనిగురించి ఎలా అర్థం చేసుకోవాలో, నిజమయితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో నాకు తెలియదు కానీ...ఒక సందేహం...ఒకవేళ గూగుల్ వాళ్ళ నెట్ వర్క్ ఈ రాష్ట్రాల్లో లేదేమో...అందుకని వాటిని కలర్ లేకుండా ఉంచారేమో...కనుక్కోండి.

    ReplyDelete
  2. బ్రిటిష్ వాళ్ళ టైమ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా, చైనాల మధ్య వివాదం ఉంది. కాశ్మీర్ ఇండియాలో లేనట్టు చూపించడమే బాలేదు. కాశ్మీరీ ముస్లిం నాయకులు ఒప్పుకుంటేనే జవహార్ లాల్ నెహ్రూ కాశ్మీర్‌ని ఇండియాలో ఉంచారు. అంతే కానీ కాశ్మీర్‌ని ఇండియా ఆక్రమించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్‌ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో హిందూ మతాన్ని నమ్మే గిరిజన జాతులు రెండే ఉన్నాయి. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు అనే భావన బలపడుతోంది.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    మీరు పొరబడ్డట్టున్నారు. అరుణాచల్‌ను ఎవరూ ఆక్రమించలేదు. అది భారత దేశంలో ఒక రాష్ట్రం. ఇక్కడ చూడండి. అయితే చైనా మాత్రం అరుణాచల్ మన దేశంలో భాగంగా ఒప్పుకోవడం లేదు. అందుకే అరుణాచల్ వారికి, కాశ్మీర్ వారికి ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తుంది.

    ReplyDelete
  4. వికీపీడియాలో సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చెయ్యొచ్చు. బ్రిటిష్ వాళ్లు ఇండియాని ఆక్రమించుకోవడానికి ముందు ఇండియా ముఘల్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉండేది. అప్పట్లో ముఘల్ సామ్రాజ్యం ఉత్తరాన కాబూల్ నుంచి దక్షిణాన తిరుచ్చిరాపల్లి వరకు, తూర్పున బంగ్లాదేశ్ నుంచి పశ్చిమాన ఇరానీ బెలూచిస్తాన్ వరకు విస్తరించి ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ ముఘల్ సామ్రాజ్యంలో భాగంగా లేదు. అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జాతుల సంస్కృతి బర్మా సంస్కృతికి దగ్గరగా ఉంది. అక్కడ 80% మంది గిరిజన జాతులవారే కానీ ఆ జాతులలో రెండు జాతులవారు మాత్రమే హిందూ మతాన్ని నమ్ముతారు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఒకప్పుడు ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తుంది. నేపాల్‌లో 90% మంది హిందువులు. ఎందుకంటే నేపాల్ ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నేపాల్‌లో నేముని అనే హిందూ సన్యాసి కూడా ఉండేవాడు. అతని పేరు మీదే దేశం ఏర్పడింది. భూటాన్‌లో 25% మంది హిందువులు, ఆ దేశం కొన్ని వందల సంవత్సరాల నుంచి బౌద్ధుల పాలనలో ఉన్నప్పటికీ. కానీ అరుణాచల్ ప్రదేశ్‌లో హిందువుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? సాంస్కృతిక తేడాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తోంది.

    ReplyDelete
  5. ప్రవీణ్ గారు,

    బ్రిటిష్ వారు ఆక్రమించక ముందు దేశం ఎప్పుడూ ఒకటిగా లేదు. వందల కొద్దీ దేశాలు ఉండేవి. కాబట్టి బ్రిటిషర్ల కంటే ముందు India అనే దేశాన్ని ఊహించలేం.

    అలాగే హిందూ జనభా ఉంది కాబట్టి నేపాల్ మనదనీ చెప్పలేం.

    పైగా కాశ్మీర్‌లో అలజడులు జరుగుతున్నాయి కానీ, అరుణాచల్‌లో ఎవ్వరూ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం లేదు. అక్కడ ప్రజాస్వామ్య యుతమైన పాలన, ముఖ్యమంత్రి ఉన్నారు.

    ఏదేమైనా, కాశ్మీర్, అరుణాచల్ లను అధికారికంగా ఐక్యరాజ్యసమితి భారత భూభాగాలుగా గుర్తిస్తున్నప్పుడు (వాస్తవాధీన రేఖకు లోబడి), గూగుల్ వాడు ఆ ప్రాంతాలు మన దేశానికి చెందనివిగా చూపడం తగని పని.

    ReplyDelete
  6. Google has adapted country based policy. www.google.com shows all disputed lands in all places separately, but country specific urls like google.co.in, google.co.cn, google.co.pk show maps as per their country standard.

    Even bbc does not show kashmir as prt of India but shows it with separate marking.

    ReplyDelete
  7. హరి దోర్నాల గారు,
    నేను మీబ్లాగుని చదువుతూ ఉంటాను. మీరు రాసిన దానిని చదివితే ఒక సగటు మనిషి ఆవేదనా, మధ్యతరగతి వారి దేశభక్తి కనిపిచ్చింది. మీరు ప్రపంచం లో ప్రస్తుత జరిగే పరిణామాలనిటిని పై పై చూస్తున్నారని పిస్తున్నాది. పశ్చిమ దేశాల స్ట్రేటజి మీకు బాగా అర్థమౌతుంది. ఇతను కొన్ని సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడి ఎంతో రీసర్చ్ చేసి పుస్తకం రాశాడు. ఈ పుస్తకం లో ప్రతి లైన్ కి ఇచ్చినన్ని రిఫరేన్స్లు నేను ఇప్పటివరకు చదివిన ఏ పుస్తకంలో లేవు. సుమారు 200 పేజిలు రిఫరెన్స్లు ఇచ్చి ఎంతో అథేంటిక్ గా రాశారు. ఇప్పుడు యు యస్ లోని ప్రిన్స్ టన్ యునివర్సిటి లో ఈపుస్తకం మీద అకేడేమిక్ చర్చ జరిపారు. దేశంలో జరిగే సంఘటనలు వాటి సమాధానల కోసం చీకట్లొ వెతుకునే మనకు ఇది మంచి దీపం లాంటిది. ఈ పుస్తకం 430 పేజీలు ఉంట్టుంది.

    http://breakingindia.com/?page=videos&playlist=84946D0C3A116B00
    Rs550/- if you place order in Flipkart

    ఈ పుస్తకం చదివి నాకు నచ్చ లేదు అని చెపితే. నేను మీకు డబ్బులు చెల్లిస్తాను.

    శ్రీనాథ్

    ReplyDelete
  8. శ్రీనాథ్ గారు,

    మీరు చెప్పిన పుస్తకం తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...