Skip to main content

అవినీతిపై యుద్ధం

ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసు వాడికి, తహసీలు ఆఫీసు గుమాస్తాకి, మున్సిపాలిటీ ఇంజనీరుకి, ఎమ్మెల్యేకి, మంత్రికి మామూళ్ళు సమర్పించుకుంటూ బతుకులీడ్వడం అలవాటైన మనకు అన్నా హజారే చేస్తున్న ప్రయత్నం ఏటికి ఎదురీదడంలా కనిపించవచ్చు. 

అవినీతి ఇప్పుడు దేశంలో ఎంతగా పాతుకు పోయిందంటే, అదొక తప్పనిసరి వ్యవహారంలా ప్రతి ఒక్కరికి అలవాటై పోయింది. ఊళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే క్రిందిలాంటి సంభాషణలు వినడం సర్వ సాధారణం.

"కలెక్టర్ ఆఫీసుకు వెల్లినవ్ కదా? పనైందా?"

"కాలేదన్నా, పైసలు అడుగుతున్నడు".

"అరే, పిచ్చోనివా? పైసలు లేందే పనులైతయా?"

పై సంభాషణ ఏం చెప్పుతుంది. ప్రజలు అవినీతి పై నిరసన వ్యక్తం చేయడం లేదు. అదొక ట్రాఫిక్ రూల్ లాగా, ఇంటి పన్నులాగా, కరెంటు బిల్లు లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయక తప్పని పనిగా భావిస్తున్నారు. అరవై సంవత్సరాల 'ప్రజా'స్వామ్య పాలన చూసాక ఇక దీన్ని ఎవరూ మార్చలేరన్న భావనకు వచ్చేశారు. ఇక ఇలాంటి భావనకు వచ్చిన తర్వాత "ఎలాగూ మీరు తింటున్నారుగా, వోటేస్తే మాకేమిస్తారు?" అన్న ప్రశ్నలు కూడా మొదలు పెట్టడంలో ఆశ్చర్యమేముంది?

కాని, భూతంలా పెరిగిపోయిన అవినీతికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్ట వలసిన అవసరం ఉంది. దీనికి అన్నా హాజారే పూనుకొని ముందుకు రావడం, జనలోక్పాల్ బిల్లు కోసం పోరాడడం ఏంటో సంతోషించా దగ్గ విషయం. ఆయన తన ప్రాణాలనైనా పణంగా పెట్టి, బిల్లు కోసం చివరి శ్వాస వరకూ పోరాడుతానని ఖరాఖండీగా చెప్పి తన నిబద్ధతను చాటుకున్నారు. ఇక నిబద్ధతను చూపవలసిన అవసరం దేశ ప్రజలపై ఉంది. ప్రజలు ఆయనకిచ్చే మద్దతుపైనే జయాప జయాలు ఆధారపడి ఉంటాయి.

ఇప్పటికే దేశమంతటా అనేక ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా ప్రజలు తమ మద్దతును స్వచ్చందంగా తెలుపు తున్నారు. ఇది చాలా సంతోషించా దగ్గ విషయం. ఇటీవల మరే విషయం పై కూడా ప్రజలంతా ఒక్క తాటిపై నిలబడ్డ దాఖలాలు లేవు. 

సమస్యలను నాన్చుతూ, అవినీతి రాజభోజ్యంగా భావించే కాంగ్రెస్ పార్టీ "అన్నా హాజారే లోక్ పాల్ కమిటీ చైర్మన్ గా ఉండడానికి దీక్ష చేపట్టారని" అర్థంవచ్చేలా వదంతులు వ్యాప్తి చేయడం మొదలు పెట్టింది. దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ అన్నా ఆ పదవికి ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సూచిస్తూ అధికార పార్టీ కుట్ర పూరిత ఆలోచనలకు ఆదిలోనే అడ్డుకున్నారు.

దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మార్చడానికి ఇది సరయిన సమయం. దేశ భక్తులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం తక్షణావసరం.

Comments

  1. ప్రాంతీయ విద్వేషక విభజన కారులు, కెసిఆర్ అనుచరులు కూడా అవినీతి మీద మాట్లాడుతున్నారహో .. :)))

    ReplyDelete
  2. Snkr

    తెలంగాణా విభజనవాదం మొదలయ్యిందే రాష్ట్రాన్ని తమ పెరటిగేదెలా మార్చుకుని అడ్డూ ఆపూ లేకుండా వేల కోట్లు దిగమింగిన, మింగుతున్న ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా. సమైక్యవాదాన్ని నర నరానా నింపుకున్న రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లగడపాటి, రాయపాటి, కావూరి, తిక్కవరపు etc, రాష్ట్రంపై ప్రేమతో అలా మాట్లాడుతున్నారని తమరిలాంటి అమాయకులు భావిస్తున్నారేమో కాని, తెలంగాణా వారికి ఎలాంటి భ్రమలు లేవు.

    ఇక విద్వేషం గురించి మాట్లాడాలంటే, ఒక ప్రాంతం వారిపై నిలువెల్లా ద్వేషం నింపుకుని బ్లాగు బ్లాగూ తిరుగుతూ తమరు పెట్టే కామెంట్లు చదివిన వారికెవరికైనా తెలుస్తుంది, విద్వేషం అంటే ఎలా వుంటుందో!

    ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడానికి మరోసారి ఇక్కడికి రావద్దు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...