Skip to main content

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను. 




కావలసిన పదార్థాలు:

మైదా పిండి  150 గ్రా 
బియ్యం పిండి 50 గ్రా 
చక్కెర  75 గ్రా 
ఉప్పు చిటికెడు 
ఏలకులు రెండు 
లవంగాలు రెండు 
దాల్చిన చెక్క ఒక ముక్క 
పాలు కలపడానికి తగినన్ని 
కుకింగ్ బటర్ లేదా నెయ్యి 50 గ్రా 
గ్రుడ్డు ఒకటి (పచ్చసొన మాత్రమే)
బేకింగ్ సోడా  చిటికెడు 
బేకింగ్ సాల్ట్ చిటికెడు  

తయారు చేసే విధానం: 

ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె వరకు పిసుక్కోవాలి. గ్రుడ్డు వేసేటప్పుడు మాత్రం పచ్చ సొన మాత్రమే వేయండి. రెండూ కలిపి వేస్తే నీసు వాసన వచ్చే అవకాశం ఉంది. పిండి చపాతి పిండి మాదిరి గట్టి తనంతో ఉండాలి. ప్లాట్ ఫారం మీద పొడి పిండి వేసి (అంటుకోకుండా ఉండడానికి) రొట్టెల కర్రతో పావు అంగుళం మందం వచ్చేటట్టుగా వత్తుకోవాలి. తర్వాత ఏదైనా ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగిన గ్లాసు లాంటి పాత్ర ఉపయోగించి బిస్కట్లుగా కట్ చేసుకోవాలి. ఇతర షేపుల్లో కావాలంటే కత్తితో కట్ చేసుకోవాలి. లేదా రకరకాల షేపులు మార్కెట్లో దొరుకుతాయి.

తర్వాత బేకింగ్ ట్రే తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. ఆ నూనెకి అంటేలా పొడిపిండి చల్లాలి. బిస్కట్లను ట్రే లో అమర్చుకోవాలి. 

బేకింగ్ చేసే విధానం: 

ముందుగా ఓవెన్ ని 170 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ప్రీ-హీట్ చేసుకోవాలి. తర్వాత బిస్కట్లు పెట్టి 170 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 12 నుండి 14 నిమిషాలు బేక్ చేయాలి. బేక్ అయిన బిస్కట్లను ఫ్యాను క్రింద పది నిమిషాలు ఆరబెట్టి తర్వాత డబ్బాలో నిలువ చేసుకోవాలి. 

మరి తయారు చేసి చెప్తారు కదా, ఎలా ఉన్నాయో. ఇంకేమైనా మార్పులు, చేర్పులు, సలహాలు ఉంటే క్రింద కామెంట్ల రూపంలో రాయండి.

Comments

  1. దాంక్స్. నేను ఇవి చేసేసి ఎలా ఉన్నాయో చెప్తాను. నాకు ఉస్మానియా బిస్కట్లంటే చాలా ఇష్టం.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ జ్యోతి గారు. మీరు చేసాక మార్పు చేర్పులుంటే తప్పక సూచించండి.

    ReplyDelete
  3. http://appalaraj.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete
  4. నాక్కూడా ఇవి చాలా ఇష్టం. నేను మా ఆవిడను బతిమాలి ఒప్పించాను. పైన చెప్పిన విధానం చాలా సులభంగానే అగుపించిందట మరి. చూద్దాం.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...