Skip to main content

అవినీతిపై యుద్ధం

ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసు వాడికి, తహసీలు ఆఫీసు గుమాస్తాకి, మున్సిపాలిటీ ఇంజనీరుకి, ఎమ్మెల్యేకి, మంత్రికి మామూళ్ళు సమర్పించుకుంటూ బతుకులీడ్వడం అలవాటైన మనకు అన్నా హజారే చేస్తున్న ప్రయత్నం ఏటికి ఎదురీదడంలా కనిపించవచ్చు. 

అవినీతి ఇప్పుడు దేశంలో ఎంతగా పాతుకు పోయిందంటే, అదొక తప్పనిసరి వ్యవహారంలా ప్రతి ఒక్కరికి అలవాటై పోయింది. ఊళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే క్రిందిలాంటి సంభాషణలు వినడం సర్వ సాధారణం.

"కలెక్టర్ ఆఫీసుకు వెల్లినవ్ కదా? పనైందా?"

"కాలేదన్నా, పైసలు అడుగుతున్నడు".

"అరే, పిచ్చోనివా? పైసలు లేందే పనులైతయా?"

పై సంభాషణ ఏం చెప్పుతుంది. ప్రజలు అవినీతి పై నిరసన వ్యక్తం చేయడం లేదు. అదొక ట్రాఫిక్ రూల్ లాగా, ఇంటి పన్నులాగా, కరెంటు బిల్లు లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయక తప్పని పనిగా భావిస్తున్నారు. అరవై సంవత్సరాల 'ప్రజా'స్వామ్య పాలన చూసాక ఇక దీన్ని ఎవరూ మార్చలేరన్న భావనకు వచ్చేశారు. ఇక ఇలాంటి భావనకు వచ్చిన తర్వాత "ఎలాగూ మీరు తింటున్నారుగా, వోటేస్తే మాకేమిస్తారు?" అన్న ప్రశ్నలు కూడా మొదలు పెట్టడంలో ఆశ్చర్యమేముంది?

కాని, భూతంలా పెరిగిపోయిన అవినీతికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్ట వలసిన అవసరం ఉంది. దీనికి అన్నా హాజారే పూనుకొని ముందుకు రావడం, జనలోక్పాల్ బిల్లు కోసం పోరాడడం ఏంటో సంతోషించా దగ్గ విషయం. ఆయన తన ప్రాణాలనైనా పణంగా పెట్టి, బిల్లు కోసం చివరి శ్వాస వరకూ పోరాడుతానని ఖరాఖండీగా చెప్పి తన నిబద్ధతను చాటుకున్నారు. ఇక నిబద్ధతను చూపవలసిన అవసరం దేశ ప్రజలపై ఉంది. ప్రజలు ఆయనకిచ్చే మద్దతుపైనే జయాప జయాలు ఆధారపడి ఉంటాయి.

ఇప్పటికే దేశమంతటా అనేక ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా ప్రజలు తమ మద్దతును స్వచ్చందంగా తెలుపు తున్నారు. ఇది చాలా సంతోషించా దగ్గ విషయం. ఇటీవల మరే విషయం పై కూడా ప్రజలంతా ఒక్క తాటిపై నిలబడ్డ దాఖలాలు లేవు. 

సమస్యలను నాన్చుతూ, అవినీతి రాజభోజ్యంగా భావించే కాంగ్రెస్ పార్టీ "అన్నా హాజారే లోక్ పాల్ కమిటీ చైర్మన్ గా ఉండడానికి దీక్ష చేపట్టారని" అర్థంవచ్చేలా వదంతులు వ్యాప్తి చేయడం మొదలు పెట్టింది. దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ అన్నా ఆ పదవికి ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సూచిస్తూ అధికార పార్టీ కుట్ర పూరిత ఆలోచనలకు ఆదిలోనే అడ్డుకున్నారు.

దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మార్చడానికి ఇది సరయిన సమయం. దేశ భక్తులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం తక్షణావసరం.

Comments

  1. ప్రాంతీయ విద్వేషక విభజన కారులు, కెసిఆర్ అనుచరులు కూడా అవినీతి మీద మాట్లాడుతున్నారహో .. :)))

    ReplyDelete
  2. Snkr

    తెలంగాణా విభజనవాదం మొదలయ్యిందే రాష్ట్రాన్ని తమ పెరటిగేదెలా మార్చుకుని అడ్డూ ఆపూ లేకుండా వేల కోట్లు దిగమింగిన, మింగుతున్న ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా. సమైక్యవాదాన్ని నర నరానా నింపుకున్న రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లగడపాటి, రాయపాటి, కావూరి, తిక్కవరపు etc, రాష్ట్రంపై ప్రేమతో అలా మాట్లాడుతున్నారని తమరిలాంటి అమాయకులు భావిస్తున్నారేమో కాని, తెలంగాణా వారికి ఎలాంటి భ్రమలు లేవు.

    ఇక విద్వేషం గురించి మాట్లాడాలంటే, ఒక ప్రాంతం వారిపై నిలువెల్లా ద్వేషం నింపుకుని బ్లాగు బ్లాగూ తిరుగుతూ తమరు పెట్టే కామెంట్లు చదివిన వారికెవరికైనా తెలుస్తుంది, విద్వేషం అంటే ఎలా వుంటుందో!

    ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడానికి మరోసారి ఇక్కడికి రావద్దు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ