Skip to main content

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను. 




కావలసిన పదార్థాలు:

మైదా పిండి  150 గ్రా 
బియ్యం పిండి 50 గ్రా 
చక్కెర  75 గ్రా 
ఉప్పు చిటికెడు 
ఏలకులు రెండు 
లవంగాలు రెండు 
దాల్చిన చెక్క ఒక ముక్క 
పాలు కలపడానికి తగినన్ని 
కుకింగ్ బటర్ లేదా నెయ్యి 50 గ్రా 
గ్రుడ్డు ఒకటి (పచ్చసొన మాత్రమే)
బేకింగ్ సోడా  చిటికెడు 
బేకింగ్ సాల్ట్ చిటికెడు  

తయారు చేసే విధానం: 

ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె వరకు పిసుక్కోవాలి. గ్రుడ్డు వేసేటప్పుడు మాత్రం పచ్చ సొన మాత్రమే వేయండి. రెండూ కలిపి వేస్తే నీసు వాసన వచ్చే అవకాశం ఉంది. పిండి చపాతి పిండి మాదిరి గట్టి తనంతో ఉండాలి. ప్లాట్ ఫారం మీద పొడి పిండి వేసి (అంటుకోకుండా ఉండడానికి) రొట్టెల కర్రతో పావు అంగుళం మందం వచ్చేటట్టుగా వత్తుకోవాలి. తర్వాత ఏదైనా ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగిన గ్లాసు లాంటి పాత్ర ఉపయోగించి బిస్కట్లుగా కట్ చేసుకోవాలి. ఇతర షేపుల్లో కావాలంటే కత్తితో కట్ చేసుకోవాలి. లేదా రకరకాల షేపులు మార్కెట్లో దొరుకుతాయి.

తర్వాత బేకింగ్ ట్రే తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. ఆ నూనెకి అంటేలా పొడిపిండి చల్లాలి. బిస్కట్లను ట్రే లో అమర్చుకోవాలి. 

బేకింగ్ చేసే విధానం: 

ముందుగా ఓవెన్ ని 170 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ప్రీ-హీట్ చేసుకోవాలి. తర్వాత బిస్కట్లు పెట్టి 170 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 12 నుండి 14 నిమిషాలు బేక్ చేయాలి. బేక్ అయిన బిస్కట్లను ఫ్యాను క్రింద పది నిమిషాలు ఆరబెట్టి తర్వాత డబ్బాలో నిలువ చేసుకోవాలి. 

మరి తయారు చేసి చెప్తారు కదా, ఎలా ఉన్నాయో. ఇంకేమైనా మార్పులు, చేర్పులు, సలహాలు ఉంటే క్రింద కామెంట్ల రూపంలో రాయండి.

Comments

  1. దాంక్స్. నేను ఇవి చేసేసి ఎలా ఉన్నాయో చెప్తాను. నాకు ఉస్మానియా బిస్కట్లంటే చాలా ఇష్టం.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ జ్యోతి గారు. మీరు చేసాక మార్పు చేర్పులుంటే తప్పక సూచించండి.

    ReplyDelete
  3. http://appalaraj.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete
  4. నాక్కూడా ఇవి చాలా ఇష్టం. నేను మా ఆవిడను బతిమాలి ఒప్పించాను. పైన చెప్పిన విధానం చాలా సులభంగానే అగుపించిందట మరి. చూద్దాం.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...