ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసు వాడికి, తహసీలు ఆఫీసు గుమాస్తాకి, మున్సిపాలిటీ ఇంజనీరుకి, ఎమ్మెల్యేకి, మంత్రికి మామూళ్ళు సమర్పించుకుంటూ బతుకులీడ్వడం అలవాటైన మనకు అన్నా హజారే చేస్తున్న ప్రయత్నం ఏటికి ఎదురీదడంలా కనిపించవచ్చు.
అవినీతి ఇప్పుడు దేశంలో ఎంతగా పాతుకు పోయిందంటే, అదొక తప్పనిసరి వ్యవహారంలా ప్రతి ఒక్కరికి అలవాటై పోయింది. ఊళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే క్రిందిలాంటి సంభాషణలు వినడం సర్వ సాధారణం.
"కలెక్టర్ ఆఫీసుకు వెల్లినవ్ కదా? పనైందా?"
"కాలేదన్నా, పైసలు అడుగుతున్నడు".
"అరే, పిచ్చోనివా? పైసలు లేందే పనులైతయా?"
పై సంభాషణ ఏం చెప్పుతుంది. ప్రజలు అవినీతి పై నిరసన వ్యక్తం చేయడం లేదు. అదొక ట్రాఫిక్ రూల్ లాగా, ఇంటి పన్నులాగా, కరెంటు బిల్లు లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయక తప్పని పనిగా భావిస్తున్నారు. అరవై సంవత్సరాల 'ప్రజా'స్వామ్య పాలన చూసాక ఇక దీన్ని ఎవరూ మార్చలేరన్న భావనకు వచ్చేశారు. ఇక ఇలాంటి భావనకు వచ్చిన తర్వాత "ఎలాగూ మీరు తింటున్నారుగా, వోటేస్తే మాకేమిస్తారు?" అన్న ప్రశ్నలు కూడా మొదలు పెట్టడంలో ఆశ్చర్యమేముంది?
కాని, భూతంలా పెరిగిపోయిన అవినీతికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్ట వలసిన అవసరం ఉంది. దీనికి అన్నా హాజారే పూనుకొని ముందుకు రావడం, జనలోక్పాల్ బిల్లు కోసం పోరాడడం ఏంటో సంతోషించా దగ్గ విషయం. ఆయన తన ప్రాణాలనైనా పణంగా పెట్టి, బిల్లు కోసం చివరి శ్వాస వరకూ పోరాడుతానని ఖరాఖండీగా చెప్పి తన నిబద్ధతను చాటుకున్నారు. ఇక నిబద్ధతను చూపవలసిన అవసరం దేశ ప్రజలపై ఉంది. ప్రజలు ఆయనకిచ్చే మద్దతుపైనే జయాప జయాలు ఆధారపడి ఉంటాయి.
ఇప్పటికే దేశమంతటా అనేక ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా ప్రజలు తమ మద్దతును స్వచ్చందంగా తెలుపు తున్నారు. ఇది చాలా సంతోషించా దగ్గ విషయం. ఇటీవల మరే విషయం పై కూడా ప్రజలంతా ఒక్క తాటిపై నిలబడ్డ దాఖలాలు లేవు.
సమస్యలను నాన్చుతూ, అవినీతి రాజభోజ్యంగా భావించే కాంగ్రెస్ పార్టీ "అన్నా హాజారే లోక్ పాల్ కమిటీ చైర్మన్ గా ఉండడానికి దీక్ష చేపట్టారని" అర్థంవచ్చేలా వదంతులు వ్యాప్తి చేయడం మొదలు పెట్టింది. దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ అన్నా ఆ పదవికి ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సూచిస్తూ అధికార పార్టీ కుట్ర పూరిత ఆలోచనలకు ఆదిలోనే అడ్డుకున్నారు.
దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మార్చడానికి ఇది సరయిన సమయం. దేశ భక్తులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం తక్షణావసరం.
ప్రాంతీయ విద్వేషక విభజన కారులు, కెసిఆర్ అనుచరులు కూడా అవినీతి మీద మాట్లాడుతున్నారహో .. :)))
ReplyDeleteSnkr
ReplyDeleteతెలంగాణా విభజనవాదం మొదలయ్యిందే రాష్ట్రాన్ని తమ పెరటిగేదెలా మార్చుకుని అడ్డూ ఆపూ లేకుండా వేల కోట్లు దిగమింగిన, మింగుతున్న ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా. సమైక్యవాదాన్ని నర నరానా నింపుకున్న రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లగడపాటి, రాయపాటి, కావూరి, తిక్కవరపు etc, రాష్ట్రంపై ప్రేమతో అలా మాట్లాడుతున్నారని తమరిలాంటి అమాయకులు భావిస్తున్నారేమో కాని, తెలంగాణా వారికి ఎలాంటి భ్రమలు లేవు.
ఇక విద్వేషం గురించి మాట్లాడాలంటే, ఒక ప్రాంతం వారిపై నిలువెల్లా ద్వేషం నింపుకుని బ్లాగు బ్లాగూ తిరుగుతూ తమరు పెట్టే కామెంట్లు చదివిన వారికెవరికైనా తెలుస్తుంది, విద్వేషం అంటే ఎలా వుంటుందో!
ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడానికి మరోసారి ఇక్కడికి రావద్దు.